/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ? Raghu ram reddy
30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ?

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఏపీ చిన్నా తక్కువ జనాభా ఉన్న, 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు అదీ కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికి 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది.

తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ మార్కాపురం, మదనపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్ జిల్లాలను మార్చారు కానీ… ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తెలంగాణా రైతుల రుణమాఫీపై షాకింగ్ లెక్కలు!

రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంబిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతాంగంతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ ను ఇరకాటంలో పెట్టేలా రుణమాఫీపై షాకింగ్ లెక్కలు చెప్పారు.

రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన మోసం

ఈ బహిరంగ లేఖలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆ హామీని నిలబెట్టుకోలేదని హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కానీ రాష్ట్రంలో రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు వెల్లడించారు.

రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ చేసింది ఇదే

రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్న హరీష్ రావు సెప్టెంబర్ 25వ తేదీన ఆర్టిఐ దరఖాస్తుకు ఎస్బిఐ ఇచ్చిన సమాచారంతో రుణమాఫీ పూర్తిగా కాలేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం తీసుకున్న రైతుల సంఖ్య రెండు లక్షల 62,341 కాగా ఇప్పటివరకు లక్ష 30 వేలు 915 మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు.

లెక్కలతో బయటపెట్టిన హరీష్ రావు

ఇక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5 లక్షల 74,137 కాగా, 2 లక్షల 99 వేల 445 మంది రైతులకు రుణమాఫీ అయిందని మిగతా వారికి కాలేదన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య రాష్ట్రంలో 1,65,67 మంది కాగా ఇప్పటివరకు 65,231 మందికి రైతు రుణమాఫీ పూర్తయినట్టు ఎస్బిఐ డేటా అందించిందని హరీష్ రావు పేర్కొన్నారు.

రుణ మాఫీపై బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు

మొత్తంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని రైతులను పక్కా మోసం చేసిందని హరీష్ రావు ఆధారాలతో సహా బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, తెలంగాణనే కాదు భారతదేశాన్ని కూడా మోసం చేసిందని హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గమని రైతు రుణమాఫీనే శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో బాంబు పేల్చిన ఆరా మస్తాన్

వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజార్టీ ప్రజలు ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు.ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది.

ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరా మస్తాన్ జగన్‌ను గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలొచ్చాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు.పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అధికారికంగా అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు.అయితే ఎన్నికల తతంగం ముగిసిన 100 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరా మస్తాన్ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆరా మస్తాన్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.

వదంతులేం నమ్మొద్దు.. అంతా బాగానే ఉంది.. ఆ వార్తలపై రతన్ టాటా క్లారిటీ!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సోమవారం రోజు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి. లో బీపీతో ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో చేరారని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే వార్తలు విస్తృతమవుతున్న తరుణంలోనే రతన్ టాటా ట్విట్టర్‌లో దీని గురించి స్పందించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.

తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై స్పందించారు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు. బీపీ డౌన్ అయి ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్‌లో (x) పేర్కొన్నారు. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నట్లు వివరించారు. అంతకుముందు.. తీవ్ర అనారోగ్యంతో.. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారని, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాల్లో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే.. సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో స్వయంగా రతన్ టాటానే స్పందించాల్సి వచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులేనని ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.

నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు/ఊహాగానాల గురించి తెలిసింది. అందుకే నేను దీని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నా వయసు రీత్యా.. సాధారణ వైద్య చికిత్సల కోసమే ఆస్పత్రికి వెళ్లాను. ఇక్కడ ఆందోళన అవసరం లేదు. నేను ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నా. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని.. ప్రజలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.' అని రతన్ టాటా ట్వీట్ చేశారు.

ఏపీలో మరో 10 రూపాయల డాక్టర్-దసరా నుంచే..! ఎక్కడో తెలుసా

ఏపీలో ప్రస్తుతం ఏ చిన్న ఆస్పత్రికి వెళ్లినా ఔట్ పేషెంట్ (ఓపీ) సర్వీస్ కోసం కనీసం 500 సమర్పించుకోవాల్సిందే. ఆ తర్వాత పరీక్షలు, మందులు, సర్జరీలు కావాలంటే భారీ మొత్తం ఇచ్చుకోక తప్పదు. కానీ ఇంకా రాష్ట్రంలో పది రూపాయల డాక్టర్లు అక్కడక్కడా తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. అంతే కాదు ఇదే కోవలో మరికొందరు పది రూపాయల డాక్టర్లు కూడా తమ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పులివెందులలో 10 రూపాయల డాక్టర్ గానే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి వెళ్లి కడపలో ఇదే పది రూపాయల కాన్పెప్ట్ తో నూరీ పరీ అనే మహిళా డాక్టర్ కూడా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు చేస్తున్న డాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరో 10 రూపాయల డాక్టర్ సేవ చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ఎం. లక్ష్మీప్రియ తన సొంత గడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఈ దసరా నుంచే ఈ సత్ కార్యం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 8 వరకు డాక్టర్ లక్ష్మీప్రియ అందుబాటులో ఉండనున్నారు. నందిగామలో ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ లోని యాదవుల బావి దగ్గర ఉన్న లత క్లినిక్స్, C/O అజయ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో ఈ పది రూపాయల డాక్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ పోస్టుల పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులు

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

అసభ్యకరమైన, అసత్యమైన ఫేక్ పోస్టులు చేయడం ఆపకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాల పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హమీల అమలుపైన ఫొకస్ చేయాలని సూచన

ఇప్పటికైనా తీరు మార్చుకొని ఫేక్ పోస్టులు ఆపకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరిక

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వకాధ్యక్షులు కేటీఆర్ గారి పైన పదేపదే తప్పుడు పొస్టులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న అసహ్యకరమైన అడ్డగోలు, ఫేక్ పోస్టుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సలహా మేరకు నిజామాబాద్ జిల్లా కమిషనర్ కి పార్టీనేతలు పలు సామాజిక మాద్యమాల్లో ఉన్న పోస్టులపైన ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనూ సిసిఎస్ కేంద్ర కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్, తదితరులు స్థానిక ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు సిరిసిల్లలోనూ పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కేటీఆర్ గారి పైన పెట్టిన పలు పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. వరంగల్లోనూ పలు చోట్ల ఈ అసత్యమైన సోషల్ మీడియా పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. 

ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సోషల్ మీడియాలో ఇతర పార్టీలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు తన పార్టీ కార్యకర్తలు, పెయిడ్ ట్రోల్స్ తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిరంతరంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఈ దుష్ప్రచారాన్ని ఆపకుంటే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఈ ఈ నీచమైన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ తెరలెపిందన్నారు. ఇప్పటికైనా తమ బుద్ధి మార్చుకొని ఇతరులకు సుద్దులు చెబుతున్న తీరుగా, తమ సొంత పార్టీ సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచాలని ముఖ్యమంత్రికి సూచించారు.

జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.

2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.

అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.

చంద్ర‌బాబు ఉదార‌త‌.. స్వ‌గ్రామంలో అమ్మ‌వారి ఆల‌యానికి దారి చూపిన సీఎం

సీఎం చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఉదార‌త చాటారు. త‌న స్వ‌గ్రామంలోని అమ్మ‌వారి ఆల‌యానికి రాక‌పోక‌లు సాగించే భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా దారి చూపారు. ఏపీలోని తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లం కందుల‌వారిప‌ల్లె పంచాయ‌తీ నారావారిప‌ల్లెలోని నాగాల‌మ్మ ఆల‌యంలో గ్రామ‌స్థులు నిత్యం పూజ‌లు చేస్తుంటారు. 

ఇక ప్ర‌తియేటా సంక్రాంతి సంద‌ర్భంగా కుటుంబ‌స‌మేతంగా స్వ‌గ్రామానికి వెళ్లే చంద్ర‌బాబు కూడా అమ్మ‌వారికి పూజ‌లు చేయ‌డం ఆన‌వాయతీ. అయితే, ఈ ఆల‌యానికి వెళ్లేందుకు స‌రైన దారి లేదని స్థానికులు ఇటీవ‌ల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

దాంతో వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు తానే 90 సెంట్ల స్థ‌లాన్ని కొనుగోలు చేశారు.

ఆ స్థ‌లం గుండా రాక‌పోక‌ల‌కు దారిని ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చంద్ర‌బాబు ఉదార‌త‌ను కొనియాడుతున్నారు.

సెక్రటేరియట్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే లేని ఇబ్బంది.. పేదల ఇండ్లు ఉంటే ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్‌ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది తొలగిస్తారా అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌, సెక్రటేరియట్‌, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయి.

వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్‌ అయ్యారు. ఎవ్వరు అడ్డొచ్చిన మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్‌లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు.

సెక్రటేరియట్‌తో పాటు బాపు ఘాట్ ఇలా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్‌టీఎల్‌లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇండ్లు ఉంటే ఇబ్బంది ఏమిటని అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

ఆయన ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రిబుల్ తలాక్, సీఏఏ లాంటి చట్టాలు తెచ్చారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర, కశ్మీర్, హర్యానాలో ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు.

కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాల కోసం.. వేల మంది భారతీయుల క్యూ

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదని అందులో పేర్కొన్నారు.

ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.