/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సేవాలాల్ మహారాజ్ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య Vijay.S
సేవాలాల్ మహారాజ్ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ... ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఆప్షనల్ హాలిడే కాకుండా, అధికారికంగా హాలిడే ఇవ్వాలని కోరారు, అలాగే యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ మరియు సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, కమిటీ తరఫున ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న కి విన్నపించడం జరిగింది, వారు తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి *జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్, రాష్ట్రఉపాధ్యక్షులు రాంజీనాయక్, రాష్ట్ర నాయకులు రవి నాయక్, శ్రీహరి నాయక్,జిల్లా నాయకులు రమేష్ నాయక్, కిషన్, దేవేందర్ నాయక్,వెంకటేష్,క్రాంతి నాయక్,శ్రీను నాయక్,అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ - ఏఐటియుసి పోరాటాల ఫలితమే కొండపైకి ఆటోల అనుమతి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 గత రెండు సంవత్సరాలుగా సిపిఐ - ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలకు అనుమతి లభించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి తెలిపారు.

    ఆదివారం రోజున యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించడం పై ఏఐటీయూసీ ఆటో యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షo వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యాదగిరిగుట్ట కొండపైకి నడిచే 300 ఆటో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని అనేక సందర్భాల్లో చేసిన పోరాటాల్లో స్థానిక సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కొండపైకి తీసుకు వెళ్లడానికి పూర్తిగా సహకారం అందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.

   ఏప్పటికైనా పోరాటం విజయం సాధిస్తుందని కార్మికులు తమ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

   ఈ ఉద్యమానికి సహకరించిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు  గారికి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారికి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారికి, ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ బోస్, ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం గారికి ధన్యవాదాలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు తదితరులు హర్షo వ్యక్తం చేశారు.

అబాకస్ మాథ్స్ టాలెంట్ టెస్ట్ లో శ్రీ సాయి ప్రశాంతి విద్యార్థుల హవా..


 ఇంటర్ డిస్ట్రిక్ట్ అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భువనగిరి శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ విద్యార్థులు సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని, జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలోని సాన్ మరియా హైస్కూల్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ ( యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట) అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జరిగిన అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో సీనియర్ విభాగంలో శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఐదవ తరగతి కి చెందిన కొత్తపల్లి సాయి విఘ్నేష్ మొదటి బహుమతిని, జూనియర్ విభాగంలో అశుతోష్ ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా బహుమతులు సాధించిన విద్యార్థులను, అబాకస్ మ్యాథ్స్ టీచర్ కొడారి కళ్యాణి లను శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య అభినందించారు. ఈకార్యక్రమంలో విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ బాధ్యులు ప్రమోద్, ప్రశాంత్, వాసవి, శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఉపాద్యాయులు ప్రమీల, మౌనిక , విద్యార్థులు పాల్గొన్నారు.

యాదాద్రి కొండపైకి ఆటోల కు అనుమతి


యాదాద్రి కొండపైకి ఆటోలు చేరుకున్నాయి. ప్రభుత్వం విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు ఆదివారం జెండా ఊపి ఆటోలను కొండపైకి అనుమతించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 300 ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండపైకి ఆటోల ను అనుమతిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఆటో కార్మికులను కొండపైకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జేండగే డిసిపి రాజేష్ చంద్ర ,అదనపు కలెక్టర్ వీరారెడ్డి ,ఆలయ చైర్మన్ బి నరసింహమూర్తి, అధికారులు ,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం: పల్ల గొర్ల మోదీ రాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు


