/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మండల కేంద్రంలో లారీ ఢీకొని వెలువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి Vijay.S
వలిగొండ మండల కేంద్రంలో లారీ ఢీకొని వెలువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తున్న వ్యక్తిని లోడ్ తో వెళుతున్న లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన మంత్రి స్వామిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లాలో వయోజన విద్యాశాఖ లోని మాజీ సాక్షర భారత్ మండల, గ్రామ కో-ఆర్డినేటర్లను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ వలిగొండ మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప మాట్లాడుతూ.. సాక్షర భారత్ కార్యక్రమాలలో పనిచేసిన గ్రామ ,మండల కోఆర్డినేటర్లు పూర్తిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులుగా 2010 నుండి 2018 మార్చి 31 వరకు అనగా తొమ్మిది సంవత్సరాలు అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ,అన్ని రకాల ప్రభుత్వ, సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వానికి సేవలు అందించామని అన్నారు. ప్రభుత్వం తిరిగి సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ .భాగ్యలక్ష్మి, ఏం మాధవి ,జి మానస , పీ లత ,కే లూర్దమ్మ,సిహెచ్ జ్యోతి, ఆర్ అనిత , జ్ సువర్ణ ,కే చైతన్య ,ఎం ధనమ్మ ఎం అనిత ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్. శ్రీ సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భువనగిరి వివేరా హోటల్ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి ఎన్ ఎస్ యు ఐ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు ,మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

గోకారంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా... ప్రత్యేక దాడులు నిర్వహించి పట్టుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో శుక్రవారం రాత్రి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ ఆకస్మికంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గోకారం గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంప్ లను మరియు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేశామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు. మండలంలో మూసి పరివాహక ప్రాంతం గోకారం, నాగారం ,వేములకొండ గ్రామాలలో పలుసార్లు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను పట్టుకుని, సీజ్ చేసిన కూడా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రములోని

అనాజిపురం గ్రామ శివారులోని దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ కాట రాజులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, గురువులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ కాట చిన్నప్ప మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి జీవితానికి తొలి మెట్టు లాంటిదని దానిని నిర్లక్ష్యం చేయకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రభాకర్, జ్యోతి, శ్రీనివాస్, నరేష్, కుమార్ , సుందరి, మోక్ష, మరియదాస్, రమాదేవి, సంధ్యారాణి, అనిత పీఈటీలు రాము , మహేశ్వరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది.

శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం వారి సీల్డ్ టెండర్ల ప్రకటన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో తేదీ 28. 2. 00024 నుండి 01.03. 2024 శుక్రవారం మధ్యాహ్నం 11.50 నిమిషంలోపు ఈ టెండర్లు వేయాలి. ఇట్టి టెండర్ల బాక్స్ మధ్యాహ్నం 12 గంటలకు సీల్ చేయబడుతుంది. తదుపరి మధ్యాహ్నం ఒకటి 01.30 నిమిషాలకు దేవస్థానం ఈవో గ్రామ పెద్దల సమక్షంలో ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నది. కావున భక్తులు టెండర్దారులు దేవస్థానం వారికి కావాల్సిన సామాగ్రి కొరకు షీల్డ్ టెండర్లు వేయగలరని కోరడం జరిగినది.

ఈ షీల్డ్ టెండర్లను శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుమీద చెల్లుబాటు ఉండేలా ఈ షీల్డ్ టెండర్ లో పాల్గొనే టెండర్దారులు 10000/- లో రూపాయలు ధరావత్తుతో డిడి రూపంలో గానీ నగదు రూపంలో గానీ చెల్లుబాటు అయ్యేవిధంగా షీల్డ్ టెండర్లులో పాల్గొనాలని టెండర్ షెడ్యూల్ ధర 2000/- రూపాయలుగా ఉంటుందని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇవో మోహన్ బాబు కోరారు. ఈ టెండర్ల కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తేది.01.04. 2024 నుండి తేది.31.03 2025 వరకు ఈ టెండర్ల కాల పరిమితి ఉంటుందని ఆయన అన్నారు. టెండర్ల లో కావలసిన సామాగ్రి వివరములు 1. పులిహోర కవర్స్ లడ్డు కవర్స్ కోసం టెండర్ 2. కరెంటు సామాగ్రి సరఫరా 3. బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ సున్నం యాసిడ్ కొబ్బరి పొరకలు తదితర సామాను 4. పండుగలకు బ్రహ్మోత్సవాలకు పూలు పూలదండలు పండ్లు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ అలంకరణ కోసం పూలు వేయటం కొరకు. ఈ టెండర్ వేయడానికి ధరావత్ రూపాయలు 10000/- డిడి రూపంలో నగదు రూపంలో గానీ యూనియన్ బ్యాంక్ వేముల కొండ మరియు కెనరా బ్యాంక్ అరుర్ లలో దేవాదాయ కమిషన్ పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీలు తీసి టెండర్లో పాల్గొనాలని దేవస్థానం‌ ఇవో సెల్వాద్రి మోహన్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది దేవాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అరూరు గ్రామంలో కిడ్నాప్ మరియు పోస్కో కేసు నమోదు ..వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కిడ్నాప్ మరియు పోస్కో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండారి రాజు తండ్రి యాదగిరి వయసు 33 సంవత్సరాలు , అరూరు గ్రామంలో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడు ఎర్ర గొల్లపాడు గ్రామం జనగాం మండల్ మరియు జనగాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు . ఇతన్ని అరెస్టు చేసి క జ్యూడిషల్ రిమాండ్ కొరకు కోర్టు ముందు  హాజరు పరిచినట్లు వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చాంబర్ కార్యాలయం ప్రారంభం


తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి ఛాంబర్,కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు.అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు బీర్ల ఐలయ్య గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛాంబర్ లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు ప్రభుత్వం విప్ అలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి వేద ఆశీర్వచనం అందజేశారు.

ఈ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు.ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు దివించారు.ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి,ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి తనను గుర్తించి ప్రభుత్వ విప్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ ఛాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ ఛాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.

విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిఐఈఓ కి వినతి పత్రం అందజేసిన పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్


 భువనగిరి : విద్యార్థులను పరీక్షల టైంలో ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ DIEO రమణి మేడం గారికి వినతిపత్రం ఇచ్చారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షల టైంలో చదువుకోనివ్వకుండా ఫీజుల పేరుతో విద్యార్థుల రక్తం తాగుతున్నారు ప్రైవేట్ కాలేజీల యజమాన్యం అలాంటి కాలేజీలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది,,మేడం మాట్లాడుతూ విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటాం హాల్ టికెట్ ఇవ్వకుంటే మా ఆఫీసులో వాళ్ళ ఇంటి పేరు చెప్తే మేమే విద్యార్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్ గిట్ల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, నవీన్ చేనేత, తదితరులు పాల్గొన్నారు

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు


భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి ఏఐఎస్ఎఫ్

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది 

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు జరిగి దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న గత ప్రభుత్వాలు జిల్లా కేంద్రంలో డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు 

 జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లేకపోవడంతో జిల్లాలోని నిరుపేద ,మధ్య తరగతి విద్యార్థులు సుదూర ప్రాంతాలైన నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు

ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు 

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ జిల్లా నాయకులు రేఖల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు