madagoni surendar

Feb 23 2023, 10:36

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు..

సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు..

madagoni surendar

Feb 22 2023, 19:37

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల మంత్రి కేటిఆర్ నకిరేకల్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర యువ నేత యంగలి గోపి గౌడ్ తో ఆప్యాయతో తమ్మీ బాగున్నావా అంటూ పలకరించారు..

madagoni surendar

Feb 21 2023, 21:08

గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను*_

గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

నూతనంగా నియమితులైన గృహసారధులు సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వానికి,మన జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను తెలియజేసారు.

మంగళవారం నాడు పెనుగంచిప్రోలు పట్టణంలోని GSR ఫంక్షన్ హల్,మరియు తంబరేణి గార్డెన్స్ నందు నందు పెనుగంచిప్రోలు మండల గృహసారధులతో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు,వారి తనయులు నియోజకవర్గ నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు శిక్షణ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని సూచించారు,ముఖ్యంగా కేటాయించిన గృహాలపై అహగాహణ కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు,అభివృద్ధి ప్రజలలోకి పూర్తీ స్థాయిలో తీసుకువెళ్లేలా ఉండాలని అన్నారు.వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని అన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమిచేశాడో,మన జగనన్న ఏమి చేసారో ప్రజలకు వివరించాలని అన్నారు.

మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కుల మత,ప్రాంత,పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు,గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందాలంటే తెలుగుదేశం నాయకులు చెప్పిన వారుకో లేదా పసుపు కండువా వేసుకున్నవారికే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు అని అన్నారు,నేడు అలాంటి దుస్థితి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు అని అన్నారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 21 2023, 17:39

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు*

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు

ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఘటన మరిచిపోకముందే, అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్త, అత్తను చంపి, ముక్కలుగా చేసింది ఓ ఇల్లాలు. తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. అసోంలోని గువాహటి సమీపంలో ఉన్న, నూన్ మటి ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. 

నిందితురాలు వందన కలితకు వివాహేతర సంబంధం కలిగి ఉండడమే ఈ హత్యలకు దారితీసినట్టు అనుమానిస్తున్నారు. భర్త అమర్ జ్యోతి దే, అత్త శంకరిదేలను, ప్రియుడి సాయంతో హత్య చేసిన వందన.. మూడు రోజుల పాటు మృతదేహాల ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి, అనంతరం మేఘాలయలోని చిరపుంజి ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను తీసుకెళ్లి, మృతదేహాల భాగాలను గుర్తించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ తర్వాత వాటిని సమీప అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పడేయడం తెలిసిందే.

madagoni surendar

Feb 21 2023, 13:08

హైదరాబాద్:రాష్ట్రoలోని గ్రామపంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం ఉదయం నుంచి 7.00 గంటల కే విధులకు హాజరు కావాలని పంచాయతీ రాజ్.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ,

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు. సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఇకపై ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వారు పంచాయతీ కార్యాలయం చేరుకొని రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్‌ఆర్‌) యాప్‌లో తమ స్వీయచిత్రాన్ని తీసి పంపించాలి. తర్వాత గ్రామ పంచాయతీలో రోడ్లపై వ్యర్థాలు, మురుగు కాల్వలు, నీటి ట్యాంకులు, పల్లె ప్రకృతివనాలు వీధిదీపాల వద్దకు వెళ్లి అయా చోట్ల ఫొటోలు తీసి పంపించాలి. ఆ తర్వాత ఆయా పనులను మల్టీపర్పస్‌ కార్మికులతో చేయించి, ట్రాక్టర్‌ ట్రాలీ ద్వారా వ్యర్థాలను తరలించే ఫొటోలను కూడా తీసి గంటగంటకూ పంపించాలి. వీధిదీపాలు ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగడం లేదు? అనే సమాచారం తెలపాలి. అన్ని వివరాలుంటేనే ఆ రోజు హాజరును నమోదు చేస్తామని పేర్కొంది. వేసవిలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువ కావడంతో పాటు తాగునీటి సరఫరాను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించానికి వీలుగా మరింత పర్యవేక్షణ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంత మంది యాప్‌లో తప్పుడు సమాచారం ఇస్తున్నందున ఆయా కార్యదర్శులకు వీడియోకాల్‌ చేసి తనిఖీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది.

పనివేళల నిర్ధారణ ఎప్పుడు ?

రాష్ట్రంలో 9,533 మంది గ్రామ కార్యదర్శులున్నారు. వీరిలో ఎనిమిది వేల మంది వరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కాగా.. మిగిలిన వారు పొరుగుసేవల కార్యదర్శులు. ఇప్పటివరకు పనివేళలు నిర్ధారణ కాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దాదాపు మూడు వేల మంది రెండేసి గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు చేయాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం యాప్‌లో ఒకేసారి రెండు చోట్ల ఫొటోలు దిగి నమోదు చేయడం ఎలా? అని వారు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రక్రియ, పూర్తిస్థాయి వేతనాల చెల్లింపుల సమస్యలూ అపరిష్కృతంగా ఉన్నాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

madagoni surendar

Feb 21 2023, 12:40

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా*

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా

కృష్ణా జిల్లా

గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిన్న జరిగిన టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. 

తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైంది.దీనివల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది.

పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది.

తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడి కి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.

సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది.

చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు.

గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంది.

ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. 

గన్నవరం పరిసర ప్రాంతాలకు 

ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

 

చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించవలసినదిగా జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ పత్రిక ముఖంగా తెలియజేశారు.

madagoni surendar

Feb 21 2023, 12:18

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి

రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి

క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Streetbuzz news:నల్గొండ జిల్లా :

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కట్టంగూర్ మండల హైస్కూల్ స్టటంర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు మంగళవారం నాడు వారు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ....క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Feb 21 2023, 08:39

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి : గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు..

madagoni surendar

Feb 21 2023, 08:35

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ*

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. బయటి వాళ్లు వచ్చి గన్నవరంలో గొడవ చేశారని, కేవలం తన అనుచరులే దాడికి దిగారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటని వంశీ ప్రశ్నించారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో నాకేంటి సంబంధం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని, తన జోలికి వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశారు. తానే కాదు, కొడాలి నాని కూడా ఇలాగే వ్యవహరిస్తాడని తెలిపారు. సంకల్పసిద్ధి కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, న్యాయం తనవైపే ఉందని స్పష్టం చేశారు. 

చంద్రబాబు చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసని, అందుకే వారి నేతలను తమపై ఉసిగొల్పుతున్నాడని వంశీ మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, చంద్రబాబు చేయగలిగిన ఏకైక పని గుడ్డకాల్చి ముఖంపై వేయడమేనని, అందులో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా ఆ స్కూలు నుంచి వచ్చిన వాళ్లమేనని వంశీ హెచ్చరించారు.

madagoni surendar

Feb 20 2023, 21:01

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం టేకులగూడేం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు యంపాల మల్లారెడ్డి భార్య జ్యోతి ఇటివలే రోడ్డు ప్రమాదంలో గాయపడగ,వారి ఇంటి కెల్లి పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

(ఈకార్యక్రమంలో)

పాలెం ఉపసర్పంచ్ పక్కీర్ మల్లారెడ్డి,అంజయ్య, లింగారెడ్డి,వెంకటేష్, మహేష్, అశోక్,తధితరులు పాల్గొన్నారు.