/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సెప్టెంబర్ 20న కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వేలాదిగా తరలి రండి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపు Mane Praveen
సెప్టెంబర్ 20న కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వేలాదిగా తరలి రండి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపు
చింతపల్లి: ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉద్యోగులు అండ్ హెల్పర్స్ మూడోరోజు సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేలమంది శాంతియుతంగా సమ్మె చేస్తున్న వారిపట్ల ఉన్నత అధికారులు, ఐసిడిఎస్ అధికారులు భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీవ్రంగా ఖండిస్తూ అంగన్వాడీ లపై నిర్బంధం ఆపాలని నిరసిస్తూ, సెప్టెంబర్ 20న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున కదిలి రావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టులలో శాంతియుతంగా జరుగుతున్న సమ్మె పట్ల అధికారుల నిర్బంధం వ్యతిరేకిస్తూ, సెప్టెంబర్ 14న సిడిపిఓ ఆఫీస్ ముట్టడి, 16వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల ముట్టడి, ఈనెల 20న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్  కొన్నిటిని ప్రకటించడం అభ్యంతరాలు ఉన్నాయని వారు అన్నారు.  ఈ సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల మధ్య చీలికలను తీసుకువచ్చి కొందరు అనుకూలంగా ఉన్న వారితో మాట్లాడుకోవడం సరైనది కాదని వారు అన్నారు.  సమ్మె చేస్తున్న సంఘాలను చర్చ కి పిలిచి మాట్లాడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నల్ల వెంకటయ్య, అంగన్వాడి ఉద్యోగ సంఘాల నాయకులు కే.రజిత, ఆర్.శోభ, శోభారాణి, ఏ. శాంతకుమారి, విజయలక్ష్మి, కలమ్మ, జయశ్రీ, అనంతలక్ష్మి, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్జీ కళాశాల స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ అధ్యాపకులకు సన్మానం
నల్లగొండ పట్టణంలోని, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో,   ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులను స్వీకరించిన కళాశాల అధ్యాపకులను,  ఎన్జీ కళాశాల స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో  బుధ వారం ఘనంగా సన్మానించారు. ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు పొందిన డాక్టర్ అంతటి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ దీపిక లను స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా వారు చేసిన విశిష్ట సేవలకు గాను సరియైన గుర్తింపు పొందారని ప్రిన్సిపాల్ అన్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. తాము బోధనతోపాటు,  పరిశోధనలు మరియు పుస్తకాల ప్రచురణ, సామాజిక సేవా కార్యక్రమాలు కు చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం తమను రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా గుర్తించి అవార్డులు ఇచ్చినందుకుగాను చాలా సంతృప్తిగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, వెంపటి శ్రీనివాస్, ఐ కే సి కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, స్టాప్ క్లబ్ సెక్రెటరీ ఆర్. చంద్రశేఖర్, అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌండిన్య, నాగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాగుల వేణు, డాక్టర్ శీలం యాదగిరి, గ్రంథ పాలకులు డాక్టర్ ఏ. దుర్గాప్రసాద్, ఈ.యాదగిరి రెడ్డి, నాగరాజు, వి.వి. సుబ్బారావు, వెంకటేశ్వర్లు, లవెందేర్ రెడ్డి, వెల్దండి శ్రీధర్, ముత్తయ్య, బాలస్వామి, శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి రావు,  శివరాణి,  చంద్రయ్య, సైదులు, సూదిని వెంకట్ రెడ్డి. మనెమ్మ తదితరులు పాల్గొన్నారు.
