/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ పొలాలకు.. Raghu ram reddy
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ పొలాలకు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ రైతులకు(Farmers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.." న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పంటతోపాటు పవర్‌పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతాం. విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. మేము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించాం" అని చెప్పారు.

అనంతరం అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతులకు సాగు, పంట విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని, రాగమయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు.

శారద పీఠం భూముల వ్యవహారంలో ట్విస్ట్, వైసీపీకి ఎఫెక్ట్ !!

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు రాజగురువుగా పలువురు బావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శారదా పీఠానికి మేలు చేకూర్చేలా వ్యవహరించారని, వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం రూ. 15 లక్షలకే 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పగించిందని వెలుగు చూడటంతో ఆ విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి వివరాలను బయటకు లాగుతోంది.

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో వేద విద్యాలయం ఏర్పాటు చెయ్యడానికి భూమి కేటాయించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మనవి చేసింది. గురువు అడిగిన వెంటనే అప్పటి సీఎం జగన్ శారదా పీఠానికి భూమి ఇవ్వడానికి అంగీకరించారు.

భీమిలి మండలంలోని కొత్తవలసలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్ లో సుమారు రూ 15 కోట్లు ఉందని స్థానికులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం శారద పీఠంపై ప్రేమతో ఎకరం భూమి రూ 1 లక్షకు ఇవ్వడానికి అంగీకరించింది. రెండు సర్వే నెంబర్లలోని 15 ఎకరాల భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించారు. శారదా పీఠానికి అప్పగించిన భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 225 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

రూ. 225 కోట్ల విలువైన భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించడంతో ఆ సమయంలో జగన్ ప్రభుత్వంపై అనేక మంది విమర్శలు చేశారు. గురుభక్తి చాటుకోవాలంటే ప్రభుత్వ భూములు దానం చెయ్యాల్సిన అవసరం లేదని విశాఖకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్పటి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదే సందర్బంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ఎదురు దాడికిదిగడంతో మాటల యుద్దం జరిగింది.

వేద విద్యాలయం కోసం తీసుకున్న భూములను వాణిజ్య అవసరాలు, రెవెన్యూ, నివాస అవసరాల కోసం ఉపయోగించుకునేలా మార్పులు చెయ్యాలని శారదా పీఠం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ దెబ్బతో గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంత తక్కువ ధరకు శారదా పీఠానికి వందల కోట్ల విలువైన భూములు అప్పగించింది అంటూ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శారదా పీఠానికి సుమారు రూ. 22 కోట్లకు భూమి కేటాయించవచ్చు అని అప్పట్లో అధికారులు నివేదిక ఇచ్చినా జగన్ ప్రభుత్వం మాత్రం ఆ నివేదిక పట్టించుకోకుండా కేవలం రూ 15 లక్షలకు 15 ఎకరాల భూమి ఇచ్చేసిందని వెలుగు చూడటంతో ఇప్పుడు ఆ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది.

ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి స్వ‌గ్రామానికి రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌గ్రామంలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అందుకు కారణం నేడు ఆయ‌న సొంతూరుకు తొలిసారిగా సీఎం హోదాలో బ‌య‌లుదేర‌డ‌మే. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండా రెడ్డిప‌ల్లి రెవంత్ రెడ్డి స్వ‌గ్రామం. ఈసారి దసరా పండుగ వేడుకలు అక్క‌డే జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి సొంతూరులో అడుగుపెట్ట‌నున్నారు. భాగ్య‌న‌గ‌రం నుంచి ఈ రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండారెడ్డి పల్లికి సీఎం చేరుకుంటారు. అక్క‌డే గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల‌ను జ‌రుపుతారు. దీంతోపాటు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట‌నున్నారు. గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను ప్రారంభిస్తారు. గ్రామాన్ని సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా మార్చేందుకు కృషి చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి గ్రామంలో అడుగుపెట్టనుండ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం మొద‌లైంది.

కొండారెడ్డి పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, అండర్ డ్రైనేజీ, నాలుగు లైన్‌ల‌ రోడ్డు, సెంటర్ లైటింగ్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, దేవాలయం తదితర వాటికి ముఖ్య‌మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి పర్యటన నేప‌థ్యంలో హెలిప్యాడ్ ప్రాంతం, పర్యటన జరిగే ప్రదేశాలను పోలీసుల ముందస్తుగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సీఎంను కలిసేందుకు రానుండడంతో భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని ర‌కాల జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి తిరిగి హైదరాబాద్ వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారుల‌కు సూచించారు.

నోయల్ టాటా ఎవరు? రతన్ టాటా తర్వాత టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎవరు

టాటా ట్రస్ట్‌కు కొత్త ఛైర్మన్‌ ఎంపికయ్యారు. రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రతన్ టాటా వారసుడి కోసం అన్వేషణ పూర్తయింది.

