DYFI భువనగిరి మండల అధ్యక్ష కార్యదర్శులుగా మైలారం శివప్రసాద్ , దయ్యాల మల్లేష్ ఎన్నిక
![]()
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) భువనగిరి మండల అధ్యక్ష కార్యదర్శులుగా మైలారం శివప్రసాద్, దయ్యాల మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. ఆదివారం జరిగిన మండల మహాసభలో DYFI అభివృద్ధి కోసం యువత ఉపాధి అవకాశాల కోసం స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని భవిష్యత్తులో అనేక పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు వీరితోపాటు మండల ఉపాధ్యక్షులుగా కుసుమ మధు, గడ్డం కనకరాజు, సహాయ కార్యదర్షులుగా పల్లెర్ల వినోద్, చందుపట్ల బిక్షపతి కమిటి సభ్యులుగా జాన సురేష్,ముడుగుల శేఖర్, గడ్డం చాణక్య లను ఎన్నుకున్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో గురువారం బిసి మండల నాయకులు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీన మిర్యాలగూడలో నిర్వహించే బీసీ గర్జన ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1947 దేశానికి స్వాతంత్రం వస్తే 1993 మండల్ కమిషన్ అమలు చేసే వరకు దాదాపు నాలుగు దశబ్దాలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. రాజకీయ రంగంలో నేటికి లేదు .మండల్ అమలుతో వచ్చిన ఇరువై ఏడు శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే ఇది కూడా అరకొరగా అమలవుతుందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు తెచ్చి ఉన్న కొద్ది అవకాశాలు గండి కొట్టారని అన్నారు. ఈ మహాసభలో తమ్మడబోయిన అర్జున్ కోకన్వీనర్ బీసీ జాతీయ చైతన్య వేదిక, సూరజ్ యాదవ్ మండల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ,ఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ,దేశ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
Nov 04 2024, 21:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
76.0k