జన్వాడ లో మైనారిటీ, దళితులపై దాడిని ఖండిస్తున్నాం: బీఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల పాండు
జన్వాడ క్రైస్తవులపై దాడి ఘటనను ఖండిస్తున్నాం: జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు*
రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గంలోని జన్వడ గ్రామంలో మైనారిటీ,దళిత వర్గాలపై స్త్రీలు,పురుషులపై విచక్షణ రహితంగా దాడి చేసిన రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్ (RSS)కార్యకర్తలు,కాంగ్రెస్ చేసిన దాడిని,బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు విలేకరుల సమావేశంలో ఖండిచారు,ఈ సందర్బంగా మాట్లాడుతూ దాడి ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్టులు చేశారన్నారు,గత ప్రభుత్వంలో ఇలాగే ప్రశ్నించే గొంతులను నోక్కిన విధంగా అదే ఆనవాయితిని,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రజాస్వామయానికి గొడ్డలిపెట్టు వంటిదని,ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్తారని, రాష్ట్రంలో హోంమంత్రి,విద్యాశాఖకు మంత్రిని కూడా నియమిచలేని అసమర్థ ప్రభుత్వం అని, అరెస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు బాసాని మహేందర్,జిల్లారైతువిభాగం అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,కార్మిక విభాగం అధ్యక్షులు బోల్లేపల్లి అనిల్ కుమార్,ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి గందమల్ల లింగస్వామి,భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్,ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్, భువనగిరి నియోజకవర్గం మహిళా నాయకురాలు బాకారం లావణ్య,భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ రవి నాయక్,సోషల్ మీడియా కన్వీనర్ చుక్క సుమన్,తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()









పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ చార్యులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే సన్మానించారు. ఈనెల 19న రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న కూరెళ్ళ గ్రంథాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ,జిల్లా కలెక్టర్ కు కూరెళ్ళ విఠలాచార్య మంగళవారం ఆయన చాంబర్ లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విఠలా చార్య ను సత్కరించారు.
చదువుకుని లెక్చరర్ గా ఉద్యోగం చేసిన విఠలాచార్య పుస్తకాలను కలెక్ట్ చేస్తూ.. వచ్చి ఈ రిటైర్మెంట్ తర్వాత లైబ్రరీ ని ఏర్పాటు చేశారు. పట్టదలు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ..వయసుతో సంబంధం లేదని వారు నిరూపించారు. 2024 జనవరి 25న భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి మహేందర్ లాల్ మండలంలోని ప్రజలు కొన్ని సూచనలు ,సలహాలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, సంచరిస్తున్నట్లుగా అనుమానం కలిగితే వెంటనే... ఆ సమాచారాన్ని వలిగొండ పోలీసులకు అందజేయాలని అన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు.. మీ ఊర్లో సంచరిస్తూ ...మీ బంగారు వస్తువులకి మెరుగు దిద్దుతామంటూ.. వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. మహిళలు మరియు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ... ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆభరణాలు కనిపించకుండా, వస్త్రాలతో కప్పుకోవాలని, సైబర్ నెరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ,మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలియజేయకుండా ....తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అపరిచితుల ఆన్లైన్ లింక్స్, వెబ్సైట్ లో ,మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలిపారు.




Feb 15 2024, 19:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.2k