/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం Raghu ram reddy
ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం

ఏపీలోని ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది.

ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని వైఎస్‌ జగన్‌ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు తన ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై పుంగనూరు రోడ్డులో ఉన్న స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లింది. ఇదే అదనుగా స్వర్ణకుమారిని వెంకటేశ్‌ కిడ్నాప్‌ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లి టూటౌన్‌ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే అదే సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్‌ చేసింది. కానీ కాల్‌ ఫార్వర్డ్‌ అనే వాయిస్‌ వినిపించింది. ఆ రోజు సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని భావించింది.

కానీ అక్టోబర్‌ 1వ తేదీన పింఛన్‌ తీసుకునేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు తెలిపారు. దీంతో మదనపల్లెకు వచ్చిన సీఐ.. తన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల మొత్తం విచారించాడు. ఎక్కడ ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

సీఐ తల్లి కిడ్నాప్‌, హత్య నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఈ అరాచకం ఏంటి చంద్రబాబూ అని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వంలో పోలీసు కుటుంబాలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ గప్పాలు కొట్టడం కాదు.. శాంతి భద్రతలను ఎలా రక్షించాలో ఫస్ట్‌ తెలుసుకో అని హితవు పలికింది.

ఏపీలో సీఐ ఫ్యామిలీకే రక్షణ లేదంటే ఇది మీ చేతగానితనం కాదా అని ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్ష

జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరు అందుకుంటారో కొద్ది గంటల్లో తేలిపోనుంది.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014లో చివరిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఐదేళ్ల తర్వాత 2019లో జరగాల్సి ఉండగా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తదితర పరిణామాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు జరిపించాల్సిందేనని ఆదేశించింది.

దీంతో నియోజకవర్గా పునర్‌విభజన పూర్తిచేసి ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-ఎన్సీ కూటమి, పీడీపీ, బీజేపీల మధ్యే సాగింది. పునర్‌విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్లు పెరగడం బీజేపీకి లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూలంగా ఉంది.

ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. అక్టోబరు 5 ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తమదే గెలుపని, బీజేపీని హరియాణా ప్రజలు ఇంటికి సాగనంపుతారని కాంగ్రెస్ చెబుతోంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీకే మొగ్గు ఉందని అంటున్నాయి. దీంతో హస్తం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.

పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంలో సాధారణంగా అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయే కాసేపట్లో తేలిపోనుంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల విభేదాలు ప్రధానాంశంగా మారాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకు గానూ ఐదింటితోనే సరిపెట్టుకుంది.

నాగార్జున, సమంతలపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపైన, సమంత నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యల దుమారం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్యపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న క్రమంలో కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు అక్కినేని ఫ్యామిలీకి ఆగ్రహాన్ని తెప్పించాయి .

ఒక్క నాగార్జున ఫ్యామిలీ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం కొండ సురేఖ వ్యాఖ్యల పైన భగ్గుమంది. అయితే ఆ విషయంలో తను తప్పు చేశానని ఒప్పుకొని సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ కేటీఆర్ గురించి మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి లోనై తాను వ్యాఖ్యలు చేసినట్టు తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించమని కోరి తాను తను వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

అయినప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యల పైన అక్కినేని ఫ్యామిలీ మాత్రం వెనక్కు తగ్గలేదు. నాగార్జున ఏకంగా కొండా సురేఖ పైన పరువు నష్టం దావా సివిల్, క్రిమినల్ కేసులను వేసి ఆమెపై సమర శంఖాన్ని పూరించారు. ఇక ఇదే సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్కినేని నాగార్జున, సమంతల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై రఘునందన్ రావు వ్యాఖ్యలు

ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున పైన, సమంత పైన రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పేర్కొన్న ఆయన 2016 లోనే హెచ్ఎండిఏ దీనిపై రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదు అనేది నేటికీ పెద్ద ప్రశ్న అంటూ మాట్లాడారు.

ఇదే సమయంలో నాగర్జున కోడలుగా ఉన్న సమంత పైన కూడా ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నాగార్జున కోడలుగా ఉన్న సమంత ఒక్కసారిగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అసలు సమంతకు చేనేత రంగం గురించి ఏం తెలుసు అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.

రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి?

అప్పటి ప్రభుత్వానికి రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి అంటూ రఘునందన్ రావు షాకింగ్ డిమాండ్ పెట్టారు. అప్పట్లో ప్రభుత్వానికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధాలు ఏమిటో వాళ్లే చెప్పాలంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాగార్జున, సమంతల పైన జరుగుతున్న రగడకు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది.