 వలిగొండ : బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర అన్యాయం చేసిందన్నారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటన్ బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.8 అంటే 21389 నిధులు కేటాయించడం అన్యాయం గతంతో పోలిస్తే 1.3 నిధులు మాత్రమే ఎక్కువ కేటాయించారు రాజ్యాంగం లోని కోటరీ కమిషన్ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలంటే కేవలం 7.8 శాతం నిధులు కేటాయించడం అన్యాయం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ఊసే లేదు బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లకు మెస్చార్జీలు ఇస్తామన్న ఆలోచన లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిధులు కేటాయించలేదు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కేవలం 500 కోట్లతో 570 మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా నిర్మిస్తారు 900 గురుకుల పాఠశాలకు 1500 కోట్లతో ఎలా నిర్మిస్తారు యూనివర్సిటీలను 2000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 500 కోట్లు ఇవ్వడం దుర్మార్గం కొత్త యూనివర్సిటీల మాటే లేదు విద్యను వ్యాపారం చేయొద్దని భారత రాజ్యాంగంలో ఉన్న గత ప్రభుత్వం ప్రవేట్ సంస్థలకు దోచిపెట్టింది ఈ ప్రభుత్వం అలా చేయకుండా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలి బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 నుండి 20% నిధులు కేటాయించాలి పేద విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు ఈ *సమావేశంలో గొలుసుల మధు,మల్లయ్య, విద్యారత్నం, క్రాంతి కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, లింగస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన వాకిటి అనంతరెడ్డి డిసిసి ఉపాధ్యక్షులు


వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన వడ్రబోయిన గౌతమ్ ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలోఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.అతని సొంత గ్రామము వేములకొండచిన్నప్పుడు తండ్రిని కోల్పోయి తర్వాత అమ్మమ్మ ఊరు అయినా ఆరూరు గ్రామంలో పిట్టల యాదమ్మ దగ్గర జీవనోపాధి కోసం కూలి పని చేసుకుంటూ జీవనంకొనసాగించేవారు.ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి వడ్రబోయిన గౌతం కుటుంబ సభ్యులకు 4,000/ వేల రూపాయలు ఆర్థిక సహాయంఅందజేశారు.ఈ కార్యక్రమంలో పిట్టల సుధాకర్, బుర్ర శ్రీకర్ ,శివ, గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల వెంకటేశం పాల్గొన్నారు.

బోగారం లో అంబేద్కర్ విగ్రహ దాతకు ఘనంగా సన్మానం


రామన్నపేట మండలంలోని బోగారం గ్రామములో అంబేద్కర్ విగ్రహ దాతను ఘనంగా సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులున గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మేడి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ ను కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలసి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సన్మానినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేడి కృష్ణ, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, మేడి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి చింతల వెంకటేష్, కోశాధికారి మేడి నర్సింహా, సహాయ కార్యదర్శి మేడి రామలింగం, సభ్యులు మేడి నర్సింహా, మేడి మల్లేష్, చిరంజీవి, నాయకులు ఎస్కే. మోహిన్, జల్లా శ్రీనివాస్, జరుపటి రాంబాబు, బిన్.యాదవ్, బైకానీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం: ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు


వలిగొండ: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఈరోజు వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ

-అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే కేటాయించింది. అంటే విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది ఇది చాలా తక్కువ గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య యే మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేటాయించింది 500 కోట్ల రూపాయలు మాత్రమే, 500 కోట్లతో ఎలా వీటిని నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు ,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ,అగ్రికల్చర్ యూనివర్శీటీ,వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు.

- పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు ,మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది.

- గురుకులాలు నిర్మాణం కోసం 1546కోట్లు కూడా సరిపోవని 800 పైగా గురుకూలాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.

- ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు. గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహలకు గత సంవత్సరం నుండి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటి నిధులు గురించి కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.8% నిధులు మాత్రమే కేటాయించారు. నిధులను పెంచి‌ ప్రభుత్వ విద్యారంగాని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థులను కలుపుకుని ఎస్ఎఫ్ఐ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్


బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని, ప్రాజెక్టులన్ని కేఆర్ఎంబికి అప్పజెప్పి రాష్ట్ర హక్కులను కాలరాయుద్ధని నియోజికవర్గ ఇంచార్జి జీవి రామకృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రక్షిణ తెలంగాణ ప్రాంతంలో 68 శాతం మూడు జిల్లాల్లో ప్రభావం ఉంటుందది. నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టించరు తో పాటు సలు ఆలాశయాలు అంతర్భాగమై ఉన్నాయని ఆవన్నీ పరిధిలోకి తీసుకు రావణానికి కాంగ్రెష్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించి, సంతకం చేసి రైతుల హక్కులను కాలరా పారన్నారు. కేఱరందికి అప్పజెప్పడమే కాకుండా బిఆర్ఎస్ పార్టీన బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ప్రాజ్కెలన్నీ కెఆర్ఎంది పరిధిలోకి వెళ్తే ఈ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వ పరిమిషన్ లేనిటీ అక్కడ ఏం చేయలేము అని • తర్వాత ఎక్కడ భూపినా సుద్ర బలగా సహార కాసే పరిస్థితి వస్తుంద న్నారు. రానున్న రోజుల్లో రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిరూపేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భలో నల్గొండ సభ నిర్వహిస్తున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్ల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను, జరుగుతున్న అన్యాయాలను కాపాడేవీ టిజర్ఎస్ పార్టీయే అని ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాలన్నారు. అబద్దాలు చెప్పి సభర్వాప్తు ఏర్పాటు చేశారని అదే అబద్దాలు చెప్పి సంక్షేమ పధకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలమ్మ హక్కులను కాపాణీరి కేసీఆర్ ఉది టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇప్పుడున్న కార్యకోస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కెసీఆర్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. సాధించుకున్న హక్కులను హరించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటివరకు దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర చేస్తున్నారన్నారు. ప్రజలందరూ సమాయత్తం కావాల్సిన సమయం వచ్చిందని జిల్లా ప్రజలు అందరూ ఒకటి కావాలన్నారు. ముఖ్యమంత్రి అయి రెండు నెలలు పూర్తి కావస్తున్న ముఖ్యమంత్రి స్థాయిని మరిచి దిగజార్చి ఒక సర్ఫబర్ లా మాట్లాడుకున్నాను. ముఖ్యమంత్రి స్థాయిని గుర్తించలేకపోతుండా బాధ్యతను గుర్తించలేకపోతున్నా తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఇందన్నారు. కెసీఆర్ పధకాలను రద్దు చేస్తా. అన్నింటినీ రూపు మసుతా అంటున్నాడు. భగీరథ ద్వారా ఇంటింటికి జిల్లా నీళ్లు అందించిన పథకాన్ని రూపుమాపులేవ, 24 గంటలు కరంటు ఇచ్చిన పథకాన్ని రూపుమాపుతవ, కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు పథకాలను రద్దు తీస్తావా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటి రిజర్ఎస్ పార్టీ అందజేసిన పథకాలను రద్దు చేస్తా అని ప్పుకోవాలన్నారు. పొగునీటి ప్రాజెక్టులన్ని కాలువలు అన్నీ బిఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేపట్టామని వాటన్నిటినీ ఎలా రూపుమాపుతావన్నారు. ఆదరణ సాధ్యం కానీ సధకాలు ఇస్తా అని చెప్ని ప్రజలను మోసం చేయుద్దన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ స్థాయిని దిగదాల్పోదని, తెలంగాణ ప్రజలను ఆగం చేయుద్ధని అన్నారు. నల్గొండలో 13 న నిర్వహించనున్న సభను ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిగారు, ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి , ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, బిఆర్ఎస్ ఆర్ఎస్ నాయకులు కొంతం భాస్కర్ గౌడ్, మంచాల రవి కుమార్, గాండ్ల రవి, శ్రీనివాస్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుని మృతి


 భువనగిరి పట్టణానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకులు, పార్టీ పట్టణ మాజీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ శనివారం సాయంత్రం 6 గంటలకు యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన కాలేయం వ్యాధితో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం చెకప్ కోసం వెళ్లిన శ్రీనివాస్ డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ గతంల  టీ ఆర్ ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రావులశ్రీనివాస్ భార్య అనురాధ భువనగిరి లోని రాంనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్నారు.ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భువనగిరి లోని రాంనగర్ లో శ్రీనివాస్ టెంట్ హౌస్ నడిపేవారు. భువనగిరి మండలం సిరివేణికుంటకు చెందిన శ్రీనివాస్ కుటుంబం చాలా ఏళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. రావుల శ్రీనివాస్ మృదు స్వభావం హకలిగి, అందరితో కలిసి మెలిసి ఉండేవాడిని ఆయన మృతి తీరని లోటని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. రావుల శ్రీనివాస్ కు వినమ్ర నివాళులు అర్పించిన వెంకటేష్ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు. కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని ఆయన కోరారు.