రామ మందిర నిర్మాణం వద్ద త్రవ్వకాలలో.. పురాతన ఆలయ అవశేషాలు లభ్యం
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రామ మందిర నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మందిరం నిర్మించేందుకు తవ్వకాలు చేపట్టగా రామ మందిరం పురాతన ఆలయ అవశేషాలు కనుగొనబడ్డాయని, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, దీనికి సంబంధించిన చిత్రాన్ని
సోషల్ మీడియా సైట్ ఎక్స్‌ లో అందుకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. అందులో స్తంభాలు, విగ్రహాలు, రాళ్లు, శాసనాలు కనిపిస్తాయి. శ్రీరామ జన్మభూమి తవ్వకంలో పురాతన ఆలయ అవశేషాలు లభించాయని తెలిపారు. ఇందులో అనేక విగ్రహాలు మరియు స్తంభాలు ఉన్నాయి. ఈ అవశేషాలను భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణంలో ఉంచారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తికానున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం ఆలయ మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

అదే సమయంలో, రెండవ అంతస్తును పూర్తి చేయడానికి పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఆలయ గోడ, రాళ్లు, స్తంభాలపై చెక్కే పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. ఇటీవల ఆయన ప్రధాని మోదీని కలిసి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. జనవరి 21 - 23, 2024 మధ్య తేదీలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
నేతన్నలను ఆదుకోరా?: బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
నకిరేకల్: చేనేత కార్మకులను ప్రభుత్వం ఆదుకోవాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం  నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి కాలనీలో,  గడప గడపకు ఏనుగు గుర్తు ను పరిచయం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ వల్ల ఇంట్లో ఒక్కరికే లబ్ది చేకూరుతుంది అని అన్నారు. మరి రంగులు అద్దె వారు, చిన్న చిన్న పనులు చేసే వారు చేనేత కార్మికులు కారా? అని ప్రశ్నించారు. జియో ట్యాగింగ్‌ వల్ల  చేనేత కుటుంబాలు నష్టపోతున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం అన్నారు. అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు అని అన్నారు. ‘చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ నానుడి నేటికీ నిజం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకుగా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప, వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం అన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ.. నేతన్న కు చేయూత.. తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొన్ని నెలల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ వార్తల్లో వచ్చే
ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం,  అంతకు మించిన పొరపాటు మరొకటి లేదని ఎద్దేవా చేశారు. అసలు ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదు అని అన్నారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి నేత కార్మికుడికి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం కొద్ది మందికే ఇవ్వడం విచారకరం. వారికి జీఐ ట్యాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు. ఆ ట్యాగ్ కోసం ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఐక్యంగా పోరాడాలి: నేతన్నలకు ప్రభుత్వ పథకాలే కాక, వారు నేచిన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అసలే ముడిసరుకు కొనుగోలు కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక ఓటర్లైన పద్మశాలీలకు.. ఎన్నికల సమయంలో నాయకులు ఏదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతీ ఎలక్షన్స్ సమయంలో జరిగేదే అని, నాయకులు ప్రతిసారి చేనేత కార్మికుల ఓట్ల ద్వారా గెలుపొంది, ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా, వారికి ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. అందుకే చేనేత కార్మికులందరూ ఐక్యంగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది. ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని వారికి అండగా నిలవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సీత, యశ్వంత్, జగదీష్, కృష్ణ, యోగి, మల్లేష్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NLG: కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి రమాదేవి కి డాక్టరేట్
నల్లగొండ: జిల్లాకు చెందిన కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్  పులి రమాదేవికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు ఈ నెలలో డాక్టరేట్ ను ప్రకటించింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయం 'కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్  కళాశాలలో  '' పనిచేసే మహిళల ఆర్థిక అక్షరాస్యత అధ్యయనం - హైదరాబాదు జిల్లా '' అనే ‌అంశం పై ఆచార్య ఎం.సులోచన పర్యవేక్షణలో  పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని రమాదేవి రూపొందించి, సమర్పించారు.  గ్రామీణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన రమాదేవి స్వగ్రామం దామరచర్ల మండలం కొండప్రోలు. ఈమె తల్లిదండ్రులు మట్టమ్మ- పిచ్చయ్య. కొండప్రోలు గ్రామంలో  పాఠశాల విద్య, మిర్యాలగూడెం నాగార్జున ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్మీడియట్, కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన రమాదేవి శ్రమకోర్చి తపనతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాస్త్రంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. ఇష్టంగా అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఎంపికై నిబద్ధత గల అధ్యాపకురాలు గా గుర్తింపు తెచ్చుకున్న రమాదేవి, ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో శాఖాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. పనిచేసిన ప్రతిచోటా గుణాత్మక సేవలందిస్తూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతున్న రమాదేవి డాక్టరేట్ పట్టా పొందడం వెనుకబడిన గ్రామీణ మహిళా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రపంచ ఉపాధ్యాయ సంఘాలు సమాఖ్య సెక్రెటరీ జనరల్ , విద్యావేత్త ఎం.వి. గోనారెడ్డి, ప్రముఖ కవి, విద్యా విశ్లేషకులు, అసోషియేట్ ప్రొఫెసర్ డా.బెల్లి యాదయ్య అన్నారు.

