/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాల కోసం.. వేల మంది భారతీయుల క్యూ Raghu ram reddy
కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాల కోసం.. వేల మంది భారతీయుల క్యూ

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదని అందులో పేర్కొన్నారు.

ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సృష్టించి తన తాత ఆస్తులు కాజేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని రూ.121 కోట్ల విలువైన ఆస్తులు కాజేసేందుకు ఫ్లాన్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ మనవరాలు ప్రిన్సెస్‌ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు.

అయితే ఆ పత్రాలు, సాక్షులు నకిలీవి అని.. అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయటంతో పాటుగా.. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ముస్లిం పర్సనల్‌ చట్టం ప్రకారం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దుల్హాన్‌ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకొంటున్న వారికి చట్టప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టులను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్‌ ఉందని.. దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్రపన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా కేసు పోలీసులు నమోదుచేయకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా.. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.

కాగా, అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వ తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతోనే ఉండగా.. వాటిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్ ఝా బహదూర్ టర్కీలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన.. విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి దివాలా తీశారు. చివరి రోజుల్లో టర్కీలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడే కన్నుమూశారు.

రైల్వే నియామకాలపై కేంద్రం యూటర్న్-కీలక నిర్ణయాలు..!

2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ కింద ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల నియామకం కోసం యూపీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ఒకటి కాగా.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) రెండవది. అయితే 2019లో ఇంజనీరింగ్ పరీక్షను తొలగించి కేవలం సీఎస్ఈ రాస్తే సరిపోతుందని నిబంధనలు సవరించింది. కొత్త విధానంలో రెండు రిక్రూట్ మెంట్లు కూడా నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తోడు ఏడాదికి ఐఆర్ఎంస్ కింద 150 మందినే తీసుకోవాలన్న మరో నిర్ణయం ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. రైల్వేలో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విభాగాల్లో అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్లనే ఈ పోస్టులకు ప్రమోట్ చేయడం లేదా సబార్డినేట్ ర్యాంక్ అధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ వచ్చీ రాగానే వీటిపై దృష్టిసారించారు. పాత నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మళ్లీ యథావిథిగా రిక్రూట్ మెంట్లు జరగబోతున్నాయి. కేంద్రం యూటర్న్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ (75), మెకానికల్ ఇంజినీరింగ్ (40), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (50), సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ (40), స్టోర్స్ (20) కేటగిరీల కింద 225 పోస్టులను ఐఆర్‌ఎంఎస్ కింద భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ రిక్రూట్ మెంట్ కు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్రం టెలికాం శాఖ యూపీఎస్సీకి సమాచారం ఇచ్చింది.

ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు.

కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.

అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు. 

ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇబ్బందుల్లో ఉంద‌ని పేర్కొన్నారు. 

"న‌టుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది" అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు. 

ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా... దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే.

రేపే తిరుమలలో గరుడ సేవ: 2 లక్షల మందికి పైగా భక్తులు: పార్కింగ్ స్థలాలు ఇవే: టీటీడీ నిర్ణయాలు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమ‌లలో శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు బకాసుర వధ అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవితో కలిసి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు.

బ్రహ్మోత్సవాల్లో కీలకమైనది గరుడ సేవ. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల గరుడ వాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీమలయప్ప స్వామివారు. ఈ వైభవాన్ని తిలకించడానికి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారి ⁠దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గరుడ సేవ దర్శనం కోసం గ్యాలరీలతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఆయా పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను ఈ రాత్రి 9 గంట‌ల నుంచి అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రద్దు చేశారు. తిరుమలలో వాహనాల రద్దీని నివారించడంలో భాగంగా ప్రజారవాణాను వినియోగించుకోవాలి.

దాదాపు మూడు లక్షల మంది భక్తులను తరలించేలా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడువేల ట్రిప్పులను నడిపించనున్నారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందిస్తారు. తిరుమలలోని బాలాజీ నగర్, కౌస్తుభం ఎదురుగా, రామ్‌బగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయకనగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిపల్‌ పార్కు, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కార్లు, బస్సులను పార్క్ చేయవచ్చు.గరుడ సేవ నాడు తిరుమలకు వచ్చే భక్తులకు వైద్య సేవలను అందించడానికి మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. 12 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గరుడసేవను తిలకించడానికి మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రామ్ బగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.గరుడ సేవను పర్యవేక్షించడానికి 1,250 మంది టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది, 5,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, క్యూలైన్లు సహా భక్తులు వేచివున్న ప్రతి చోటా అల్పాహారం, మంచినీరు, పాలు అందిస్తారు.

గ్రేటర్ ఎన్నికల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం - నాలుగు ముక్కలు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని విస్తరించనుంది. నాలుగు ముక్కలుగా మారనుంది. ఔటర్‌ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్‌ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేయాలని భావిస్తోంది. నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్‌ కాకుండా ఒకేసారి నాలుగు కార్పొరేషన్లుగా ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ లోపల ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు..30 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిని మొత్తంగా నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసర త్తు ప్రారంభించింది. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. సుమారు 51 గ్రామపంచాయతీలను విలీనం చేసినట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉండటంతో ఈ లోపే గ్రేటర్‌ హైదరాబాద్‌ను నాలుగు భాగాలుగా మార్చాలని భావిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, నలుగురు మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది. తాజా ఆలోచన మేరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌, శంషాబాద్‌ పేర్లతో నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కి.మీలు ఉండగా, ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడంవల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కి.మీ మేర అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన డివిజన్లు చేసి, 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నీంటినీ ఒక్కటిగా మార్చ డం ద్వారా ఓఆర్‌ఆర్‌ లోపల నివాసముండే జనాభా ఒకేసారి 1.80 లక్షల నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా నాలుగో నగరంగా శంషాబాద్‌ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే

రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024- 26 ఏడాదికి సంబంధించి 139 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని కడప జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణ అధికారి రవికుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 139 దుకాణాలకు 110 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆసక్తి ఉన్న టెండరుదారులు దరఖాస్తులను వారి ఇంటి వద్దనే కూర్చుని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.గతంలో వలే దరఖాస్తులను భర్తీ చేసి గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ సెంటర్కు వెళ్లినా కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. రెండు లక్షల రూపాయలు చలానాలు చెల్లించి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. టెండర్ దారులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. పదవ తేదీన కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని చెప్పారు. సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే చివరి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం చర్చ అంతా మద్యం దుకాణాలపైనే జరుగుతోంది. జిల్లాలో ఈ సారి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బినామీ పేర్లతో వాటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నేతలు ముందుకు వెళ్తున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు ముఖ్యనేతలు, వారి బంధువులు, అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.100కు పైగా దరఖాస్తులు:పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుపై తెరవెనుక మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసేవారు కూడా శుక్రవారం ఆబ్కారీ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో శుక్రవారం 100కుపైగా దరఖాస్తులు అధికారులు చెబుతున్నారు.

భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో దుకాణానికి 12 మంది చొప్పున టెండరు దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో పోటీ నెలకొనడంతో అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మేమెంత చెబితే అంతంటూ కొంతమంది బడా బాబులు తయారై బేరసారాలకు తెర లేపుతున్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రభుత్వానికి చెల్లించే నగదుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణానికి 8 నుంచి 25 లక్షల రూపాయలను పెద్దలకు చెల్లించాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయించిన ప్రభుత్వం, రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు.

ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా... తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు. 

నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పును వెలువరించిందని...

అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని... అయినా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దైవ భక్తి ఉండాలని అన్నారు

రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె క‌న్నుమూత … చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంతాపం

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ సిఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు.

రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి (38) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ”సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు సంతాపం తెలియజేశారు

రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.