/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నార్కెట్ పల్లి లో ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి Miryala Kiran Kumar
నార్కెట్ పల్లి లో ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

నార్కెట్ పల్లి మండలం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సొంత గ్రామం బ్రహ్మణ వెళ్ళాంల శక్తి కేంద్ర ఇంచార్జ్ చిరుమర్ధి వెంకన్న గారి ఆధ్వర్యంలో ;(బూతులు 159,160,161,162) శక్తి కేంద్ర కార్నర్ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డా"నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాగానే కుర్చీ ఏసుకొని బ్రహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చిన కేసీఆర్ గారికి 9 ఏండ్ల పొద్దయితున్న ఇప్పడిదాక సార్ కి కుర్చీ దోర్కట్లేద అని ప్రశ్నించినారు స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పక్కన పెట్టి సొంత వ్యాపారాలు చేసుకొని అక్రమ సంపాదన పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారని ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శేపూరి రవిందర్ గారు, సీనియర్ సిటిజన్ పాల్వాయి భాస్కర్ రావు గారు,మండల అధ్యక్షుడు కొరివి శంకర్, మాస శ్రీను,శేపూరి రాజు, ముకుంట్ల గణేష్,బుతూ అధ్యక్షులు మంద చంటి,చిరుమర్తి రవి,గేల్లే రాజు,గంజి వెంకటేశ్వర్లు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కు.... అభినందనల వెల్లువ.....!

హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రాజశేఖర్‌ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

యువకుడిని కానిస్టేబుల్‌ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు.

 సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

పద్మశాలి బీద కుటుంబానికి నల్లగొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

పద్మశాలి బీద కుటుంబానికి చెందిన నల్ల ధనమ్మ కొర్లపాడు గ్రామం ఈమెకు భర్త లేడు ఈమెకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని మా దృష్టికి వచ్చింది. పిల్లల ఫీజు నిమిత్తం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో Rs10000.00 పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ పొట్ట బత్తుల సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి కార్యదర్శి రాపోలు సతీష్ గారు రాపోలు శరభయ్య గారు గంజి రామలింగం గారు మిరియాల స్వామి గారు మిరియాల శ్రీనివాస్ గారు మిర్యాల వెంకటేశం గారు చిలుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, ప్రెస్ మీట్ లో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ డిమాండ్

నేడు నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్ష 80 వేల ఉద్యోగాలు నింపాలని పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందే ప్రభుత్వ అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాలని విద్యార్థులు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కావున గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేక విద్యార్థులు పరిస్థితి చాలా దయనీయమైనది కావున వెంటనే బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల పక్షాన 1,80,000 ఉద్యోగాలు నింపాలని లేనియెడల బహుజన విద్యార్థుల సమస్యలపై పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన పోరాడుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ వంగూరి సునీల్ ఎర్ర ప్రశాంత్ శివ చౌహన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టిన కారణంగా భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం: భార్యాభర్తలిద్దరికీ 14 రోజులు జైలు శిక్ష విధించిన సబ్ కలెక్టర్

నరసాపురం జాయింట్ కలెక్టర్ సూర్య తేజ ఓ వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సిటిజన్ ట్రిబ్యూనల్ కోర్టును మంగళవారం నిర్వహించారు. వృద్ధురాలుని పట్టించుకోని కొడుకు, కోడలికి 14 జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడుతూ.. నవ మాసాలు మోసి.. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయోవృద్ధుల సమయంలో పక్కన పెట్టి హింస పెడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నల్లగొండ 35వ వార్డు సీనియర్ నాయకులు

గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నల్గొండ 35వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ నాయకులుు గంజి రాజేందర్, 35 వ వార్డు అధ్యక్షులు తలారిిి యాదగిరిి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుు మాట్లాడుతూూ ఎమ్మెల్యే గారు మరెన్నో పెళ్లిరోజులుు జరుపుకోవాలనిి. సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.

కార్యదర్శిపై విచారణ చేపట్టిన డీపీఓ

కార్యదర్శిపై విచారణ చేపట్టిన డీపీఓ

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, సింగిల్ విండో చైర్మన్ సుబ్బా దత్తుమూర్తి స్వంత ఇంటి వద్ద వ్యవసాయ క్షేత్రంలో పంచాయతీ ట్రాక్టర్, పంచాయతీ కార్మికులతో పనులు చేపిస్తున్నాడని రేచిని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా పంచాయతీ అధికారి రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం విచారణ రిపోర్ట్ కు కలెక్టర్ కు అందజేస్తానని తెలిపారు. వీరితో పాటు మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, రేచిని సర్పంచ్ దుర్గుబాయి గ్రామస్తులు పాల్గొన్నారు.

నల్గొండ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి నల్గొండ జిల్లా గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం లో ముఖ్య అతిధులుగా హాజరైన ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు... ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు..

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పక్కగా వస్తాయని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు..

 మంగళవారం ఆయన పట్టణంలోని ఆర్జాలబావిలో 13,14,15,16,17 వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు.

దీనిలో భాగంగా డబుల్ బెడ్ రూం ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేశారన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

దరఖాస్తులను ఈనెల 26వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని అన్నారు . దరఖాస్తు దారులు దరఖాస్తులు ఇచ్చే క్రమంలో ఆందోళన చెందోదని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, నాయకులు దోనాల నాగార్జున్ రెడ్డి, మెండు చంద్ర శేఖర్ రెడ్డి, గోపు జలందర్ రెడ్డి, అన్వర్, ఆర్పీలు సిబ్బంది తదితరులు ఉన్నారు.

పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి సిఐటియు:తుమ్మల వీరారెడ్డి

పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి సిఐటియు:తుమ్మల వీరారెడ్డి

గ్రామపంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాలకుర్తి నుంచి పట్నం వరకు జరిగే గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం నల్లగొండ మండల ఎంపీడీవో కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ కార్మికులు తమ వయసు ఎంత గ్రామ పంచాయతీకి సేవ చేయడానికి వినియోగించినారని అన్నారు వారితో ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుని ఇప్పటివరకు వారికి కనీస వేతనం అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు అనేక సంవత్సరాలు పోరాడి జీవో నెంబర్ 51 ని సాధించుకున్నారని అంతలోనే మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో కార్మికులను కట్టు బానిసలు చేసి కార్మికుల చేత తమకు రాణి పనులు బలవంతంగా చేయిస్తూ వారి మరణాలకు కారణమవుతున్నారని ఇలా మరణించిన వారికి ఎలాంటి భద్రత లేదని వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ బిల్ కలెక్టర్ కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి అర్హులైన వారందరిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాలన్నారు కార్మికులకు ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని అన్నారు గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర పట్నం చేరుకునే లోపు సమస్యలు పరిష్కారం చేయకపోయినట్లయితే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, కానుగు లింగస్వామి, దయానంద్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, భీమ గాని, గణేష్ ,యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర అరుణ, పొన్న అంజయ్య, వడ్డేపల్లి యాదయ్య, సలివోదు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, కృష్ణ, సంజీవ, చింతకింది భద్రయ్య, రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.