/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి Mane Praveen
మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కేజీబీవీ అభివృద్ధికి రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ.1 కోటి 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను ( 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలుగునవి ) కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాల తో, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. 

18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం: కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ, విద్య వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాల ఒక్కటే కాదు మనుగోడు నియోజకవర్గం లో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారని తెలిపారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారు. కానీ సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని ఆమె తెలిపారు. 

14 మంది పాఠశాల సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చొప్పున రూ.70 వేలు ఇస్తాం: రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 18 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధ వేసింది. ఆరోజే అనుకున్న ఏదో ఒక చోట ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని, అన్ని సౌకర్యాలు ఉండేలా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం, మునుగోడు ప్రజల తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు అని తెలిపారు.

ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యం అని చెప్పారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన ను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ల తో పాటు పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారు, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి, ప్రతి విద్యార్థి పై టీచర్లకు సునిశిత పరిశీలన ఉండాలన్నారు.

విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, వారు. సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి, వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తామని సిబ్బందికి ఆయన భరోసా ఇచ్చారు. అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇక్కడున్న మహాలక్ష్మి లందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

వనభోజనంలో సందడి చేసిన మహిళలు
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీల మహిళలు తమ ఐక్యతను చాటుకున్నారు. ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం కావడంతో రాంనగర్ పార్క్ లో వన భోజనాలతో సందడి చేశారు. ఒకరినొకరు పలకరించుకొని, సరదాగా మాట్లాడుకుని పాటలు పాడుకున్నారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.
NLG: మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, చౌరస్తా లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సంతాపం తెలిపారు.

ఈ మేరకు వారు మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడి గా మన్మోహన్ సింగ్ తన మేధస్సును ప్రదర్శించారని కొనియాడారు.

పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు.మిత భాషిగా, అత్యంత సౌమ్యుడు గా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థితప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, మాజీ మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మాజీ సర్పంచులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నున్సవత్ బిచ్చు నాయక్, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ మాధగోని శ్రీనివాస్, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ సిర్పంగి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బేత వెంకటేష్, పిఎసిఎస్ డైరెక్టర్  పగడాల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కురంపల్లి జంగయ్య, పొనుగోంటి శేఖర్, రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల యాదయ్య, వెన్నమనేని పాపారావు, కొత్త లొంకయ్య, కుమ్మరి లచ్చయ్య, లపంగి వెంకటయ్య, ఐతగోని ఉపేందర్, వడ్డే సైదులు, గ్యార వెంకటేష్, సిలువేరు యాదయ్య, గొట్టిముక్కల ప్రకాష్, పగిల్ల నీలయ్య, గ్యార యాదయ్య, తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.
'దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది'
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వారు తెలిపారు.

మన్మోహన్ సింగ్ ఒక ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా వివిధ పదవులు చేపట్టి దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాకులవరం అశోక్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, సీనియర్ నాయకులు దండేట్ కార్ పద్మయ్య, నకరగోని మల్లయ్య, బచ్చనగోని వెంకన్న,  ఎస్కే ఇబ్రహీం, సిలువేరి యాదయ్య, ఆకారపు శీను, గ్యార వెంకటేష్,గాదె అబ్బయ్య, వల్లంల యాదయ్య, దండేట్ కార్ నాగేష్, వల్లంల శీను, పెద్దిరి అంజయ్య ,పోలగోని జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఓవర్ హైట్ లోడ్ చేసుకొని వెళ్తున్న వాహనాలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
ఓవర్ లోడు, ఓవర్ హైట్ తో పలు వాహనాలు రహదారుల గుండా వెళ్తుండగా, లెంకలపల్లి గ్రామంలో కాటమయ్య గుడి వద్ద గుర్తు తెలియని వాహనం రాత్రి వేళలో 11 KE కరెంటు పోల్  విరగొట్టి, వైర్లు తెంపి వెళ్లిన ఘటన జరిగింది.

క్యాబిన్ పైన 10 ఫీట్ల హైట్ తో వాహనాలు లోడ్ చేసుకొని వెళ్తున్నాయి. విద్యుత్ సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నారు.

ఈ మేరకు ఓవర్ హైట్ తో వాహనాలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ సిబ్బంది, ప్రజలు కోరుచున్నారు.
TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపిన శాసన మండలి చైర్మన్
HYD:
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల  తెలంగాణ  శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

గొప్ప ఆర్ధికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట ప్రధానమంత్రి పివి నరసింహా రావు మంత్రి వర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారని తెలిపారు.

