/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వదంతులేం నమ్మొద్దు.. అంతా బాగానే ఉంది.. ఆ వార్తలపై రతన్ టాటా క్లారిటీ! Raghu ram reddy
వదంతులేం నమ్మొద్దు.. అంతా బాగానే ఉంది.. ఆ వార్తలపై రతన్ టాటా క్లారిటీ!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సోమవారం రోజు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి. లో బీపీతో ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో చేరారని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే వార్తలు విస్తృతమవుతున్న తరుణంలోనే రతన్ టాటా ట్విట్టర్‌లో దీని గురించి స్పందించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.

తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై స్పందించారు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు. బీపీ డౌన్ అయి ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్‌లో (x) పేర్కొన్నారు. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నట్లు వివరించారు. అంతకుముందు.. తీవ్ర అనారోగ్యంతో.. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారని, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాల్లో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే.. సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో స్వయంగా రతన్ టాటానే స్పందించాల్సి వచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులేనని ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.

నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు/ఊహాగానాల గురించి తెలిసింది. అందుకే నేను దీని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నా వయసు రీత్యా.. సాధారణ వైద్య చికిత్సల కోసమే ఆస్పత్రికి వెళ్లాను. ఇక్కడ ఆందోళన అవసరం లేదు. నేను ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నా. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని.. ప్రజలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.' అని రతన్ టాటా ట్వీట్ చేశారు.

ఏపీలో మరో 10 రూపాయల డాక్టర్-దసరా నుంచే..! ఎక్కడో తెలుసా

ఏపీలో ప్రస్తుతం ఏ చిన్న ఆస్పత్రికి వెళ్లినా ఔట్ పేషెంట్ (ఓపీ) సర్వీస్ కోసం కనీసం 500 సమర్పించుకోవాల్సిందే. ఆ తర్వాత పరీక్షలు, మందులు, సర్జరీలు కావాలంటే భారీ మొత్తం ఇచ్చుకోక తప్పదు. కానీ ఇంకా రాష్ట్రంలో పది రూపాయల డాక్టర్లు అక్కడక్కడా తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. అంతే కాదు ఇదే కోవలో మరికొందరు పది రూపాయల డాక్టర్లు కూడా తమ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పులివెందులలో 10 రూపాయల డాక్టర్ గానే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి వెళ్లి కడపలో ఇదే పది రూపాయల కాన్పెప్ట్ తో నూరీ పరీ అనే మహిళా డాక్టర్ కూడా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు చేస్తున్న డాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరో 10 రూపాయల డాక్టర్ సేవ చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ఎం. లక్ష్మీప్రియ తన సొంత గడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఈ దసరా నుంచే ఈ సత్ కార్యం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 8 వరకు డాక్టర్ లక్ష్మీప్రియ అందుబాటులో ఉండనున్నారు. నందిగామలో ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ లోని యాదవుల బావి దగ్గర ఉన్న లత క్లినిక్స్, C/O అజయ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో ఈ పది రూపాయల డాక్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ పోస్టుల పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులు

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

అసభ్యకరమైన, అసత్యమైన ఫేక్ పోస్టులు చేయడం ఆపకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాల పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హమీల అమలుపైన ఫొకస్ చేయాలని సూచన

ఇప్పటికైనా తీరు మార్చుకొని ఫేక్ పోస్టులు ఆపకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరిక

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వకాధ్యక్షులు కేటీఆర్ గారి పైన పదేపదే తప్పుడు పొస్టులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న అసహ్యకరమైన అడ్డగోలు, ఫేక్ పోస్టుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సలహా మేరకు నిజామాబాద్ జిల్లా కమిషనర్ కి పార్టీనేతలు పలు సామాజిక మాద్యమాల్లో ఉన్న పోస్టులపైన ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనూ సిసిఎస్ కేంద్ర కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్, తదితరులు స్థానిక ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు సిరిసిల్లలోనూ పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కేటీఆర్ గారి పైన పెట్టిన పలు పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. వరంగల్లోనూ పలు చోట్ల ఈ అసత్యమైన సోషల్ మీడియా పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. 

ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సోషల్ మీడియాలో ఇతర పార్టీలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు తన పార్టీ కార్యకర్తలు, పెయిడ్ ట్రోల్స్ తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిరంతరంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఈ దుష్ప్రచారాన్ని ఆపకుంటే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఈ ఈ నీచమైన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ తెరలెపిందన్నారు. ఇప్పటికైనా తమ బుద్ధి మార్చుకొని ఇతరులకు సుద్దులు చెబుతున్న తీరుగా, తమ సొంత పార్టీ సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచాలని ముఖ్యమంత్రికి సూచించారు.

జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.

2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.

అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.

