NLG: సీఎం కప్ 2026 జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్  ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో  అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
'ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్కిరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, నాగార్జున, సృజన, సరస్వతి, రంజాన్, మహమ్మద్ మరియు విద్యార్థులు అఖిల్ రెడ్డి, మహేష్, శ్రీధర్ రెడ్డి, సుచిత్ర, స్వాతి, దీప్తి, ప్రసన్న, వీణ, శివ, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ
77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ' నాన్న సేవా సమితి" ఆధ్వర్యంలో, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి ,వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్రప్రసాద్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్న సేవ సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు, రాష్ట్ర ఇన్చార్జి యాతాకుల శేఖర్, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ప్రశాంత్, వెంకన్న, సంతోష్ మొదలైన వారు పాల్గొన్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం* *బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*
భద్రాద్రి కొత్తగూడెం


కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు
     
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని మరియు విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందని ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఉచితంగా విద్యుత్ పొందవచ్చని మరియు కాలుష్యం తగ్గుతుందని, గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని అంతేకాకుండా బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తున్నారని కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఏర్పాటు చేయుటకు లైసెన్సు తీసుకున్నటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కంపెనీలకు చెందిన సోలార్ ను మాత్రమే అమర్చి వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మంచి సర్వీసును అందించాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి,  బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.

AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరి లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధులు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని బృందావన్ యోజన మైదానంలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రెసిడెంట్ గైడ్ రొయ్య విమల, ఎంపిహెచ్ఎ పాల్గొని జాంబోరి డైరెక్టర్ దర్శన పవర్స్కార్ చేతుల మీదుగా జాతీయ ప్రశంసా పత్రాన్ని పొందారు. రొయ్య విమల 1998లోనే ప్రెసిడెంట్ గైడ్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు నల్లగొండలో ఆర్. విమల మాట్లాడుతూ.. నవంబర్ 23–29, 2025 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. భారతదేశంలో సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జాతీయ ఐక్యత, నైపుణ్యాభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు సహా 32,000 మందికి పైగా పాల్గొన్నారు. ముఖ్య కార్యకలాపాలలో సాహస సవాళ్లు, సాంకేతికత మరియు సోషల్ మీడియాపై వర్క్‌షాప్‌లు, డ్రోన్ ప్రదర్శన మరియు సాంస్కృతిక మార్పిడి ఉన్నాయని తెలిపారు. ముఖ్య అతిథి గారైన శ్రీమతి ఆనందన్ పాటిల్ గవర్నర్, ప్రెసిడెంట్ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఉత్తర్ ప్రదేశ్ గారి చేతుల మీదుగా నేషనల్ BSG ప్రెసిడెంట్ Dr అనిల్ కుమార్ జైన్ , కేకే కండాల వాల జాతీయ చీఫ్ కమిషనర్, ఇతర దేశాల ప్రతినిధులు శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ , ఏరోనాటిక్, నావికాదళం అతిథులుగా పాల్గొని 19వ నేషనల్ జంబూరి 24వ తేదీ సాయంత్రం BSG అన్ని రాష్ట్రాల విద్యార్థుల బ్యాండ్ విన్యాసాలతో విద్యార్థులచే గౌరవ వందనం తీసుకొని నేషనల్ జంబోరీ ని వైభవంగా ప్రారంభించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం తో కార్యక్రమం ముగిసింది. నల్లగొండ జిల్లా నుండి ప్రెసిడెంట్ గైడ్ ఇ.కరుణాకర్ ( జిల్లా సెక్రటరీ ), ఆర్. విమల జిల్లా వైస్ ప్రెసిడెంట్, స్కౌట్ మాస్టర్ సయ్యద్ జిలానీ, ఎం.ఆశ్రిత్ సూర్యం, అభిరామ్, యశ్విన్, వరుణ్ సాయి, గోపీనాథ్, పార్ధివ్, జయంత్, రఘు తేజ్, అశ్రిత్ ఆండ్రూ, హరి ప్రసాద్, సహజ్ గౌడ్, నల్లగొండ జిల్లా నుండి సెయింట్ ఆల్ ఫెన్సెస్ స్కూలు స్కౌట్స్, సూర్యాపేట జిల్లా నుండి తెలంగాణ మోడల్ స్కూల్ హిమంపేట స్కౌట్స్, తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసంలో ఉసిరికాయకు పెరిగిన డిమాండ్

కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని రూపంగా మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపం వెలిగించడం, వనభోజనం చేయడం వంటి ఆచారాలు శివకేశవుల అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖశాంతులను అందిస్తాయని నమ్మకం. పాలకొల్లులో వ్యాపారాలు ఉసిరికాయలను కిలో రూ.200, విడిగా ఒక్కోటి రూ.10కు విక్రయిస్తున్నారు.
ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏవో.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సబ్సిడీ వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్ నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం కాగజ్నగర్లోని పీఏసీఎస్లో చైర్మన్ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన వరి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తోందన్నారు. సాగు విషయంలో ఏ సందేహాలున్నా అధికారులను సంప్రదించి, అధిక దిగుబడి పొందాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన నిత్య అన్నదాన కార్యక్రమం.

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం లో దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాధవన్ నంభూతిరి ఈ రోజు ఘనంగా పూజలు చేసి ప్రారంభించినారు. ఈ సందర్బంగా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీకమాసంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ప్రతి రోజు దాదాపు 400 ల నుండి 600 వందల మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులు కోత్వాల శ్రీనివాసరావు, మిడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, బేతంశెట్టి వెంకట్, బోగిని శ్రీను, గుండు రాజు, చారి, నాగేందర్,విజయ్, రాము, భూషణం, రమేష్, నరేష్ గౌడ్, ప్రసాద్ మరియు అన్నదాన నిర్వాహకులు బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

NLG: సీఎం కప్ 2026 జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్  ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో  అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
'ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్కిరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, నాగార్జున, సృజన, సరస్వతి, రంజాన్, మహమ్మద్ మరియు విద్యార్థులు అఖిల్ రెడ్డి, మహేష్, శ్రీధర్ రెడ్డి, సుచిత్ర, స్వాతి, దీప్తి, ప్రసన్న, వీణ, శివ, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ
77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ' నాన్న సేవా సమితి" ఆధ్వర్యంలో, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి ,వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్రప్రసాద్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్న సేవ సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు, రాష్ట్ర ఇన్చార్జి యాతాకుల శేఖర్, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ప్రశాంత్, వెంకన్న, సంతోష్ మొదలైన వారు పాల్గొన్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం* *బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*
భద్రాద్రి కొత్తగూడెం


కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు
     
కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరుగుతుందని మరియు విద్యుత్ తయారీకి ప్రభుత్వంపై భారం పడుతుందని ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకుంటే ఎవరింటికి సరిపడా వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఉచితంగా విద్యుత్ పొందవచ్చని మరియు కాలుష్యం తగ్గుతుందని, గృహ అవసరాలకు సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని అంతేకాకుండా బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తున్నారని కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోలార్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఏర్పాటు చేయుటకు లైసెన్సు తీసుకున్నటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కంపెనీలకు చెందిన సోలార్ ను మాత్రమే అమర్చి వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మంచి సర్వీసును అందించాలని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, వేల్పుల దామోదర్, లకావత్ గిరిబాబు, మంతపురి రాజు గౌడ్, కోడి అమరేందర్, గోపిరెడ్డి, కాపు కృష్ణ, కాలేరు సింధు తపస్వి,  బాదావత్ శాంతి, లావుడ్య సత్యనారాయణ, గోవాడ గుణ చరిత్, తోటలోహిత్ సాయి, నవతన్, బట్టు జవహర్, ఇర్ఫాన్, కాలేరు అఖిల్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.

AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరి లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధులు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని బృందావన్ యోజన మైదానంలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రెసిడెంట్ గైడ్ రొయ్య విమల, ఎంపిహెచ్ఎ పాల్గొని జాంబోరి డైరెక్టర్ దర్శన పవర్స్కార్ చేతుల మీదుగా జాతీయ ప్రశంసా పత్రాన్ని పొందారు. రొయ్య విమల 1998లోనే ప్రెసిడెంట్ గైడ్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు నల్లగొండలో ఆర్. విమల మాట్లాడుతూ.. నవంబర్ 23–29, 2025 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. భారతదేశంలో సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జాతీయ ఐక్యత, నైపుణ్యాభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు సహా 32,000 మందికి పైగా పాల్గొన్నారు. ముఖ్య కార్యకలాపాలలో సాహస సవాళ్లు, సాంకేతికత మరియు సోషల్ మీడియాపై వర్క్‌షాప్‌లు, డ్రోన్ ప్రదర్శన మరియు సాంస్కృతిక మార్పిడి ఉన్నాయని తెలిపారు. ముఖ్య అతిథి గారైన శ్రీమతి ఆనందన్ పాటిల్ గవర్నర్, ప్రెసిడెంట్ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఉత్తర్ ప్రదేశ్ గారి చేతుల మీదుగా నేషనల్ BSG ప్రెసిడెంట్ Dr అనిల్ కుమార్ జైన్ , కేకే కండాల వాల జాతీయ చీఫ్ కమిషనర్, ఇతర దేశాల ప్రతినిధులు శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ , ఏరోనాటిక్, నావికాదళం అతిథులుగా పాల్గొని 19వ నేషనల్ జంబూరి 24వ తేదీ సాయంత్రం BSG అన్ని రాష్ట్రాల విద్యార్థుల బ్యాండ్ విన్యాసాలతో విద్యార్థులచే గౌరవ వందనం తీసుకొని నేషనల్ జంబోరీ ని వైభవంగా ప్రారంభించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం తో కార్యక్రమం ముగిసింది. నల్లగొండ జిల్లా నుండి ప్రెసిడెంట్ గైడ్ ఇ.కరుణాకర్ ( జిల్లా సెక్రటరీ ), ఆర్. విమల జిల్లా వైస్ ప్రెసిడెంట్, స్కౌట్ మాస్టర్ సయ్యద్ జిలానీ, ఎం.ఆశ్రిత్ సూర్యం, అభిరామ్, యశ్విన్, వరుణ్ సాయి, గోపీనాథ్, పార్ధివ్, జయంత్, రఘు తేజ్, అశ్రిత్ ఆండ్రూ, హరి ప్రసాద్, సహజ్ గౌడ్, నల్లగొండ జిల్లా నుండి సెయింట్ ఆల్ ఫెన్సెస్ స్కూలు స్కౌట్స్, సూర్యాపేట జిల్లా నుండి తెలంగాణ మోడల్ స్కూల్ హిమంపేట స్కౌట్స్, తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసంలో ఉసిరికాయకు పెరిగిన డిమాండ్

కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని రూపంగా మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపం వెలిగించడం, వనభోజనం చేయడం వంటి ఆచారాలు శివకేశవుల అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖశాంతులను అందిస్తాయని నమ్మకం. పాలకొల్లులో వ్యాపారాలు ఉసిరికాయలను కిలో రూ.200, విడిగా ఒక్కోటి రూ.10కు విక్రయిస్తున్నారు.
ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏవో.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సబ్సిడీ వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్ నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం కాగజ్నగర్లోని పీఏసీఎస్లో చైర్మన్ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన వరి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తోందన్నారు. సాగు విషయంలో ఏ సందేహాలున్నా అధికారులను సంప్రదించి, అధిక దిగుబడి పొందాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన నిత్య అన్నదాన కార్యక్రమం.

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం లో దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాధవన్ నంభూతిరి ఈ రోజు ఘనంగా పూజలు చేసి ప్రారంభించినారు. ఈ సందర్బంగా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీకమాసంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ప్రతి రోజు దాదాపు 400 ల నుండి 600 వందల మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులు కోత్వాల శ్రీనివాసరావు, మిడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, బేతంశెట్టి వెంకట్, బోగిని శ్రీను, గుండు రాజు, చారి, నాగేందర్,విజయ్, రాము, భూషణం, రమేష్, నరేష్ గౌడ్, ప్రసాద్ మరియు అన్నదాన నిర్వాహకులు బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.