రతన్ టాటా మరణానంతరం నోయెల్ టాటా ఇప్పుడు టాటా ట్రస్ట్ బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌కు సంబంధించి శుక్రవారం జరిగిన టాటా ట్రస్ట్ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్ బోర్డు శుక్రవారం ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఈ నియామకంతో, నోయెల్ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్ మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరవ ఛైర్మన్‌గా మారారు. అతను నావల్ హెచ్. టాటా మరియు సైమన్ ఎన్. టాటా కుమారుడు మరియు రతన్ టాటా సవతి సోదరుడు. నోయెల్‌కు టాటా గ్రూప్‌తో 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన పలు టాటా గ్రూప్ కంపెనీల బోర్డుల్లో కూర్చున్నారు. అతను టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్ మరియు టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్.

2010-11లో టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనప్పటి నుండి, రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ అధిపతిగా నోయెల్ తయారవుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. టాటా ఇంటర్నేషనల్ అనేది విదేశాలలో అందించే ఉత్పత్తులు మరియు సేవల కోసం టాటా గ్రూప్ యొక్క విభాగం.

నోయెల్ టాటా యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్ (UK) నుండి పట్టభద్రుడయ్యాడు మరియు ఫ్రాన్స్‌లోని INSEAD నుండి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP) పూర్తి చేశాడు. నోయెల్ టాటా గతంలో నెస్లే, UKలో పనిచేశారు. నోయెల్ ఐరిష్ పౌరుడు మరియు టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు - లేహ్, మాయ మరియు నెవిల్లే.

దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు.

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో అమ్మవారి భక్తులతోపాటు పలు హిందు సంఘాల నేతలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.

అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ప్రవేశించిన దుండగులు తొలుత విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను పగలకొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం వద్దనున్న పూజా సామాగ్రిని సైతం చెల్లాచెదురుగా పడేశారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దుండగులు తొలగించారు.

ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ హిందు దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూదేశంలో ఉన్నామా? లేకుంటే ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అందులోభాగంగా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాండియా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం అయ్యే వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారని ఉన్నతాధికారులు తెలిపారు. అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన అర్థరాత్రి లేకుంటే... శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఐఏఎస్, ఐపీఎస్‌లకు బిగ్ షాక్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది.

కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది డీఓపీటీ.

తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఏం. ప్రశాంతి తదితరులకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి లకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది.

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష బిస్త్‌లకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ హరి కిరణ్‌కు డీఓపీటీ రిలీవ్ ఆర్డర్స్ ఇచ్చింది. అక్టోబర్16వ తేదీ లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రతన్ టాటా జీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...అమిత్ షా పీయూష్ గోయల్

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రతన్ టాటా జీ నిన్న మరణించారు, నేను ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. రతన్ టాటా భారతదేశ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచంలోనే గౌరవనీయమైన పారిశ్రామికవేత్త.

టాటా గ్రూప్ ప్రముఖ టాటా గ్రూప్‌కు అనేక మార్పులు అవసరమైన సమయంలో అతను టాటా గ్రూప్ నాయకత్వాన్ని స్వీకరించాడు ఇకపై మనతో లేరు కానీ ఆయన వదిలేసిన వారసత్వం చిరకాలం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది...ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

రతన్ టాటాతో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భావోద్వేగానికి గురయ్యారు.

అతను ఇలా అన్నాడు ...ఒకప్పుడు అతను ముంబైలో అల్పాహారం కోసం ఇంటికి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, మేము సాధారణ ఇడ్లీ, సాంబార్, దోస మాత్రమే వడ్డించాము ... కానీ అతను దానిని చాలా మెచ్చుకున్నాడు. అంత గొప్పవాడు రతన్ టాటా

హర్యానా ఓటమి తర్వాత, మహారాష్ట్ర-జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏమవుతుంది?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఘోర పరాజయం అని తేలింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చిన ఊపును ఆ పార్టీ కోల్పోయింది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఓటమి ప్రభావం ఈ ఎన్నికల్లోనూ కనిపించనుందనేది సుస్పష్టం.

హర్యానా, జమ్మూకశ్మీర్‌లలో కాంగ్రెస్‌ ఓటమి ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపిస్తుంది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో కాంగ్రెస్‌కు కష్టాలు ఎదురుకావచ్చు. సహోద్యోగులతో బేరసారాలు చేయడం కష్టం. ఈ ఏడాది చివరి నాటికి మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్నికలు జరగవచ్చని మీకు తెలియజేద్దాం.

మహారాష్ట్ర గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అక్కడ కాంగ్రెస్ తరపున నిరంతరం ప్రచారం చేయబోతున్నారు. చాలా సభల్లో ప్రసంగించారు. అదే సమయంలో బీజేపీ కూడా ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటోంది. ఈ కారణంగానే మహారాష్ట్రలోనూ బీజేపీ తన బలాన్ని ఉపయోగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మహారాష్ట్రలో జరిగే పోరు కఠినంగానే ఉంటుంది. హర్యానాలో భాజపా విజయం సాధించడంతో, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆ పార్టీ తన బలాన్ని అనేక రెట్లు వేగవంతం చేయగలదు.

జార్ఖండ్‌ ఎన్నికల్లోనూ బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరిగిన తీరు, లవ్ జిహాద్ కేసులు నమోదవడం, గిరిజన గ్రామాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారుల రాకపోకలు పెరగడం వంటి కారణాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం లక్ష్యానికి గురైంది. ఈ ఎన్నికలకు సంబంధించి వారిని సమస్యగా చేసుకుని భాజపా తన పూర్తి బలాన్ని అక్కడ ఉంచడానికి కారణం ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్తున్నారు. అక్కడ మళ్లీ ఎవరూ అధికారంలోకి రాలేరని బీజేపీకి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్‌లో మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ చాలా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇండియా బ్లాక్‌లో తనను తాను అన్నయ్యగా చూపించుకోవడం ప్రారంభించింది. కానీ హర్యానా, జమ్మూ కాశ్మీర్‌ల ఓటమితో ఆయన భ్రమ తప్పిపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ జూనియర్ భాగస్వామిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ 51 సీట్లలో 42 గెలుచుకుంది. కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

హర్యానాలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తర్వాత బీజేపీతో ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్‌లో, 15 ఏళ్ల అధికార వ్యతిరేక వేవ్‌ను పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోయింది, అయితే హర్యానాలో పదేళ్లుగా అధికార వ్యతిరేక తరంగం ఉన్నప్పటికీ పార్టీ గెలవలేకపోయింది.

హర్యానాలో కాంగ్రెస్ ఓటమి ప్రత్యర్థి పార్టీల భారత కూటమిని దెబ్బతీసింది, ఇది భవిష్యత్ రాష్ట్ర ఎన్నికల కోసం వారి విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ వ్యూహంపై పునరాలోచించుకోవాలని సూచించింది. హర్యానాలో ఓటమి తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన నాయకుడు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీతో ప్రత్యక్ష పోరులో ఆ పార్టీ బలహీనపడుతోంది. ఇలా ఎందుకు జరుగుతుంది. మొత్తం కూటమిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్‌కు మిత్రపక్షమని మీకు తెలియజేద్దాం.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గురించి నేరుగా ప్రస్తావించకుండా.. ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు. MCD కౌన్సిలర్లను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, హర్యానా ఎన్నికల ఫలితాలను చూడండి. అక్కడ ఏం జరిగింది? మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ఎవరూ బలి కాకూడదనేది ఈ ఫలితం చెప్పే అతి పెద్ద పాఠం.

రతన్ టాటా మృతి పై మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు సంతాపం

ప్రముఖ వాణిజ్య దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వాణిజ్య రంగంలో ఎన్నో విలువలు పాటిస్తూ తన దైన శైలిలో దూసుకుపోయిన గొప్ప వాణిజ్యవేత్త అన్నారు.

ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా బుధవారం ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో యావత్ దేశ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. వాణిజ్య రంగంలో ఎన్నో విలువలు పాటిస్తూ తన దైన శైలిలో దూసుకుపోయిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా. ఆయన మరణంపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేస్తూ.. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

రతన్ టాటా దూరదృష్టి గల గొప్ప వ్యాపార నాయకుడు, దయగల మనస్సు కలవారు, అసాధారణమైన వ్యక్తి. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. అదే సమయంలో, మన సమాజాన్ని మెరుగుపరచాలనే నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆయన్ని ఎంతో మంది ఆరాధిస్తున్నారు'' అని అన్నారు.

రతన్ టాటాలోని ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే అది పెద్ద కలలు కనడం. తాను సంపాదించింది సమాజానికి తిరిగి ఇవ్వడం. అది ఆయన అభిరుచి కూడా. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ వంటి కొన్ని కారణాలలో అతను ముందు వరుసలో ఉన్నారు'' అన్నారు.

రతన్ టాటాతో జరిపిన ఎన్నో చర్చలు నా మనస్సులో నిండిపోయాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయనను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండేవాడిని. మేము విభిన్న సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నాము. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా చర్చలు నడిచాయి. ఆయన మరణించడం చాలా బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని రాసుకొచ్చారు.

జూబ్లీహిల్స్‌ నాలా ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు..

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు.

జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఇందులో వాస్తవాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా జీహెచ్‌ఎంసీని కోరింది.

దీంతో ముగ్గురు ఇంజనీరింగ్‌ అధికారులు రోడ్డు నంబరు 36లో పర్యటించారు. జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌(Jubilee Hills Police Station) వద్ద నాలా ఆక్రమణకు గురైనట్టు అధికారులు నిర్థారించారు.

అనంతరం నాలా వెడల్పును తగ్గిస్తూ వ్యాపార సముదాయాలు వెలిసినట్టు తేలింది. కొన్ని ప్రాంతాల్లో నాలా కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు నివేదిక రూపొందించి హైడ్రాకు అందించనున్నారు.