NLG: శాసనసభ సమావేశంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి: జనార్దన్ గౌడ్
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న బిసి ఏ సంక్షేమ హాస్టల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మొదటగా విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి, బిసి సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంతభవనాలు ఎర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని, ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన చేసుకోవాలని అన్నారు.
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వాన్ని, పోరాట పట్టిమ పెంచుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించకపోవడం చాలా దుదుష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిరంతరం విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారని, సంక్షేమ వసతి గృహాలైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందంటే ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితమే అని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంక్షేమ కమిటీలు వేస్తామని అన్నారు. ఈరోజు బీసీ ఏ హాస్టల్లో కమిటీని వేయడం జరిగింది. హాస్టల్ అధ్యక్షుడిగా ఏ. వేణు, ఉపాధ్యక్షుడిగా కే. నాగరాజు, జనరల్ సెక్రెటరీగా కే .హరీష్ , సెక్రటరీగా బి .ఉదయ శంకర్ ,కార్యదర్శిగా వి .అఖిల్ లను నియమించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, మహేష్, కుమార్, సురేష్ , పృధ్విరాజ్, శంకర్ మణికంఠ, రమేష్, రాఘవేంద్ర, హరి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న బిసి ఏ సంక్షేమ హాస్టల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మొదటగా విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి, బిసి సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంతభవనాలు ఎర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని, ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన చేసుకోవాలని అన్నారు.
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వాన్ని, పోరాట పట్టిమ పెంచుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించకపోవడం చాలా దుదుష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిరంతరం విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారని, సంక్షేమ వసతి గృహాలైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందంటే ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితమే అని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంక్షేమ కమిటీలు వేస్తామని అన్నారు. ఈరోజు బీసీ ఏ హాస్టల్లో కమిటీని వేయడం జరిగింది. హాస్టల్ అధ్యక్షుడిగా ఏ. వేణు, ఉపాధ్యక్షుడిగా కే. నాగరాజు, జనరల్ సెక్రెటరీగా కే .హరీష్ , సెక్రటరీగా బి .ఉదయ శంకర్ ,కార్యదర్శిగా వి .అఖిల్ లను నియమించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, మహేష్, కుమార్, సురేష్ , పృధ్విరాజ్, శంకర్ మణికంఠ, రమేష్, రాఘవేంద్ర, హరి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

హైద్రాబాద్: జూలై 28 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో రాజధాని లో జరిగిన ఆరవ టైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్ - 2023 లో ఛాంపియన్స్ మార్షల్ ఫిట్నెస్ అకాడమీ నిజాంపేట్ విద్యార్థిని నాగసాయి అరుషి (14).. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాగించడం పట్ల, తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ మహమూద్ ఆలీ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బుధవారం నాగసాయి అరుషి ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోచ్ మధుసూదన్, అసిస్టెంట్ కోచ్ బన్నీ అరుణ్, తల్లిదండ్రులు పవన్ కుమార్, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
TS: రైతు బీమా నమోదుకు చివరి తేదీ ఈ ఏడాది ఆగస్టు 5 అని అధికారులు తెలిపారు. కొత్తగా రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జూన్ 18 లోపు పొందినట్లయితే, రైతు బీమా నమోదుకు అర్హులని తెలిపారు.
అయితే వయసు 18_59 సంవత్సరాలు ఉన్న రైతులు అర్హులు అని తెలిపారు. అనగా 14.08.1964 నుండి 14.08.2005 మధ్య జన్మించిన వారు అర్హులు అని అన్నారు.
ఇందుకోసం రైతులు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలని సూచించారు.
TS: గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఫైనల్ కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తుది కీ ని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్కు టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనుంది.
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ జూన్ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పమేలా సత్పతి 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. వారు జీ.ఏ.డీ లో రిపోర్ట్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
వీరి స్థానంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణారెడ్డి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ని యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా టి. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ .1,50,000/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
అదేవిధంగా చండూర్ మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బి. రాధికకు రూ. 60,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే కూసుకుంట్ల అందజేశారు.
మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 1,00,000/- సహాయానిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
TS: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులు బిఈడి లేదా డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 15 న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు రూ.400 గా పేర్కొన్నారు. ఆన్లైన్లో https://tstet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.
నల్లగొండ జిల్లా, మునుగోడు: ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొంపెల్లి ఎంపిటిసి మోగుదాల సాలయ్య కుటుంబానికి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబానికి అందజేసి, వారికి భరోసా కల్పించి అండగా నిలిచారు. గతంలో ఆ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందజేశారు.
ఆ కుటుంబ పరిస్థితిని చూసి 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబ సభ్యులకు అందజేసి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ: యాదవ సంఘం భవన్లో జిల్లా యాదవ విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు ఈరటి బాలరాజు యాదవ్ అధ్యక్షతన, సోమవారం యాదవ విద్యావంతుల ఐక్య వేదిక సంఘం కార్యక్రమంలో, రాష్ట్ర యాదవ సంఘం విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ మరియు రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్యవేదిక కార్యదర్శి దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్ ల నుండి.. జిల్లా యాదవ ఐక్యవేదిక సంఘం కార్యదర్శిగా మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యాదవ సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు యాదవ సోదరులు పాల్గొన్నారు.
Aug 02 2023, 21:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.7k