అనుభవం, ఉన్నత అర్హతలు గల అధ్యాపకుల జాబితాలో రమాదేవి చేరిక కళాశాల విద్యాశాఖకు మిక్కిలి గౌరవ ప్రదమని టిజి సిజిటిఏ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డా. రాజారామ్, జిల్లా అధ్యక్ష  కార్యదర్శులు డా.మునీర్, డా.రామరాజు, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు వి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ సహాధ్యాపకురాలు డాక్టరేట్ సాధించడం ఎంతో ఆనందదాయకమని నల్లగొండ జిల్లా టిజిసిజిటిఏ అధ్యాపక బృందం, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, బంధుమిత్రులు రమాదేవిని అభినందించారు.
ఎన్జీ కళాశాలలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు
నల్లగొండ: కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ యాసలో నవరసాలు అను అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని, బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష కావాలని కాళోజీ కోరినట్లే ఇవ్వాళ ప్రజల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలంగాణ యాసలో నవరసాలతో కూడిన తాను రాసిన పాటలను పాడి సభను అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి మరో వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి ఎన్ వి. రఘువీర్ ప్రతాప్  నా గొడవ- సామాజికత అను అంశంపై మాట్లాడుతూ.. కాళోజీ ఎక్కడ అన్యాయం జరిగినా, స్పందించి కవిత్వం రాశాడని, ప్రజల గొడవను తన గొడవగా భావించి కవిత్వం ద్వారా ప్రజల్ని ఆలోచింపజేశాడని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఘనశ్యాం మాట్లాడుతూ.. కాళోజీ నిఖార్సైన మానవత్వానికి నిదర్శనమని, విశ్వమానవతా దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రబోధించారని అన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ సీతారాం రాథోడ్,డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్, డాక్టర్ టి. సైదులు, జి.గోవర్ధనగిరి, ఎస్.ప్రభాకర్ ఎమ్. లింగస్వామి, బి. రమ్య, తదితర అధ్యాపకులతో పాటు, కవి బండారు శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: పల్లా దేవేందర్ రెడ్డి
TS: అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ల సర్వీస్ క్రమబద్దీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ ల తో పాటు 19 రకాల సమస్యలు పరిష్కరించాలని  కోరుతూ, రాష్టం లో ఏఐటీయూసీ - సీఐటీయూ JAC గా ఏర్పడి, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతున్నారు. ఈ నెల 11 నుంచి జరిగే అంగన్వాడీ ల సమ్మె ను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మె లో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
'అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి'
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఆలిండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో, ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర 10వ మహాసభలను జయప్రదం చేయుట కొరకు రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం పట్టణంలోని ఐబి బంగ్లాలో ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీనివాసు, నర్సింగ్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు మధు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ , జిల్లా సలహాదారుడు డాక్టర్ ఏకుల రాజారావు, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బరపటి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి అందుగుల లక్ష్మీనారి, దిండి మండలం అధ్యక్షుడు పాతుకుల మల్లేష్ ,మల్లేపల్లి సభ్యులు ఆదిరాల రాము, ధర్మపురి శీను, రంజిత్ సింగ్, ఎర్ర సైదులు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
NLG: హన్స్ హైదరాబాద్ మారథాన్ పరుగు పోటీలో ఎన్జీ కళాశాల విద్యార్థికి ప్రధమ స్థానం
ఈరోజు  హైదరాబాద్ లో నిర్వహించిన 'హన్స్ హైదరాబాద్ మారథాన్' పరుగు పోటీలలో 10 కిలోమీటర్ల విభాగంలో, నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి వి. ధనుష్, ప్రధమ స్థానం సాధించి రూ. 30,000/- క్యాష్ అవార్డ్ ను గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి ధనుష్ ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన్ శ్యామ్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తదితరులు అభినందించారు.
BREAKING NEWS నాంపల్లి: ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి, ఆందోళనకు దిగిన బంధువులు
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం జాను తండాలో విషాదం నెలకొంది. జాను తండ కు చెందిన ఓ బాలుడు జలుబు, దగ్గు  ఉంది అని ఈ రోజు నాంపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తూ నాంపల్లి లో ధర్నా చేపట్టారు. మృతి చెందిన బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.