/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి... Miryala Kiran Kumar
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి...

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. కనిగిరి అభివృద్ధి బాధ్యత తీసుకుంటా. ఈ ఐదేళ్లలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సిద్ధాంతం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఎప్పుడూ ఊహించలేదు. ఒక ఊరిలోని చెత్తను మరో ఊరిలో వేస్తున్నారు. -చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డికి రోడ్డు ప్రమాదం.. అటుగా వెళుతున్న జానీ మాస్టర్ స్పందించి సహకారం...

రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు ఒకరు మృతి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంక టేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆ దారిలో వెళ్తున్న డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వెంటనే స్పందించి వారికి తోడుగా సహకరించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పర్వ తరెడ్డికి తీవ్రంగా గాయ పడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది...

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని 

 ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

 ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

 దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించారు.

ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని..

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని 

హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ఉత్సవాలలో పాల్గొని, భవిష్యత్తులో దర్గా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసిన ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్

హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపుగా మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 2 రోజు ఈద్గా నందు హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు దీపారాధన చేసి జుమా నమాజ్ తర్వాత భోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో దర్గా అభివృద్ధికై తోడ్పడుతానని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు పండాలని తెలిపారు. కట్టెల శివకుమార్ గారి అధ్యక్షతన అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగినందున భక్తులకు మరియు దర్గా కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్తా అమిత్ రెడ్డి వారు దర్గాని సందర్శించి చాధర్,పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలుచేశారు.

మాతావలి అహ్మద్ : షేక్ హాబీ బ్రదర్స్ అడ్వకేట్ మస్యుద్దీన్ మాజీ జిల్లా దర్గా అధ్యక్షులు సయ్యద్ జాఫర్ ఖాన్ పట్టణ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు 

 మాజీ మున్సిపల్ vise చైర్మన్ అషం కౌన్సిలర్స్ అభిమన్యు శ్రీనివాస్ ఇంతియాజ్ అలీ మొయిన ఉర్దూ డైరెక్టర్ జియా బాయ్ మామిడి కార్తీక్ ఇర్ఫాన్ హెజాజ్ సంగం రాష్ట్ర నాయకులు కొండేటి నరేష్ కుమార్ బిక్షం నాగయ్య అల్లం పెళ్లి కొండల్ సుధీర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం: సిపిఎం పార్టీ

ప్రజా సమస్యల పరిష్కారమే      ఏ జండగా పనిచేస్తాం

పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని విస్తరించాలి

    కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే ఏజండగా ముందుకు వెళ్లాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు

      గురువారం రాత్రి నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగుడెంలో సిపిఎం 11వ వార్డు శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన అంతరించి ప్రజా పాలన ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేయడానికి తీసుకుంటున్న దరఖాస్తులు విచారణల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అర్హులందరికీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన నగదు చెల్లింపు వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీలు పనికి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు.

   సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక చేసి అర్హులను గుర్తించారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కతాల గూడెం లోని స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సాగర్ రోడ్ నుండి కొత్తపెల్లి కాల్వ వరకు నాలుగో వరుసల రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ,కతాలగూడెం నుండి మామిల్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలనీలలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం చేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వార్డు విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.

      ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య,శాఖ సభ్యులు దండెంపల్లి మారయ్య, యాదయ్య ,పల్లె నగేష్, కృష్ణ, చంద్రబాబు, జానమ్మ,తదితరులు పాల్గొన్నారు

భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు....

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా 761 కరోనా కేసులు, 12 మంది మృతి

దేశంలో 4,334 కరోనా యాక్టివ్‌ కేసులు

కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు మృతి

కరోనాతో మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు మృతి

నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్

నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా నేడు సాయంత్రం 6 గంటలకు స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపు మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్ మూలాన రెహమాన్ గారు 

మతవల్లి షేక్ అహ్మద్ హబీబ్ బ్రదర్స్ అడ్వకేట్ మస్యుద్దిన్ ఎక్స్ కౌన్సిలర్ ఇంతియాజు ఎక్స్ కౌన్సిలర్ అబ్రార్ షేక్ అజాజ్ కాజా ఫరీద్ అల్లం పల్లీ కొండన్న ఇరిగి బిక్షం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ 

