/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు Mane Praveen
TS: నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
బ్రేకింగ్ న్యూస్: నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  నేడు, రేపు అనగా గురు, శుక్ర వారాలు ఈ రెండు రోజులు సెలవులు ప్రకటించారు.


ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే పాఠశాలకు, కళాశాలకు బయలుదేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి ఇంటిదారి పడుతున్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ
HYD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని టిఎస్ ఆర్టీసి   బుధవారం ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.

ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.  రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది.


రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం  ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.


ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.


భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.in లోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ సూచించారు.
NLG: గురుకుల పాఠశాలల పై ముఖ్యమంత్రి సమీక్ష జరపాలి: అయితగోని జనార్దన్
దామరచర్ల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించాలని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ అన్నారు.  మండల కేంద్రంలో బుధవారం, గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, గురుకుల పాఠశాలల అన్నిటికీ సొంతభవనాలు నిర్మించాలని, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, పగిడి జీడయ్య యాదవ్, కొంపల్లి రామన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
NLG: నాగం ఫౌండేషన్ సౌజన్యంతో భోజనాలు ఏర్పాటు చేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ: పట్టణ కేంద్రంలో జే ఎస్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి సదస్సు కు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ  విచ్చేసినారు.


ఇట్టి సదస్సుకు విచ్చేసిన పన్నెండు వందల మందికి బోజనాలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో  బిజేపి నాయకులు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని వారితో పాటు సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం నాగం హాస్పిటల్ కు విచ్చేసిన మంద కృష్ణ  మాదిగ ను,  డాక్టర్ వర్షిత్ రెడ్డి శాలువతో సత్కరించి పూల బొకే ఇచ్చి సాదరంగ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. నాగం ఫౌండేషన్ ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని డా. నాగం వర్శిత్ రెడ్డిని ప్రశంసించారు.

ప్రధాని నరేంద్ర మోడీ  తొమ్మిదేళ్ల పరిపాలనను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకాన్ని మందకృష్ణ మాదిగ కు నాగం వర్షిత్ రెడ్డి బహికరించారు.
NLG: ఉమెన్స్ కాలేజీలో అతిధి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాల కోసం అర్హులైన అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా...
కంప్యూటర్ సైన్స్ - 5, వక్షశాస్త్రం- 1
రాజనీతి శాస్త్రం ఉర్దూ మీడియం - 1,
చరిత్ర ఉర్దూ మీడియం- 1,  తెలుగు - 5,
ఇంగ్లీష్ - 1, కామర్స్- 2, కలవు.

ఈ నెల 20 నుండి 24 వ తేదీ వరకు సాయంత్రం గం. 4: 30  వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

పీహెచ్డీ గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత మరియు టీఎస్ సెట్ అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష  ఈ నెల 26న కళాశాలలో నిర్వహిస్తారని తెలిపారు.
NLG: ఎన్జీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను, ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీ డిగ్రీలో 55 శాతం మార్పులు ఉన్న ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు ఉన్నవారు అర్హులు.


నెట్/ స్లెట్ /పిహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఆంగ్లం 03, తెలుగు 03, వాణిజ్య శాస్త్రం 02, బిబిఏ 02, డాటా సైన్సు 01, గణితశాస్త్రం 01, బయోటెక్నాలజీ 01, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ 07, స్టాటస్టిక్స్ 01, టాక్సేషన్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో ఈనెల 24 లోపు అందజేయాలని తెలిపారు.


దరఖాస్తుకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లను జత చేయాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 26వ తేదీ ఉదయం గం. 10:30 లకు కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు.
మైలారం రాములు తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పాల్వాయి స్రవంతి
యాదాద్రి జిల్లా, నారాయణపురం: మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు తండ్రి ఇటీవల అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, తిరిగి ఇంటికి  వచ్చిన విషయం తెలుసుకొన్న టిపిసిసి అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి బుధవారం మైలారం రాములు నివాసంలో వారి తండ్రిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
success story: ఒక దినసరి కూలీ.. పట్టుదలతో చదివి పిహెచ్డీ సాధించింది

AP: ఆమె ఒక దినసరి కూలీ, అయితేనేం.. పట్టుదలతో చదివి ఆమె కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా సాధించింది. ఆమె పేరు సాకే భారతి.  సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.


అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో సాకే భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు.


పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు.
మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్నవారికి తన శక్తి మేరకు సహాయం అందించాలని తపన పడే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ రంగ ప్రవేశం నుండి ఇప్పటివరకు అనేకమంది నిరుపేదలకు కోట్ల రూపాయల సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్ప నాయకుడు. మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన పగిళ్ల శంకర్ తీవ్రమైన అనారోగ్యానికి గురై, నల్లగొండలోని రివర్ నీమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిది నిరుపేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సైదులు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50,000/- బాధిత కుటుంబ సభ్యులకి అందించారు. కార్యక్రమంలో పగిళ్ల నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పదివేలు ఆర్ధిక సహాయం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల కీ.శే. ఏర్పుల భీమయ్య సతీమణి ఏర్పుల కమలమ్మ బుధవారం మరణించారు. మానవతా దృక్పథంతో బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్పూర్తితో లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పుల కమలమ్మ కుటుంబ సభ్యులకు రూ. 10,000/- ఆర్ధిక సహాయం అందించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్పుల శ్రీశైలం, మేతరి శంకర్, నందికొండ లింగారెడ్డి, కాటగోని రవిశేఖర్, నాగరాజు, చాపల రాజు,ఎర్పుల వెంకటేష్, బుర్కల శేఖర్, చాపల రవి, ఏర్పుల రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు