వినియోగదారుడా మేలుకో నీ హక్కులు తెలుసుకో: వినియోదారుల హక్కుల జోనల్ కార్యదర్శి ఎం డి సాధిక్ పాష
వినియోగదారుడా మేలుకో
నీ హక్కులు తెలుసుకో
తేదీ: 15/03/2023 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మరియు వినియోగదారుల హక్కుల జోనల్ కార్యదర్శి శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపధ్యంలో వినియోగదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వస్తువు కొనే ముందు తయారీ తేదీ మరియు గడువు తేదీ, నాణ్యత చూసి కొనాలని కొన్న ప్రతి వస్తువుకు తప్పని సరిగా బిల్లు తీసుకోవటం మరిపోవద్దని వస్తువు యొక్క నాణ్యత విషయంలో లోపం ఉంటే వ్యాపారిని నిలదీసే హక్కును వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారునికి కల్పించిందని ఒకవేళ వినియోగదారుడు నష్ట పరిహారం కోరుకుంటే జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ ను సంప్రదించి స్వయంగా కేసు వేసి తన కేసును తానే వాదించుకునే అవకాశం వినియోగదారునికి ఉన్నది కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వినియోగదారుల హక్కుల చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని అలాగే ప్రభుత్వం మరియు వినియోగదారుల సంఘాలు కూడా తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓ,జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ చైర్మన్, లీగల్ మెట్రాలజి,ఆర్.టి.ఏ. మరియు వివిధ శాఖ అధికారులు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొన్నాయి.

వినియోగదారుడా మేలుకో

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు....
జిల్లా పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....
వీరి దీనస్థితిగతులపై 'ఈనాడు' గత ఏడాది జులై 20న 'ఇదో దివ్యాంగుడి ముంపు గోస' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఇతను శాశ్వత పరిష్కారం కోసం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. సోమవారం జిల్లా సమీకృత ప్రాంగణానికి అతడి తల్లితో సహా వచ్చి మరోసారి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంథని ఆర్డీవో వీరబ్రహ్మేంద్రచారికి ఫోన్ చేసి రెండు పడక గదుల ఇల్లు మంజూరుకు అర్హతలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
పిల్లలను సక్రమంగా పేంచే బాధ్యత తల్లిదండ్రులదే
నలగొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లో శ్రీ మల్లన్న కేతమ్మ శివలింగం విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణం ఘనంగాా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి గారుు గుడికిి విరాళంగా రెండుుు లక్షల రూపాయలుు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలుు, కార్యకర్తలు అత్యధికంగాా పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా బిసి సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి పాల్పడిన DBCDOను తక్షణమే సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి SFI వినతి . ఈకార్యక్రమంలో SFIజిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ కోర్ర సైదా నాయక్ లక్ష్మణ్ బుడిగ వేంకటేష్ కొరె రమేష్ రవిందర్ గోపి తదితరులు పాల్గొన్నారు
Mar 16 2023, 06:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.3k