పవన్ కల్యాణ్ కాలి గోటికి.. ప్రకాష్ రాజ్ సరిపోడు

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ప్ర‌కాశ్ రాజ్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. అత‌నో స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ (NattiKumar) ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj)పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదని ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. ప్రకాష్ రాజ్ స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం , ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్.. ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్ పై ఎందుకు స్పందించలేదు, రజనీకాంత్‌ను అన్నప్పుడు ఏమి స్పందించలేదు.. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నాడని దుయ్య‌బ‌ట్టారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడని.. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందని అన్నారు. ప్రకాష్‌రాజ్.. జగన్, కేటీఆర్‌ల ఏజెంట్.. కొండా సురేఖపై ఇండస్ట్రీ ట్వీట్స్ వెనుక కూడా ప్రకాష్ రాజే ఉన్నాడని అనుమానంగా ఉంద‌న్నారు. కేటీఆర్ కోసమే ఇదంతా చేసి ఉంటాడ‌న్నారు.

చిరంజీవి గారిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు జ‌గ‌న్‌పై.. కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు వారిపై ఎందుకు ట్వీట్ చేయలేదంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా.. టీడీపీ, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీరు ట్వీట్లు వేస్తారా అని అన్నారు. ఇంకా.. రేణు దేశాయ్ గారు ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఏమైంది, భువనేశ్వరి గారిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఏమైంది, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడిన‌ప్పుడు, చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏది.. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా.. జగన్ కేసీఆర్ అంటే మీకు భయమా అని నిల‌దీశారు. ప్రకాష్ రాజ్ ధైర్యం ఉంటూ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి.. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదని హిత‌వు ప‌లికారు.

కొండా సురేఖ ఓ నిర్మాత, బీసీ మహిళ.. ఆమెను ట్రోల్ చెస్తే.. ఇండస్ట్రీలో ఎవరు ఖండించలేదన్నారు. ఇటీవ‌ల మంత్రి మాట్లాడింది తప్పే‌‌.. కానీ ఆవిడ క్షమాపణ చెప్పారు.. కానీ నాడు వైసీపీ వారు, పోసాని మాట్లాడింది నీచాతినీచం. జానీ మాస్టర్ పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టారు.. అందుకే అవార్డ్ రద్దైంది..దీని వెనుక కుట్ర కోణం ఉంది. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్ కే గర్వకారణం. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు త్వ‌ర‌లోనే బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయంపై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి.. జానీతో పాటు ఆ అమ్మాయి కార్డ్ కూడా క్యాన్సిల్ చేయాలి. జానీ అవకాశాలు అమ్మాయికి తరలించే ప్రయత్నం జరుగుతోంది. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దన్నారు. నేషనల్ కమిటీకి డాన్సర్స్ మెయిల్ పెట్టాల‌ని.. జానీ అవార్డ్ క్యాన్సిల్ అవ్వగానే.. బెయిల్ ను అతనే నిజాయితీగా క్యాన్సిల్ చేసుకున్నాడని జానీ విషయంలో సత్యమే గెలుస్తుందన్నారు. సినీ ఇండస్ట్రీని కాపాడండి..‌ అనవసరమైన అపార్దాలను ఇండస్ట్రీకి ఆపాందించవద్ద‌న్నారు.

తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అన్నీ సాక్షాలతో ప్రెస్మీట్ పెట్టారు. గత ఐదు సంవత్సరాల్లో రెడ్డి గార్ల హాయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మి డబ్బులు జగన్ ఎకౌంట్లో వేశారు. శేషాచలం అడవులను కొట్టేయటం వల్ల అడవి జంతువులు భక్తులపై దాడి చేశాయి. చంద్రబాబు గారు ఇంకా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదో తెలియ‌డం లేద‌న్నారు. జగన్ ను తిట్టండి.. ఏసు ప్రభును ఎందుకు తిడుతున్నారు.. త‌ప్పు చేసింది జగన్ మాత్రమేన‌ని అన్నారు.

పని చేసే వారికి.. నిజాయితీ పరులకు పదువులు ఇవ్వండి. కాకా పట్టే వారికే ఇంకా పదువులు ఇస్తున్నారు.. ‌గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి.. మరలా ఇసుక దందాలు మొదలవుతాయని మంత్రి లోకేష్ దృష్టి పెట్టాల‌న్నారు. నారా లోకేష్ గారు ఫోన్ అందుబాటులో ఉన్నా.. కొందరు ఎంఎల్ఎలు ఫోన్లకు కూడా దొరకటం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వెంటనే లొకేష్ రివ్యూలు చేస్తున్నారు. కానీ ఎంఎల్ఎ లు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీటిని చంద్రబాబు, లోకేష్, పవన్‌లు త్వ‌ర‌గా రెక్టిఫై చేయాలి. 2029లో లోకేష్ సీఎం కావాలని వ్యక్తిగతంగా అశిస్తున్నా అన్నారు.

ఆ విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ విద్యార్థినికి స్థానిక కోటాలో అడ్మిషన్‌ ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపిన ఘటనలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేశింది. సదరు విద్యార్థినికి స్థానిక కోటాలోనే సీటు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ విషయంలో వచ్చిన ధర్మ సంకటంపై కాళోజీ విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరు విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన.. హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్‌ను.. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన.. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది.

