/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పాలీసెట్ పరీక్ష తేదీలో మార్పు Yadagiri Goud
పాలీసెట్ పరీక్ష తేదీలో మార్పు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పు లు చేర్పులు చేస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికలున్న క్రమంలో ఆ రోజు, ముందు రోజు, తర్వాతి రోజుల్లో ఉన్న పరీక్షల తేదీలను మారుస్తున్నారు.

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పాలిసెట్‌, తేదీని మే 17 నుంచి మే 24వ తేదీకి వాయిదా వేశారు. ఈమేరకు బుధవారం సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటన చేశారు.

ఇక ఎప్‌సెట్‌కు కూడా ఒకటి, రెండ్రోజుల ముందుగానే ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలను పంపించారు. సర్కారు అనుమతినివ్వ గానే... కొత్త తేదీలను ప్రకటించనున్నారు.

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు.. మే 9, 10వ తేదీల్లో ఇంజనీరింగ్‌, 11, 12వ తేదీల్లో అగ్రికల్చ ర్‌, ఫార్మసీ పరీక్షలను నిర్వ హించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో కొంత ముందు గానే.. మే 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఏప్రిల్‌,మూడో వారంలో ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలా ఖరు నాటికి స్పాట్‌ వాల్యు యేషన్‌ను పూర్తి చేయను న్నారు.

తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నయా లేదా అనేది పరిశీలించి ఫలితాలను ప్రకటించనున్నారు...

ఈడీ అరెస్ట్‌, కస్టడీని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కవిత

•రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీట్రయల్‌ కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ రేపు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చింది. తన అరెస్ట్‌ అక్రమమని, కస్టడీ రాజ్యాంగ విరుద్ధ మంటూ సోమవారం 537 పేజీలతో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌, పిటిషన్‌ పై విచారణ, కోర్టు ఉత్తర్వుల కాపీలు, మీడియా పబ్లిష్‌ చేసిన కథనాలను కవిత జత చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిం దని, పొలిటికల్‌ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని తన పిటిష న్‌లో కవిత ఆరోపించారు.

చట్టవ్యతిరేకంగా, కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేశారని మెన్షన్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమ లులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి కేసు తనపై లేదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ అంశాలను పరిగ ణన లోకి తీసుకొని తాజా పిటి షన్‌పై తుది తీర్పు వెలువ డేవరకు తక్షణమే తనను విడుదల చేసేలా ఆదేశాలి వ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత అరెస్ట్‌ పై స్టే విధిస్తూ, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు

లిక్కర్ స్కాం కేసు లో ఆరో పణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను నాలుగో రోజు బుధవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట రేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించను న్నారు.

ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యా లయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండ రింగ్ కేసులో కవిత పాత్ర.. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడి యా కేజ్రీవాల్‌తో ఒప్పందా లు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.

రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్‌ లో కవిత భోజనం చేస్తు న్నారు.

ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమ ణులు అఖిల సౌమ్య, విను త, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకు నేందుకు అను మతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.

కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించి నట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచా రం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది.

మంగళ వారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యా హ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించి నట్టు తెలిసింది.

అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలి సేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతిం చారు....

నేడు టీడీపీ 3వ జాబితా విడుదల?

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ వీడనుం దని సమాచారం.

కాగా, మొత్తం 25 ఏంపీ సీట్లకు గాను.. పొత్తులో భాగంగా టీడీపీకి 17 సీట్లు వచ్చాయి...

కాంగ్రెస్ రెండో జాబితా ; ఇదేనా ❓️

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబం ధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది.

నిజామా బాద్- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,

ఆదిలాబాద్- డాక్టర్ సుమలత,

కరీంనగర్- ప్రవీణ్ రెడ్డి,

వరంగల్- పసునూరి దయాకర్,

చేవెళ్ల- రంజిత్ రెడ్డి,

మల్కాజ్ గిరి- సునీతా మహేందర్ రెడ్డి,

నాగర్ కర్నూల్- మల్లు రవి,

పెద్దపల్లి- గడ్డం వంశీల

పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

హోమ్ ఓటింగ్‌కు నోటిఫికేషన్ జారీ..

త్వరలో జరగనున్న ఎన్ని కలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కోసం ఈసీ నోటిఫి కేషన్ మంగళవారం విడు దల చేసింది.

మే 13న జరగనున్న ఎన్ని కల్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, శారీరక వైకల్యం ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పిం చాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అనుమతినిస్తారు.

