Mane Praveen

Aug 07 2023, 17:18

NLG: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం లు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్ హెచ్ ఎం లలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లుగా గత 15 సంవత్సరాలుగా, పిఎస్సీలలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఎన్ఎం లు మాట్లాడుతూ.. వీఆర్ఏ పంచాయతీ కార్యదర్శిలతో పాటు, ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ పరం చేయడం జరిగింది. కానీ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న మమ్మల్ని మాత్రమే ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఏఎన్ఎంలు చనిపోయిన కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, వారి కుటుంబాలు  ఈరోజు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో, ఈ నెల 4వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కార్యక్రమంలో సుమారు 3500 మంది సెకండ్ ఏఏఎంలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి, ఏఎన్ఎంలు స్వప్న, సుచిత్ర, సరిత, పద్మ , రోజా, మమత, మంజుల, సుమలత, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 14:23

మర్రిగూడెం: ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళి                    
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో, సోమవారం ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం చాలా బాధాకరం అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారు మరణించడం కళాకారులకు తీరనిలోటు అని అన్నారు. కార్యక్రమంలో బిక్షం నర్సిరెడ్డి ముత్యాలు మామిడి కృష్ణ, కేశగోని  రామచంద్రం, ఈద అభి సందేశ్, నవీన్, వాకిటి హరీష్, కొడిచర్ల అభి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 07 2023, 10:47

NLG: ఇండియన్ లైబ్రరీ ఫెస్టివల్ 2023 లో పాల్గొన్న ఎన్జీ కళాశాల గ్రంథ పాలకుడు దుర్గాప్రసాద్
ఇండియన్ లైబ్రరీ ఫెస్టివల్ 2023, ఈ నెల 5,6 తేదీలలో ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచ్చేసి గ్రంధాలయాల ఆవశ్యకతను, గ్రామ గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రసంగించారు. ముగింపు సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ కర్ విచ్చేసి ప్రతి మారుమూల ప్రాంతంలో జిల్లాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గ్రంథ పాలకులు, దేశవ్యాప్తంగా పేరు పొందిన గ్రంథ పాలకులు పాల్గొని వారి యొక్క అనుభవాలను వేదిక పై పంచుకున్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గ్రంథ పాలకుడు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మరియు  హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలో పనిచేస్తున్న గ్రంథ పాలకుడు డాక్టర్ రవి కుమార్ చెగొని పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 09:49

TS: అధికార లాంఛనాలతో గద్దర్ అంతక్రియలు
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ అంతక్రియలను అధికార లాంఛనాలతో చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుండి గద్దర్ ఇంటి వరకు అంతిమయాత్ర నిర్వహించనుంది. అల్వాల్ లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.

Mane Praveen

Aug 06 2023, 22:26

గద్దర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసిన పలువురు రాజకీయ ప్రముఖులు
HYD: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో..  తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ మృతికి సంతాపం తెలిపి, గద్దర్ పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మరియు పలువురు రాజకీయ ప్రముఖులు, తదితరులు గద్దర్ పార్టీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Mane Praveen

Aug 06 2023, 21:01

NLG: మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  టి.జి.సి.జి.టి.ఏ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలుపొందిన సంఘ నాయకుల గౌరవార్థం, ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కళాశాలల అధ్యాపకులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  అధ్యక్షత వహించిన నల్లగొండ జిల్లా సంఘ అధ్యక్షులు డా. మునీర్ మాట్లాడుతూ.. ప్రాథమిక సభ్యుల కొరకు పనిచేస్తున్న సురేందర్ రెడ్డి నాయకత్వంలో భాగమైనందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన డా. మారం గోనారెడ్డి  మాట్లాడుతూ.. విద్యా సమస్యల పై పోరాటం చేస్తున్న ఈ నాయకత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలోని సమస్యలపై, అధ్యాపకుల హక్కులకై  నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవ సలహాదారు, ప్రముఖ కవి  డా. బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధికి సంఘ నాయకులు, ప్రాథమిక సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్. గోపి, సంఘ నిర్వాహక కార్యదర్శి డా. ఎస్. రాజారాం, మహిళా కార్యదర్శి డా.ఇ. పావని, కార్య నిర్వాహక సభ్యురాలు డా. ఐ. వాణి, నల్లగొండ జిల్లా కార్యదర్శి డా. సి.హెచ్. రామరాజు, యాదాద్రి జిల్లా అధ్యక్షులు డి. కిషన్ మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయ కర్తలు   పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయ కర్తగా జిల్లా ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి వ్యవహరించారు.

