madagoni surendar

Apr 14 2023, 11:26

నల్గొండ జిల్లా. నకిరేకల్:అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని డా. బీ.ఆర్ అంబెడ్కర్ 132 వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందని అన్నారు. దేశంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.అంబేద్కర్‌ ఆశయాలకు రూపం కేసీఆర్‌ అని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాలకు బాబాసాహెబ్‌ మహోన్నత్వాన్ని చాటేలా ఏర్పాటు అని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర సెక్రటేరియట్‌కు పేరు.. చరిత్రకు సజీవ సాక్ష్యం అని ఆయన తెలిపారు. దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు.తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల సంక్షేమం అని ఆయన అన్నారు.దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.బిఆర్‌ఎస్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని అని ఆయన అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తెలంగాణ దళిత బంధు పథకం అమ‌లు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నద‌ని ఆయన చెప్పారు. డా.బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌య సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని తెలిపారు.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 13 2023, 16:29

నల్గొండ జిల్లా :నకిరేకల్ :రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

                              

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ మరియు నిమ్మ మార్కెట్, తాటికల్,చందంపల్లి మంగళపల్లి గ్రామాలలో పీఏసిఎస్, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...   

రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నేరుగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.

ధాన్యంలో తేమశాతం 17 కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రైతులకు అన్ని సంక్షేమ పధకాలను అందిస్తూ రైతుల మన్నలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు.

రైతులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.  

రైతుల సంక్షేమం కోసం సీఎం కెసిఆర్ ఎల్లవేళలా కృషి చేస్తున్నారని అన్నారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ నెంబర్లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 12 2023, 17:36

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.

హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు . స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి.ఉవ్వెత్తున ఎగసిపడుతున్నమంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది.

దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరాదీస్తున్నారు. చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

madagoni surendar

Apr 12 2023, 16:40

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం.

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం

మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏంటో కనిపిస్తుందంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన.. ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు.

అంతకు ముందు మంత్రి హరీష్ రావు ఏపీ రాష్ట్రంపై, అక్కడి పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధితో పోల్చి విమర్శనాత్మక కామెంట్లు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. దాంతో పాటు ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిని చెబుతూ… అక్కడి కంటే ఇక్కడ చాలా బెటర్ అని కితాబిచ్చారు. అంతే కాదు ఏపీలో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తు్న్నారన్న తరహాలో ఆరోపణలు చేశారు.

madagoni surendar

Apr 12 2023, 16:01

నల్గొండ జిల్లా :నకిరేకల్..కొండేటి మల్లయ్య ఆధ్వర్యలో.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు.

కొండేటి మల్లయ్య ఆధ్వర్యలో.కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు.

కట్టంగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య,ఆధ్వర్యంలో. ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కొండేటి మల్లయ్య క్యాపు కార్యాలయంలో కక్కిరేణి సైదులు గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుండా జలంధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంద్యాల అనంతరెడ్డి, పిన్నపురెడ్డి వెంకట్ రెడ్డి, చిలుముల సైదులు, దెందె శ్రీనివాస్, తేలు నాగారాజు, పిన్నపు రెడ్డి వేణు రెడ్డి, గంట సైదులు, తదితరులు పాల్గొన్నారు .

madagoni surendar

Apr 12 2023, 15:49

ఖమ్మం జిల్లా:బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి ..ఒకరు మృతి..ఆరుగురికి గాయాలు.

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి ..ఒకరు మృతి..ఆరుగురికి గాయాలు

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. బిఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా…ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు.

ఏమైందంటే..

కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేసింది. పక్కనే వంటలు చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పటాకులు పేల్చారు. కొన్ని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పై పడటంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

విమర్శలు..

ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం జరగడంపై బాధిత కుటుంబ సభ్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనంపై ఉన్న దృష్టి..కార్యకర్తల భద్రతపై లేదా అని ప్రశ్నిస్తున్నారు.

madagoni surendar

Apr 12 2023, 15:34

బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు కేంద్రం నందు ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో జరిగిన ప్రమాద ఘటనపై వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ..

