నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 12:35

అమ్మతోడు... మీరు నమ్మండి.. ఇది నీటి మడుగు కాదు.. రోడ్డే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ, అధికర పార్టీ నేతలు మాత్రం వీటిని మాటలతో తిప్పికొడుతున్నారు..

దీనికి గుంటూరు జిల్లా కాకునూరు - కొమ్మూరు గ్రామాల మధ్య ఉన్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి కావడం గమనార్హం.

జిల్లా కేంద్రం బాపట్లకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. కానీ, ఈ రోడ్డు దుస్థితి చూస్తే బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా నాలుగు కిలోమీటర్ల భారీగా గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చకపోవడంతో వర్షం కురిస్తే చిన్నపాటి మడుగులుగా కనిపిస్తున్నాయి. కార్లు గుంతల్లో వెళ్లగానే ఆగిపోతున్నాయి. ఇక ద్విచక్రవాహనదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్డు అంచుల వెంబడి ప్రమాదకర స్థాయిలో వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ ఆటో గుంతను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా వారు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం..

దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఈ రహదారిలో సీఎ జగన్ లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్డు బాగుపడుతుందని కాకుమాను ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, సీఎం వస్తున్నారంటే నిధులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు రహదారుల నిర్మాణాలు చేపడతారు కదా?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారుల వాహనాలు కూడా ఉంటాయి..

నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 12:33

PM Modi in Jakarta: జకార్తా టూర్‌లో ప్రధాని మోదీ..

రెండ్రోజుల్లో ఇండియాలో జీ-20 సదస్సు ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన షెడ్యూల్‌ని అత్యంత బిజీగా ఉంచుకుంటూ.. ఇవాళ ఇవాళ ఇండొనేసియాలోని జకార్తాలో పర్యటిస్తున్నారు..

అక్కడ ఇవాళ జరిగే 20వ ఆసియన్ (ASEAN)- ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఇండియా అమలుచేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ గ్రూప్.. మూల స్తంభం లాంటిది అని మోదీ అన్నారు.

ఇండో-పసిఫిక్ దేశాలపై ఆసియన్ గ్రూప్ అవుట్‌లుక్‌ని పూర్తిగా భారత్ సమర్థిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. "మన భాగస్వామ్యం 4వ దశాబ్దంలోకి ప్రవేశించింది. ఇండియా యొక్క ఇండో-పసిఫిక్ ఇన్షియేటివ్‌లో ఆసియన్ కీలక పాత్ర పోషిస్తోంది" అని మోదీ తెలిపారు.

ఆసియన్ గ్రూపు.. అభివృద్ధికి కీలక కేంద్రంగా ఉందనీ, ప్రపంచ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. "మన పరస్పర సహకారంలో స్థిరమైన వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా మనం కలిసి సాగుతున్నాం" అని మోదీ అన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 09:44

తిరుమల లో చిక్కిన ఐదో చిరుత

తిరుమల అలిపిరి నడక మార్గంలో బుధవారం రాత్రి మరో చిరుత చిక్కింది.

నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు వద్ద ఇటీవల చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాల్లో గుర్తించిన… అక్కడే బోను ఏర్పాటు చేసి బంధించారు. నిన్న అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది

గత రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు ...

నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 09:15

పసుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్:ఎంపీ అర్వింద్‌

దశాబ్దాల పసుపు రైతుల కల త్వరలోనే నెరవేరనుంది. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు వచ్చే నెలలో మోడీ పర్యటన సందర్భంగా బోర్డును ప్రారంభించడానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ రాజకీయాలను పసుపు బోర్డు ఏర్పాటు అంశం షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితను ఓటమి పాలు చేసింది కూడా పసుబోర్డు అంశమే. 2014 పార్లమెంట్ ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కవిత దాన్ని నెరవేర్చకపోవడంతో వందలమంది రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి ఆమె ఓటమికి కారణమయ్యారు.

అదే ఎన్నికల్లో అర్వింద్ తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెప్పిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రకాల బోర్డులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 09:14

తిరుపతి లో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు గురువారం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

బుధవారం రోజున 75,804 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు జరుగనున్నాయి...

నిజంనిప్పులాంటిది

Sep 07 2023, 08:00

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4లక్షల టిక్కెట్లు.. సెప్టెంబర్...8 నుండి టికెట్స్ అందుబాటులో

ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొని ఉంది.అందుకే అందరూ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఈ క్రమంలో ICC, BCCI విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అభిమానుల నుంచి నిరంతర ఫిర్యాదుల తరువాత, BCCI మరో రౌండ్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో అన్ని మ్యాచ్‌ల కోసం మొత్తం 4 లక్షల టిక్కెట్లు సేల్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్ 8 న విక్రయాలు ప్రారంభం..

ఈ 4 లక్షల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని ప్రపంచ కప్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరోసారి టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించాలని బీసీసీఐ అభిమానులకు సూచించింది. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మరో రౌండ్ విక్రయాలు ఉంటాయని, దాని గురించి త్వరలో అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఇండియన్ బోర్డ్ తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Sep 06 2023, 21:45

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్డ్ ప్రకటించిన కాంగ్రెస్..

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది..

గురువారం (సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 30 వరకు సాగుతుందని ఆ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 06 2023, 21:45

ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌… రాష్ట్ర వ్యాప్తంగా అమలు?

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ విధానం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు అమలు చేయనున్నారు.

అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ తీసుకోనున్నారు. ఇక ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థుల అటెండెన్స్‌ అంతా ఫేషియల్‌ రికగ్నషన్‌లోకి మారనుంది.

ముందస్తుగా మొదటి దశలో విద్యార్థులకు అమలు చేశాక, తర్వాత టీచర్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 10 జిల్లాలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలులో ఉన్నది.

ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ విద్యార్థులకు విజయవంతంగా అమలు చేశాక, బయోమెట్రిక్‌ స్థానంలో ఉపాధ్యాయులకు సైతం షేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ను అమలు చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి...

నిజంనిప్పులాంటిది

Sep 06 2023, 21:43

పాపికొండల విహారయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌

గోదావరి పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు.

ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారులు పేరంటపల్లికి వెళ్లారు.