గంటా సుమన్ దుర్గారాజు కుడతాల నాగరాజ్ బీసీ సంఘం నాయకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చర్ల:ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్

ఆరు గ్యారంటీల పేరుతో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన పేరుతో అధికారులు గ్రామాలలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నారని స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమయం తీసుకోకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే పేరుతో అనేక సమస్యలను సర్వేలు చేసి ఒక సమస్యను కూడా పరిష్కరించలేదని ఈ ప్రభుత్వం కూడా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని లేనిచో ప్రజా ఆందోళన చేయవలసి వస్తుందని వారు అన్నారు ఎలాంటి తారతమ్య బాధలు లేకుండా ప్రజలందరికీ ప్రజా పథకాలు అందే విధంగా చూడాలని వారన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఇల్లు రేషన్ కార్డు భూమి లేకుండా అనేకమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఈ ప్రభుత్వం అయినా ప్రజా పాలన పేరుతో తీసుకున్న ప్రతి దరఖాస్తు ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అలాగే ప్రతివారం ఇలా ప్రజా దర్బార్ పేరుతో ప్రజాపాలన నిర్వహించాలని వారు కోరారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసులో ఉన్న వాళ్లే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ఆ ఆప్షన్ ని తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం పేరు అని పెడితే బాగుంటుందని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిరి నరేష్ కనితి భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క అలవాల రమణ  తులసి రాణి దుర్గమ్మ రాజమ్మ రమేష్ రాజు రవి కార్తీక్ సుబ్బులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి:కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి

కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి

        - కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి

     

       సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో గల కుడకుడ శివారు ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 126, 110 ,160 లు మొత్తం కూడా కబ్జా గురైందని,ఈ భూమిని కబ్జాల నుండి వెలికి తీసి పేదలకు పంచాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వెంకట్ రెడ్డి గారికి వినతిపత్రం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ సమీపంలో గల కుడకుడ శివారులో సర్వేనెంబర్ 126 లో సుమారు 85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు మరియు కొంతమంది స్థానిక నాయకులు కలిసి కబ్జా చేసి తప్పుడు దారుల్లో కొంతమంది పట్టాలు సంపాదించారని విమర్శించారు. అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలేస్తే టీఆర్ఎస్ నాయకులు మరియు నిత్యం పేద ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పుకునే ఒక ఎర్రజెండా పార్టీ నాయకులు కలిసి మా మహిళలపై దాడులు చేశారని అన్నారు. ఆ ఇంటి స్థలాలను నేడు వారు, టిఆర్ఎస్ నాయకులు కలిసి ఆక్రమించుకొని దొడ్డి దారిలో పట్టాల పొందారు,మరికొందరు స్వతంత్ర సమర యోధుల పేరుతోటి, ఎక్స్ మిల్ట్రీ వాళ్ళ పేరుతోటి తప్పుడు దారుల్లో గుట్టలను పట్టా చేయించుకొని, వాటిని నేడు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు.అదేవిధంగా ఉపేందర్ అనే అతను మునిసిపాలిటీలో పనిచేస్తూ అధికార పార్టీ నాయకుల అండదండ తోటి 126 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని అక్కడ ఉన్న పేదలకు అమ్ముతున్నాడు. ఈ కబ్జాదారులను కట్టడి చేయక పోతే ప్రభుత్వ భూమి మొత్తం చివరికి ప్రభుత్వానికి పేద ప్రజలకు లేకుండా పోతుంది అన్నారు. కాబట్టి కబ్జాదారులను శిక్షించి,కబ్జా భూములను వెలికితీసి అర్హులైన పేదలందరికీ 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని మా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఇదే విషయం గతంలో ఉన్న కలెక్టర్ గారికి , చివ్వెంల ఎమ్మార్వో గారికి, పోలీసు వారికి,గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మా పార్టీ ద్వారా అనేకసార్లు తెలియజేశాము అయినా ఎలాంటి స్పందన లేకపోగ,మాపై తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ గారు స్పందించి వారం రోజుల్లో కబ్జా భూమిని వెలికి తీసి, కబ్జాదారులను శిక్షించి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాంజీ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.