ఈరోజు చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి,అధికార అహంకారంతో విచ్చలవిడిగా బాణాసంచా కాలుస్తూ, అక్కడ ఎవరున్నారు ఏంటి అని కూడా ఆలోచించకుండా కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, ఒకేసారి గందరగోళాని సృష్టించి బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె మీద పడి అందులోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు వ్యక్తుల కాలు తెగిపడడం, ఒకరి పొట్టలో నుండి పేగులు బయటికి రావడం మరియు మరికొందరికి తీవ్ర గాయాలు అవ్వడం అంటే చాలా చాలా బాధాకరం, ఈ ఘటనలో గాయపడిన బాధితులను తక్షణమే మెరుగైన వైద్యం అందించి అందుకు అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అలాగే ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో చీమలపాడు గ్రామాన్ని మాంసపు ముద్దలగా మార్చిన వారు ఎవరైనా సరే తక్షణమే రాజీనామా చేయాలని,అలాగే ఒక్కొక్క బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని,కుటుంబానికి ఒకరి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని,ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాలని వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ అన్నారు.

madagoni surendar

Apr 12 2023, 15:10

జానారెడ్డికి అస్వస్థత.. యశోదలో చేరిక

జానారెడ్డికి అస్వస్థత.. యశోదలో చేరిక

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి యశోద హాస్పిటల్ లో చేరారు. మోకాలి శాస్త్ర చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పూర్తి చెకప్ చేశారు. జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

జానారెడ్డి వయస్సు 76 సంవత్సరాలు. తెలంగాణలోనే మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా.. రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర జానారెడ్డికి ఉంది. రాజకీయాల్లో అజాత శత్రువుగా.. అన్ని పార్టీల్లోని నేతలకు ఇష్టమైన నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన శైలిలో పోరాటం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని.. కాంగ్రెస్ పార్టీని ఒప్పించటంలో ఎంతో కృషి చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన రికార్డ్ కూడా జానారెడ్డి సొంతం.

జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

madagoni surendar

Apr 12 2023, 15:02

నల్గొండ జిల్లా :కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు...

నల్గొండ జిల్లా :

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు...

తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించిన కుటుంభ సభ్యులు...

జానారెడ్డి కి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..

గుండె కు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుట్లోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేసిన వైద్యులు

ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో జానారెడ్డి..

madagoni surendar

Apr 12 2023, 14:47

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎం ఎస్ ఆర్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 54 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ మరియు 28 మందికి 10 లక్షల 50 వేల రూపాయల. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్, మన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం..అన్నారు.

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం నిలిచింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయకోణం దాగి ఉంది.

అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డల వివాహానికి డబ్బులు సహాయం చేయలేదు.

మహిళా సాధికారత మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది.

మన తెలంగాణ సర్కారుకు ఎల్లప్పుడూ మీ అందరి దీవెనలు ఉండాలి, ఆశీర్వాదం కావాలి అండగా నిలవాలి అన్నారు.

పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం..అందరూ ఆత్మాభిమానంతో బ్రతకాలన్నదే వారి ఆకాంక్ష.

కేసీఆర్ ఈ రాష్ట్రమే తన కుటుంబం అన్న కోణంలో ఆలోచిస్తారు. అందుకే కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్,రైతు బంధు, రైతు భీమా,దళిత బంధు,సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాలు వచ్చాయి.

అన్ని వర్గాల ప్రజలు సగౌరవంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..

పేదింటి ఆడబిడ్డలకు అమ్మవడి, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పథకం అమలు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో.ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య,జడ్పీటీసీ తరాల బలరాం,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,పీ.ఏ.సి.ఎస్. నూక సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచ్లు, ఎంపిటిసిలు,వార్డ్ నెంబర్లు,మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.