తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చాంబర్ కార్యాలయం ప్రారంభం
![]()
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి ఛాంబర్,కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు.అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు బీర్ల ఐలయ్య గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛాంబర్ లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు ప్రభుత్వం విప్ అలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి వేద ఆశీర్వచనం అందజేశారు.
![]()
ఈ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు.ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు దివించారు.ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి,ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి తనను గుర్తించి ప్రభుత్వ విప్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ ఛాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ ఛాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.





యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన ఏరువా రామచంద్రయ్య తండ్రి స్వామి తన భార్య సుశీలతో తేదీ 17-02- 2024 రోజున మేడారం జాతరకు వెళ్లారు. తిరిగి తేదీ 21-02- 224 సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి చేరుకొని చూడగా ఇంటి తలుపులు తెరుచుకొని గుర్తుతెలియనీ వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బెడ్ రూమ్, బీరువా తెరిచి , బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారం మరియు వెండి పట్టగొలుసులు దొంగలు ఎత్తుకెళ్లారని స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దాసిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ లో వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు నెంబర్ ప్లేటు సరిగా లేని వాహనాలను గుర్తించి చలానా విధించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ లను, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ లాల్ మాట్లాడుతూ ..వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాల తో ప్రయాణించాలని అన్నారు ,లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు





Feb 23 2024, 18:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
103.8k