/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు Yadagiri Goud
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది..

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు.

తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు.

ధూల్‌పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్‌ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్‌పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు.

గుడుంబా నిషేధం తర్వాత ధూల్‌పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్‌పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి..

అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క

సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు.

అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.

జీరో అవర్‌లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని చాలా మంది తమకు చెప్తున్నారన్నారు. మరి తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలా మాట్లాడేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు కానీ తాము ఒక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని విమర్శించారు. సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని సీతక్క అన్నారు.

మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారని అడిగారు.అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ధ్వజమెత్తారు.

నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారని అన్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సభ నిర్వాహణ తీరు తమలాంటి వారికి బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిపై లఘు చర్చ ప్రారంభమైంది.

ఈ చర్చను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ముగింపు ప్రసంగం చేయనున్నారు..

TS Assembly: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు..

తొమ్మిదేళ్ళ తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడనున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) స్పీకర్‌ను కలిసి నిరసన తెలుపనున్నారు.

సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల్లో సమావేశాలు ముగించడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఆర్టీసీ (RTC) విలీనం బిల్లు లేకుండానే శాసన సభ సమావేశాలు ముగుస్తున్నాయి. డ్రాఫ్ట్ బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి.

మరో మూడు అంశాలపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai వివరణ కోరారు. వాటికి ఇంకా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం వివరణ ఇస్తే ఈ రోజు ఆర్టీసీ విలీన బిల్లు అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది..

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుపతి:ఆగస్టు 06

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 81,472 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 38,820 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......

Gold: శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని (Gold) కస్టమ్స్ అధికారులు (Customs Officers) పట్టుకున్నారు.

జెడ్డా (Jeddah) నుంచి ఇద్దరు ప్రయాణికులు ఇండిగో విమానం (Indigo Flight)లో శంషాబాద్‌ (Shamshabad)కు వచ్చారు..

అధికారులు తనిఖీలు చేస్తుండగా వారి వద్ద రూ. కోటి విలువ చేసే అక్రమ బంగారం లభ్యమైంది. దీంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేసి.. ఇద్దరినీ అరెస్టు చేశారు.

ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారం పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్క సమాచారంతో కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

నింధితుల వద్ద పట్టు బడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1.11 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నింధితులను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Corona: కొవిడ్‌లో కొత్త వేరియంట్‌!

•బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి

లండన్‌: కొవిడ్‌-19లో ఒమిక్రాన్‌ రకం నుంచి వచ్చిన 'ఈజీ.5.1' అనే కొత్త వేరియంట్‌ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు..

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు. ఈ వేరియంట్‌ను తొలుత గత నెలలో గుర్తించారు.

Lఅంతర్జాతీయంగా కూడా దీని కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీని తీరును జాగ్రత్తగా గమనిస్తోంది.

ప్రజలు టీకాలు పొందినప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి, కోలుకున్నప్పటికీ అలసత్వానికి తావివ్వకూడదని స్పష్టంచేసింది. ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందన్న సూచనలేమీ లేవని తెలిపింది..

నేడు 11 గంటలకు రాజ్‌భవన్‌ ముట్టడి: టీఎంయూ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్‌ తమిళసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది.

ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు.

దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

కార్మికుల ధర్నాతో ఉదయం 6 నుంచి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కాగా, శనివారం నాడు రాజ్‌భవన్‌ ముట్టడికి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది...

మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3

చంద్రయాన్ - 3 మరో కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది.

శనివారం రాత్రి 7 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది.

ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ మార్గంలో చంద్రయాన్ -3 పయనిస్తోంది.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు చంద్రయాన్ - 3ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.

ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై చంద్రయాన్ - 3 ల్యాండర్ దిగనుంది...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల:ఆగస్టు 05

తిరుమల కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్తీ సాధారణంగా ఉంది.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శుక్రవారం శ్రీవారిని 69270 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే 28755 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు.

ఇదిలా ఉండగా టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు.

Pawan Kalyan: ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి: ఎన్నికల ఏడాదిలో అడుగు పెడుతున్నాం.. ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక నేతలతో పవన్‌ సమావేశమయ్యారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజా పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావొచ్చనిపిస్తోందన్నారు.

''డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోంది. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత జవాబుదారీతనం ఉండాలి.

జనాల్ని దోచుకునే నేతలు కాదు, తమ సొమ్మును పంచే నేతలు కావాలి. డబ్బుతో ఓట్లు కొనమని నేను చెప్పడం లేదు. కానీ, నాయకులు కావాలంటే ఖర్చు పెట్టి తీరాలి.. తప్పదు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు.

వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలి. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తాం. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు'' అని పార్టీ నేతలకు పవన్‌ దిశానిర్దేశం చేశారు..