2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు, ఆయన మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ,  తన ప్రగాఢ సానుభూతిని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  తెలిపారు.

కాగా,  భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92).. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లోని మెడికల్ ఎమర్జెన్సీ లో వయో సంబంధిత కారణాలవల్ల చికిత్స పొందుతూ, గత రాత్రి  మరణించిన విషయం తెలిసిందే.


NLG: త్యాగాలతో సీపీఐ నిర్మితమైనది: నెల్లికంటి సత్యం

నల్లగొండ జిల్లా:

పీడిత ప్రజల పక్షంగా రైతు,కార్మిక పక్షపాతిగా నిలబడి అసమాన త్యాగాలతో సీపీఐ నిర్మితమైనదని, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.

గురువారం సీపీఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

నిజాయితీని చాటుకున్న యాదగిరిగుట్ట డిపో కండక్టర్
యాదాద్రి జిల్లా:
యాదగిరిగుట్ట డిపోకు చెందిన TGR-3 సర్వీస్ బస్సులో మహబూబాబాద్ జిల్లా, కే సముద్రం కు చెందిన ఎన్. ఉపేంద్ర మహిళా ప్రయాణికురాలు ఇవాళ ఘటకేసర్ నుండి జూబ్లీ బస్సు స్టేషన్ కు వెళ్ళే బస్సు లో  తన బ్యాగ్ ను మర్చిపోయి దిగి వెళ్లి పోయినది.

బ్యాగ్ ను గమనించిన యాదగిరిగుట్ట డిపో కండక్టర్ సి హెచ్.రమేష్, అట్టి బ్యాగ్ ను భద్రపరిచి డిపోలో అందజేశారు. ఆ బ్యాగ్ లో రూ.1,50,000/- నగదు, 2 జతల వెండి పట్టా గొలుసులు మరియు ఆధార్ కార్డ్, పాన్ కార్డు, రేషన్ కార్డ్  లు కలవు.ఆ బ్యాగ్ ను సంబంధిత  డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు డిపో భద్రతా సిబ్బంది సమక్షంలో బ్యాగ్ పోగొట్టుకున్న సంబంధిత మహిళలకు అందజేశారు.

బస్సులో తను మరిచిపోయిన బ్యాగ్ ను మరియు లక్ష యాభై వేల రూపాయల నగదు ఇతర విలువైన పత్రాలను భద్రంగా తనకు అందజేసినందుకు, ఆ మహిళా ప్రయాణికురాలు డిపో ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
NLG: నేర్మట నుండి శేరిగూడెం లింకు రోడ్డు ను బాగు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి
నల్లగొండ జిల్లా, చండూరు మండలం:
గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, నేర్మట నుండి శేరిగూడెం రోడ్డు బాగు చేయాలని, తక్షణమే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సిపిఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి ఈ రోడ్డుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర్మట నుండి శేరిగూడెం రోడ్డు బాగు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ రోడ్డు వెంట 200 కుటుంబాల రైతులకు ఈ రోడ్డు అవసరమని,ఈ రోడ్డు అద్వానంగా తయారు కావడంతో ఈ దారి వెంట నడవాలంటే బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, లెంకలపల్లి, శేరిగూడెం, గొల్లగూడెం  గ్రామాలకు లింకు రోడ్లు లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.

అదేవిధంగా వేరే ప్రాంతాల నుండి వచ్చిన పాదాచారులకు కూడా ఈ లింకు రోడ్లు బాగు చేయకపోవడంతో ఈ దారి వెంట నడవాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి, ఈ రోడ్లను బాగు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనియెడల  గ్రామ ప్రజలందరినీ ఏకం చేసి ఈ రోడ్డు బాగు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బొమ్మరగోని యాదయ్య, గ్రామ ప్రజలు ఈరటి శ్రీశైలం, రాములు, లక్ష్మయ్య, ఈరటి యాదయ్య, సైదులు, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
TG: మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

మెదక్ జిల్లా:

క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ ప్రఖ్యాత మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప చర్చ్ గా గుర్తింపు పొందిందని అన్నారు.

వందేళ్ల కిందట కరవు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహారం పథకం కింద భోజనం పెట్టి, చర్చి నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేటి ఉపాధి హామీ పథకానికి అదే స్ఫూర్తి ఉందని అన్నారు. చర్చి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని అన్నారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ఎనలేని సేవలు అందించాయని సిఎం కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్,ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.