నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:32

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం?

కర్ణాటక ప్రభావంతో ఇక్కడా అమలుకు యోచన

సాధ్యాఅసాధ్యాలపై సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం

మహిళా ప్రయాణికులపై అధ్యయనం షురూ!

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. మరిన్ని జనాకర్షక పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న అసతృప్తిని దూరం చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన హామీలు ప్రధాన కారణం కావడం.. ముఖ్యంగా అక్కడి మహిళలకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ బాగా పనిచేసినట్లు ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఈ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. అక్కడ ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఈనెల 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అక్కడ ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇదేతరహా పథకాన్ని తెలంగాణలోనూ అక్కడికంటే ముందుగానే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిసింది. పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వెంటనే సర్వే చేపట్టి నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం.. తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణలో ప్రతిరోజు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. ఇందులో సగానికి పైగా మహిళలుంటారు. పల్లె వెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్‌, మెట్రో, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య, అందులో మహిళా ప్రయాణికుల సంఖ్య.. తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక అందాక ముఖ్యమంత్రి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా సంస్థకు రోజుకు రూ.2 కోట్ల నష్టాలు వస్తున్నాయి. రోజురోజుకూ ఈ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ పెండింగులో ఉన్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైతే ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయి.

మద్దతు లేకుంటే గెలుపు కష్టమే!

రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రత్యేకంగా చేయించిన అనేక సర్వేల్లో స్పష్టమైంది. పార్టీకి చెందిన పులువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండనే ఉంది. అవినీతి, భూకబ్జాలు లాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనేకమంది ఉన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ పస్తావిస్తూ.. పద్ధతి మార్చుకోకుంటే ఈసారి సీటు దక్కదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు లేకుంటే మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. అధికారంలో ఉన్నందున ఇప్పటినుంచే మరిన్ని జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. బీసీలకు రూ.లక్ష రుణం పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. ఈ పథకంతో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గానికి మరింత దగ్గర కావచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 11:34

నేడు విశాఖలో అమిత్ షా పర్యటన

విశాఖపట్నం:జూన్ 11

ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు మారుతుంది. కొద్దీ రోజులుగా ఏపీపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. దానిలో భాగంగా.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ముందుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు.

బీజేపీ మహాసంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్నారు.. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది నిలిచిపోయి.. స్కామ్ లు నడుస్తున్నాయని జేపీ నడ్డా మండిపడ్డారు. అభివృద్దిలో మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. జగన్ సర్కార్ మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు.

అయితే ఇవాళ ఏపీలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

అయితే.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్‌ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్‌ ఉంటుందా?.. అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. వరుసగా ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులపై అమిత్ షా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి మరి...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:55

ఐపీఎస్ అధికారి పై భార్య ఫిర్యాదు : ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు

ఛత్తీస్గడ్:జూన్ 11

ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా. 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు.

ఆ సమయంలో కట్నకానుకల కోసం అమ్మాయి తల్లిదండ్రులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇటీవల, ఆమె భర్తపై పలు ఆరోపణలు చేశారు. వివాహం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారని, గృహ హింసతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేసేవారని కోర్బా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో చత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:33

రేపు తెరుచుకోనున్న మార్కెట్ యార్డ్ తలుపులు

గుంటూరు జిల్లా :జూన్‌ 11

నెలకు పైగా వేసవి సెలవుల అనంతరం మిర్చియార్డు గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ తలుపులు తెరుచుకోనున్నాయి.

సోమవారం ఈ నెల 12 నుంచి మిర్చి క్రయవిక్రయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీసుకొచ్చే మిర్చి లోడు లారీలు, ట్రాక్టర్లు, ఆటోలను ఆదివారం రాత్రి నుంచే యార్డు లోపలికి అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సెలవులకు ముందు వివిధ రకాల మిర్చి నాణ్యతని బట్టి క్వింటాల్‌కు రూ.22 వేలకు పైగా ధర లభించింది. నెల పాటు సెలవులు కారణంగా డిమాండ్‌ పెరిగి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.

గుంటూరు మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లలో దాదాపుగా 58 లక్షల మిర్చి టిక్కీల వరకు నిల్వ ఉంటాయని మార్కెటింగ్‌ వర్గాలు అంచనా వేస్తోన్నాయి............

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:30

మహిళా ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ మహిళ కానిస్టేబుల్

వరంగల్ జిల్లా :జూన్ 11

రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్ సోనాలి మాల్కే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు.

శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ నుంచి స్టేషన్‌లో దిగుతుండగా ఓ మహిళ కాలు జారి కిందపడిపోయింది.

దీంతో వెంటనే అప్రమత్తమై మహిళ కానిస్టేబుల్ పరిగెత్తుకెళ్లి కిందపడబోయిన ఆ మహిళను కాపాడారు.

మహిళ ప్రాణాల్ని కాపాడిన సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణీకులు అభినందించారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:29

ధర్మపురిలో కత్తిపోట్ల కలకలం

జగిత్యాల జిల్లా:జూన్ 10

ధర్మపురి పట్టణంలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం కత్తిపోట్లకు గురయ్యారు.

ప్రతి శనివారం జరిగే వారం సంత వసూళ్లకు వెళ్లిన ఇద్దరు స్థానిక యువకులపై ఆంధ్ర హోటళ్లో పని చేసే యువకులు కత్తులతో దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఇద్దరు యువకులకు మెడ పక్క టెముకల భాగంలో తీవ్ర గాయాలు కాగా ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ దాడికి పాత కక్షలు, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారం అయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, కత్తిపోట్ల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:26

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి:జూన్ 11

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

క్యూ కాంప్లెక్స్‌ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 88,626 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చినట్టు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 51,379 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 21:27

గ్రూప్‌-1 అభ్యర్థులకు కీలక సూచనలు..

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకోగా..

మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు చేసింది.

పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు

పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులకు అనుమతి నిరాకరణ

అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు

నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి

జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు

వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు

3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:54

JP Nadda: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్‌ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన..

మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్‌లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు..

శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

రాయలసీమ అభివృద్ధిని వైసీపీ సర్కార్‌ గాలికి వదిలేసింది అని విమర్శించారు జేపీ నడ్డా.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు.. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోడీ దే అన్నారు.. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు.

మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..

ఇక, బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం అని స్పష్టం చేశారు నడ్డా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించిందన్నారు.. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోడీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగిందన్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:50

బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్న ఈటల.. ఏం జరుగుతోంది..!

ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో జరుపుతున్న చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా బీజేపీ అగ్ర నేతలతో ఈటల రాజేందర్ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నేతలను కలిశారు.

తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను హైకమాండ్‌కు ఈటల వివరిస్తున్నారు. నిన్న అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ‌తో చర్చలు జరిపారు. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అనంతరం అసోం నుంచీ ఈటల ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది.

ఈరోజు ఢిల్లీలో పలువురి అగ్రనేతలతో ఈటల చర్చలు జరపనున్నట్లు సమాచారం. త్వరలోనే భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..