చంద్ర‌బాబు ఉదార‌త‌.. స్వ‌గ్రామంలో అమ్మ‌వారి ఆల‌యానికి దారి చూపిన సీఎం

సీఎం చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఉదార‌త చాటారు. త‌న స్వ‌గ్రామంలోని అమ్మ‌వారి ఆల‌యానికి రాక‌పోక‌లు సాగించే భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా దారి చూపారు. ఏపీలోని తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లం కందుల‌వారిప‌ల్లె పంచాయ‌తీ నారావారిప‌ల్లెలోని నాగాల‌మ్మ ఆల‌యంలో గ్రామ‌స్థులు నిత్యం పూజ‌లు చేస్తుంటారు. 

ఇక ప్ర‌తియేటా సంక్రాంతి సంద‌ర్భంగా కుటుంబ‌స‌మేతంగా స్వ‌గ్రామానికి వెళ్లే చంద్ర‌బాబు కూడా అమ్మ‌వారికి పూజ‌లు చేయ‌డం ఆన‌వాయతీ. అయితే, ఈ ఆల‌యానికి వెళ్లేందుకు స‌రైన దారి లేదని స్థానికులు ఇటీవ‌ల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

దాంతో వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు తానే 90 సెంట్ల స్థ‌లాన్ని కొనుగోలు చేశారు.

ఆ స్థ‌లం గుండా రాక‌పోక‌ల‌కు దారిని ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చంద్ర‌బాబు ఉదార‌త‌ను కొనియాడుతున్నారు.

సెక్రటేరియట్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే లేని ఇబ్బంది.. పేదల ఇండ్లు ఉంటే ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్‌ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది తొలగిస్తారా అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌, సెక్రటేరియట్‌, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయి.

వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్‌ అయ్యారు. ఎవ్వరు అడ్డొచ్చిన మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్‌లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు.

సెక్రటేరియట్‌తో పాటు బాపు ఘాట్ ఇలా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్‌టీఎల్‌లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇండ్లు ఉంటే ఇబ్బంది ఏమిటని అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

ఆయన ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రిబుల్ తలాక్, సీఏఏ లాంటి చట్టాలు తెచ్చారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర, కశ్మీర్, హర్యానాలో ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు.

కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాల కోసం.. వేల మంది భారతీయుల క్యూ

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదని అందులో పేర్కొన్నారు.

ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సృష్టించి తన తాత ఆస్తులు కాజేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని రూ.121 కోట్ల విలువైన ఆస్తులు కాజేసేందుకు ఫ్లాన్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ మనవరాలు ప్రిన్సెస్‌ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు.

అయితే ఆ పత్రాలు, సాక్షులు నకిలీవి అని.. అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయటంతో పాటుగా.. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ముస్లిం పర్సనల్‌ చట్టం ప్రకారం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దుల్హాన్‌ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకొంటున్న వారికి చట్టప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టులను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్‌ ఉందని.. దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్రపన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా కేసు పోలీసులు నమోదుచేయకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా.. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.

కాగా, అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వ తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతోనే ఉండగా.. వాటిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్ ఝా బహదూర్ టర్కీలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన.. విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి దివాలా తీశారు. చివరి రోజుల్లో టర్కీలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడే కన్నుమూశారు.

రైల్వే నియామకాలపై కేంద్రం యూటర్న్-కీలక నిర్ణయాలు..!

2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ కింద ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల నియామకం కోసం యూపీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ఒకటి కాగా.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) రెండవది. అయితే 2019లో ఇంజనీరింగ్ పరీక్షను తొలగించి కేవలం సీఎస్ఈ రాస్తే సరిపోతుందని నిబంధనలు సవరించింది. కొత్త విధానంలో రెండు రిక్రూట్ మెంట్లు కూడా నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తోడు ఏడాదికి ఐఆర్ఎంస్ కింద 150 మందినే తీసుకోవాలన్న మరో నిర్ణయం ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. రైల్వేలో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విభాగాల్లో అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్లనే ఈ పోస్టులకు ప్రమోట్ చేయడం లేదా సబార్డినేట్ ర్యాంక్ అధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ వచ్చీ రాగానే వీటిపై దృష్టిసారించారు. పాత నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మళ్లీ యథావిథిగా రిక్రూట్ మెంట్లు జరగబోతున్నాయి. కేంద్రం యూటర్న్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ (75), మెకానికల్ ఇంజినీరింగ్ (40), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (50), సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ (40), స్టోర్స్ (20) కేటగిరీల కింద 225 పోస్టులను ఐఆర్‌ఎంఎస్ కింద భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ రిక్రూట్ మెంట్ కు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్రం టెలికాం శాఖ యూపీఎస్సీకి సమాచారం ఇచ్చింది.

ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు.

కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.

అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.