అయితే.. ఫరూక్ 1998 నుంచి 2008 వరకు (10వ తరగతి వరకు) దుబాయ్‌లో విద్యాభ్యాసం చేసింది. 2019 నుంచి తెలంగాణలోనే నివాసం ఉంటోంది. తెలంగాణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు హాజరయ్యారైనట్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జులైలో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి ఇటీవల చేసిన సవరణల ప్రకారం.. ఒక విద్యార్థి తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివినా.. లేదా అదే వ్యవధిలో రాష్ట్రంలో నివసించినా.. వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాది వివరించారు.

నివాస అవసరాన్ని పూర్తి చేసి.. అవసరమైన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించినప్పటికీ.. పిటిషనర్‌ను స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవటం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థినిని ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌ను ఆదేశించింది. లోకల్ కేటగిరీ కింద అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆ విద్యార్థినికి అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తెలంగాణ స్థానికతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై సర్వత్రా వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. కోర్టు వివాదాలతో.. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోంది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని చెప్పారు.

మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రలతో భేటీ అవుతున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నమామీ గంగకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా.. తెలంగాణ మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తుండడంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

కొండా సురేఖపై నాగార్జున పిటీషన్ విచారణ.. కోర్టు కీలక ఆదేశాలు!

అక్కినేని కుటుంబంపై నాగచైతన్య సమంతల విడాకులపైన కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున కొండ సురేఖ వ్యాఖ్యల విషయంలో చాలా సీరియస్ గా స్పందిస్తున్న విషయం తెలిసిందే.

నాగార్జున పిటీషన్ పై విచారణ

అయితే తాజాగా సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపైన నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది ఈరోజు కోర్టులో తమ వాదన వినిపించారు. సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో తమ వాదనను వినిపిస్తూ నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున

గత గురువారం నాడు నాంపల్లి కోర్టులో మంత్రి కొండ సురేఖ పైన నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు . క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన నాగార్జున తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబం పైన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నారు.

నాగార్జున పిటీషన్ విచారణ రేపటికి వాయిదా

నిజా నిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఆమె పైన చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కొండా సురేఖపై నాగార్జున ఫైర్

అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాగార్జున తన కుటుంబం విషయంలో తాను చాలా బలవంతుడిననీ ఎవరైనా సరే తన కుటుంబం జోలికొస్తే తాను ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో తమ కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తీవ్ర అసహనంలో నాగార్జున

మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దంటూ కొండా సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున ఆమె పైన 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు . అంతే కాదు క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేసి సురేఖ పైన సమర శంఖం పూరించారు.

30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ?

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఏపీ చిన్నా తక్కువ జనాభా ఉన్న, 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు అదీ కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికి 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది.

తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ మార్కాపురం, మదనపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్ జిల్లాలను మార్చారు కానీ… ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తెలంగాణా రైతుల రుణమాఫీపై షాకింగ్ లెక్కలు!

రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంబిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతాంగంతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ ను ఇరకాటంలో పెట్టేలా రుణమాఫీపై షాకింగ్ లెక్కలు చెప్పారు.

రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన మోసం

ఈ బహిరంగ లేఖలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆ హామీని నిలబెట్టుకోలేదని హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కానీ రాష్ట్రంలో రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు వెల్లడించారు.

రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ చేసింది ఇదే

రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్న హరీష్ రావు సెప్టెంబర్ 25వ తేదీన ఆర్టిఐ దరఖాస్తుకు ఎస్బిఐ ఇచ్చిన సమాచారంతో రుణమాఫీ పూర్తిగా కాలేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం తీసుకున్న రైతుల సంఖ్య రెండు లక్షల 62,341 కాగా ఇప్పటివరకు లక్ష 30 వేలు 915 మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు.

లెక్కలతో బయటపెట్టిన హరీష్ రావు

ఇక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5 లక్షల 74,137 కాగా, 2 లక్షల 99 వేల 445 మంది రైతులకు రుణమాఫీ అయిందని మిగతా వారికి కాలేదన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య రాష్ట్రంలో 1,65,67 మంది కాగా ఇప్పటివరకు 65,231 మందికి రైతు రుణమాఫీ పూర్తయినట్టు ఎస్బిఐ డేటా అందించిందని హరీష్ రావు పేర్కొన్నారు.

రుణ మాఫీపై బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు

మొత్తంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని రైతులను పక్కా మోసం చేసిందని హరీష్ రావు ఆధారాలతో సహా బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, తెలంగాణనే కాదు భారతదేశాన్ని కూడా మోసం చేసిందని హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గమని రైతు రుణమాఫీనే శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో బాంబు పేల్చిన ఆరా మస్తాన్

వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజార్టీ ప్రజలు ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు.ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది.

ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరా మస్తాన్ జగన్‌ను గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలొచ్చాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు.పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అధికారికంగా అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు.అయితే ఎన్నికల తతంగం ముగిసిన 100 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరా మస్తాన్ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆరా మస్తాన్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.