భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
![]()
భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి ఏఐఎస్ఎఫ్
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు జరిగి దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న గత ప్రభుత్వాలు జిల్లా కేంద్రంలో డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లేకపోవడంతో జిల్లాలోని నిరుపేద ,మధ్య తరగతి విద్యార్థులు సుదూర ప్రాంతాలైన నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ జిల్లా నాయకులు రేఖల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
![]()
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన ఏరువా రామచంద్రయ్య తండ్రి స్వామి తన భార్య సుశీలతో తేదీ 17-02- 2024 రోజున మేడారం జాతరకు వెళ్లారు. తిరిగి తేదీ 21-02- 224 సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి చేరుకొని చూడగా ఇంటి తలుపులు తెరుచుకొని గుర్తుతెలియనీ వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బెడ్ రూమ్, బీరువా తెరిచి , బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారం మరియు వెండి పట్టగొలుసులు దొంగలు ఎత్తుకెళ్లారని స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దాసిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ లో వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు నెంబర్ ప్లేటు సరిగా లేని వాహనాలను గుర్తించి చలానా విధించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ లను, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ లాల్ మాట్లాడుతూ ..వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాల తో ప్రయాణించాలని అన్నారు ,లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు





ఈ సందర్భంగా విద్యార్థిని భవ్య శ్రీ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా , ఆనందంగా ఉందన్నారు. నా ప్రిపరేషన్ కు ,లైబ్రరీ బుక్స్ తో పాటు అనుభవం గల అధ్యాపకులు బోధించి, కాంపిటేషన్ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించడానికి సఫలీకృతం చేశారని, ఈ సందర్భంగా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అభినందించిన వారిలో కే రమేష్ ,అనసూయ ,ప్రవీణ్, పూర్ణిమ, సుష్మిత కనకదుర్గ, పృథ్వీరాజ్, రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు
Feb 22 2024, 16:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
29.7k