పోలింగ్ తేదీ 13వ తేదీకి పది రోజుల ముందు నుంచి ఇంటి నుంచే ఓటు వేయ వచ్చు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు..

ప్రణీత్ రావు కేసులో తీగలాగుతున్న పోలీసులు : కదులుతున్న రాజకీయ లింకులు

తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్లాంటి ఉద్యో గులతో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌రావు.. వేల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తిం చారు.

కూపీలాగిన కొద్దీ లింకులు కదలుతున్నాయి. ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో ప్రణీత్‌కు సహక రించిన వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్‌ టీమ్‌. గతంలో ఈ ఆ ఇద్దరు ప్రణీత్‌ టీమ్‌లో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు పోలీసులు.

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ఫ్రణీత్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్‌లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటిక‌ల్‌‌గా కలకలం రేపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు.

ఫోన్‌ట్యాపింగ్‌తో తనకే సంబంధంలేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్‌ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు దయాకర్‌రావు.

ఇక, విచారణలో బాగంగా బంజారాహిల్స్‌ పీఎస్‌లో ప్రణీత్‌రావును వైడ్‌ యాంగి ల్‌లో ప్రశ్నించింది స్పెషల్‌ టీమ్‌. గత ఆరేళ్లుగా ప్రణీత్‌ ఎలాంటి ఆపరేషన్స్‌ నిర్వ హించారో ఆరా తీశారట.

అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్‌ ట్యాపింగ్‌? టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేయ డం వెనక కారణాలేంటి? ట్యాపింగ్‌ చేసిన కాల్‌ రికార్డ్స్‌ను ఎవరికి ఎందుకు పంపించారు? అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేక రించినట్టు తెలుస్తోందట.

ఇక, ప్రణీత్‌ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వయి రీ చేస్తున్నారు ప్రత్యేక బృం దం పోలీసు అధికారులు.

హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడు దలైన నేపథ్యంలో ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పోలీస్‌, ఎస్‌. ఎస్‌.టి, ఎఫ్‌.ఎస్‌.టి టీమ్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటలపాటు 9 టీంలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మూడ్రోజుల్లోనే రూ.35లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న ఈ బృందాలు, విలువైన వస్తువులను సీజ్‌ చేశాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16,43,300తోపాటు రూ.10,250 విలువగల వస్తువులను సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎఫ్‌. ఎస్‌.టీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రూ.9,30,000 సీజ్‌ చేయగా, పోలీసులు మరో రూ.7,13,300ను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.17,25, 311 విలువగల వస్తువుల ను పట్టుకున్నారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని.. 8 మందిని ప్రోహిబిషన్‌ కేసుల్లో అరెస్టు చేశారు.

మంగళవారం నగదు, ఇతర వస్తువులపై 5 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్క రించారు. ఇప్పటి వరకు వరకు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష ఫలితాలు..

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు

ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు

తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు :పరీక్ష ఫలితాలు

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు

తెలంగాణ టెట్‌ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024.

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 21, 2024.

తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు

తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.

తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 పరీక్ష తేదీ: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024.

తెలంగాణ ఐసెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 4, 5 తేదీల్లో, 2024

తెలంగాణ లా సెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 3, 2024

అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలు

సీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు, 2024.

నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్‌ 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.

యోగా బాబాకు నోటీసులు ; కోర్టుకు హాజరుకండి

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యంలోని పతం జలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

ఆరోగ్య రక్షణకు సంబంధిం చి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.

వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సంద ర్భంగా ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే దానిని విస్మరించి, మీడియాలో ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది.

1954వ సంవత్సరపు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ అభ్యంతరకర ప్రకటనలు చట్టంలోని సెక్షన్‌ 3, 4ను రాందేవ్‌, బాలకృష్ణ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూ ర్తులు హిమా కోహ్లీ, అహ్స నుద్దీన్‌ అమానుల్లా తెలిపారు.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానమివ్వాలని వారి ద్దరినీ జస్టిస్‌ కోహ్లీ ఆదేశిం చారు. రాందేవ్‌, బాలకృష్ణ లకు ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.

ఆరోగ్య సంరక్షణకు సంబం ధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని అందులో తెలిపింది. గుండె జబ్బులు, ఆస్థమా వంటి వ్యాధులను నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ వ్యాధులకు సంబంధిం చిన ఔషధాల గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఆ వ్యాపార ప్రకటనలను తొలగించడానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

గత సంవత్సరం నవంబ ర్‌లో కూడా పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ప్రచార కార్యకలాపాలను కొనసాగిస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.