Mane Praveen

Aug 06 2023, 20:44

ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్లు: వేముల గోపీనాథ్  
ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్లు: వేముల గోపీనాథ్   నల్గొండ : సుదీర్ఘ కాలం పాటు విప్లవోద్యమం తో పాటు, ప్రజా ఉద్యమాలలో సాంస్కృతిక ఉద్యమాన్ని రగిలించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బుల్లెట్ లను  సైతం లెక్కచేయకుండా అలుపెరగని ప్రజా యుద్ధ పోరాట యోధుడు గద్దర్ అన్న మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వేముల గోపినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. గోపీనాథ్ ఆదివారం  మాట్లాడుతూ.. గద్దర్ అన్న మృతి పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ కు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా పేరు భావించబడిన గద్దర్, మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత గద్దర్ అన్న తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ వనరులు మాకే దక్కాలని.. మా నీళ్లు.. మా నిధులు.. మాకే దక్కాలని, గొంతు ఎత్తి ప్రతినిత్యం పాట పాడే ప్రజా గాయకుడు గొంతు మూగబోవడం, ఆయన లేని లోటు తీరనిదని, ప్రజా సమస్యలను పాలకులకు చేరవేయడంలో గద్దర్ అన్న పోరాటం  మరువలేనిది అన్నారు.

Mane Praveen

Aug 06 2023, 13:08

NLG: బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ 89వ జయంతి
నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి అని గౌరీశంకర్ అన్నారు. బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 89 వ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి.. తెలుగు అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్, టీఎన్జీవో నాయకులు శ్రవణ్ కుమార్, శ్రీనివాసాచారి, కిరణ్ కుమార్, ప్రదీప్ , కవులు రచయితలు మునాస వెంకన్న, కృష్ణకౌడిన్య, బుచ్చిరెడ్డి, వివిధ హోదాల ప్రజా ప్రతినిధులు  మరియు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు.  ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ అంచలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయ్యారన్నారు. అందరి హృదయాలలో నిలిన మహోన్నత వ్యక్తి ప్రో. జయశంకర్ సార్ అని అన్నారు.

Mane Praveen

Aug 06 2023, 12:28

NLG: ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 89వ జయంతి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రోపెసర్ కొత్తపల్లి జయశంకర్  89వ జయంతి కార్యక్రమాన్ని, జాతీయ సేవా పథకం మరియు వ్యాయమ విద్యా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. NSS PO యాదగిరి రెడ్డి, పిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, డా. కృష్ణ కౌండిన్య, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 22:36

ఎల్ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ ను విజయవంతం చేయాలి: బుర్రి వెంకన్న
TS: బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, ఆదివారం   హైదరాబాదులోని సైఫాబాద్ లో, సామ్రాట్ కమర్షియల్ కాంప్లెక్స్ యందు గల ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ లో జరగనున్న  'ఎల్ ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ' ను దిగ్విజయం చేయాలను, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఉద్యమ సన్నిహితుడు ఎల్ఆర్ బాలే,  పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నవాన్ షహర్ జిల్లాలోని షాహిద్ భగత్ సింగ్ నగర్ లో 1930లో జూలై 20న జన్మించారు. ఎల్ ఆర్ బాలే ఢిల్లీలో తపాల శాఖలో పని చేసేవారు. ఆయనకు ప్రతి సాయంత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ ను కలుసుకునే అవకాశం కలిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవనశైలి, దినచర్య, పుస్తక పఠనం రచన, వ్యాసంగం, సంభాషణ ఇవన్నీ సమీపము నుంచి పరిశీలించి ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడినారని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పని చేయడానికి ఎల్ ఆర్ బాలే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 1958 లో భీమ్ పత్రిక పక్ష పత్రికను ప్రారంభించారు. అలాంటి గొప్ప అంబేద్కర్ వాది ఎల్ఆర్ బాలే గారి సంతాప సభను  హైదరాబాదులో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని బుర్రి వెంకన్న తెలిపారు.

ఈ సంతాప సభకు మాజీ జాతీయ అధ్యక్షులు బాబా సాహెబ్ అంబేద్కర్ తో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తులు కూడా వస్తున్నారని వారు తెలియజేశారు.  అంబేద్కర్ వాదులంతా విచ్చేసి ఈ  సంతాప సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక దళ్ సంస్థలో పనిచేయడం చాలా గర్వకారణమని అన్నారు.