/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే Raghu ram reddy
మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే

రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024- 26 ఏడాదికి సంబంధించి 139 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని కడప జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణ అధికారి రవికుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 139 దుకాణాలకు 110 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆసక్తి ఉన్న టెండరుదారులు దరఖాస్తులను వారి ఇంటి వద్దనే కూర్చుని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.గతంలో వలే దరఖాస్తులను భర్తీ చేసి గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ సెంటర్కు వెళ్లినా కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. రెండు లక్షల రూపాయలు చలానాలు చెల్లించి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. టెండర్ దారులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. పదవ తేదీన కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని చెప్పారు. సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే చివరి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం చర్చ అంతా మద్యం దుకాణాలపైనే జరుగుతోంది. జిల్లాలో ఈ సారి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బినామీ పేర్లతో వాటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నేతలు ముందుకు వెళ్తున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు ముఖ్యనేతలు, వారి బంధువులు, అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.100కు పైగా దరఖాస్తులు:పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుపై తెరవెనుక మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసేవారు కూడా శుక్రవారం ఆబ్కారీ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో శుక్రవారం 100కుపైగా దరఖాస్తులు అధికారులు చెబుతున్నారు.

భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో దుకాణానికి 12 మంది చొప్పున టెండరు దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో పోటీ నెలకొనడంతో అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మేమెంత చెబితే అంతంటూ కొంతమంది బడా బాబులు తయారై బేరసారాలకు తెర లేపుతున్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రభుత్వానికి చెల్లించే నగదుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణానికి 8 నుంచి 25 లక్షల రూపాయలను పెద్దలకు చెల్లించాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయించిన ప్రభుత్వం, రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు.

ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా... తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు. 

నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పును వెలువరించిందని...

అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని... అయినా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దైవ భక్తి ఉండాలని అన్నారు

రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె క‌న్నుమూత … చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంతాపం

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ సిఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు.

రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి (38) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ”సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు సంతాపం తెలియజేశారు

రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

చిన్నప్పుడే ఎంజీఆర్‌ను కలిశా

సనాతన ధర్మ పరిరక్షణపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే యువజన విభాగం అధినేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చిందాయనకు.

గతంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియా తరహాలోనే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఓ సమావేశంలో బహిరంగంగా విమర్శలు చేశారు. అప్పట్లో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అవే వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ప్రస్తావించారు. ఎక్కడా ఉదయనిధి స్టాలిన్‌ పేరు ఎత్తకుండా విమర్శలు గుప్పించారు. ఫలితంగా డీఎంకే నుంచి ఎదురుదాడిని ఎదుర్కొనాల్సి వచ్చింది పవన్ కల్యాణ్‌కు. దీనిపై ఉదయనిధి సైతం స్పందించారు.

ఈ పరిస్థితుల మధ్య డీఎంకే రాజకీయ ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకేకు మద్దతుగా ఓ ట్వీట్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమౌతోంది. తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టారు. ఈ నెల 17వ తేదీన 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్న ఏఐఏడీఎంకేకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్‌పై ఆసియా వీక్ ప్రచురించిన కవర్ పేజీ ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు పవన్ కల్యాణ్. పురచ్చి తలైవాగా అభివర్ణించారు. తన బాల్యం చెన్నైలో గడిచిందని, అప్పట్లో ఎంజీఆర్ నుంచి స్ఫూర్తి పొందానని వ్యాఖ్యానించారు.

చెన్నై మైలాపూర్‌లో చదువుకుంటోన్నప్పుడు తమిళ ఉపాధ్యాయుడి ద్వారా ఎంజీఆర్‌ను కలిశానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తిరుక్కరల్ నుంచి తీసుకున్న వాక్యాలను ట్వీట్‌లో పొందుపరిచారు. పరోపకారం, క్షమాగుణం, నిష్కల్మషం, ప్రజల పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లే రాజులా వెలుగొందుతారనే అర్థం వచ్చే వాక్యాలవి.

సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరిక

 డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ

 రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నా

 హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తదితరులు..

బీఆర్ఎస్ పార్టీ కొంత ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. రైతుల తరపున కేటీఆర్ ధర్నా చెయ్యడం అనేది ప్రతిపక్షానికి మంచి అంశం అంటున్నారు. మరి కేటీఆర్ ఏమన్నారో తెలుసుకుందాం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. 2 లక్షల రుణం తీసుకోమని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నాకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 

రైతుల ధర్నా కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. 10 నెలలైనా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.

సెక్రటేరియట్‌కి లంకె బిందెల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి.. దొంగ లాగా తయారయ్యారని కేటీఆర్ సెటైర్ వేశారు. కనిపించిన దేవుడికల్లా ఓటు వేస్తారు గానీ.. రుణమాఫీ మాత్రం అమలు చెయ్యట్లేదు. ఆయనకి చిట్టి నాయుడు అనే పేరు సరైనది అని సెటైర్ వేసిన కేటీఆర్.. ప్రజలు రాజకీయ నేతల చేతిలో మోసపోతూనే ఉంటారని రేవంత్ రెడ్డి ఓ వీడియోలో చెప్పారన్న కేటీఆర్.. ప్రజలు నిజంగానే మోసపోయారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడన్న కేటీఆర్… డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారనీ… ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. “సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లను కూడా కూల్చుతామన్నారు. అసలు సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు చిట్టినాయుడు” అని కామెంట్స్ చేశారు కేటీఆర్.. కేపి

హర్యానాలో మొదలైన పోలింగ్.. 90 అసెంబ్లీ స్థానాలు, 1,031 మంది అభ్యర్థుల్లో గెలుపెవరిదో?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గత పదేళ్లుగా బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ ముందు పెద్ద సవాలే ఉంది.

ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీ రాజకీయాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపాటు

కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు. “రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?.. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?..

అవ్వ, తాతలకు నెలకు రూ.4 వేలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్ష 50 వేల కోట్ల లూటిఫికేషన్‌కు తెరతీసిన ఘనుడు ఎవరు? ” అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి.

రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది.. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం.. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకుబతుకమ్మ చీరలను ఇవ్వలేదు. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా. అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

జగన్‌ రాజకీయం!

విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.

విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది. గత ప్రభుత్వం ఎయిడెడ్, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రత్నప్రభ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది.

ఆ కమిటీ సూచనలతో, కొందరు అధికారుల సలహాలతో హడావుడిగా అనాలోచిత నిర్ణయం తీసేసుకొని ఎయిడెడ్‌లో పనిచేసే సిబ్బందిని రాత్రికి రాత్రే తక్షణం ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దాని పర్యవసానాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కళాశాలల్లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు, అలాగే విద్యాసంస్థల కార్యాలయాలలో పరిపాలనను నిర్వహించే అధ్యాపకేతర సిబ్బందిలో ప్రమోషన్ల కొరకు పోట్లాడుకొనే పరిస్థితి వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మంచి విద్యాబోధన కల్పించి, వారు ముందుకు సాగేలా చూడాల్సిన ఉన్నత విద్యారంగ సిబ్బంది, విద్యాసంస్థల్లో రాజకీయ వాతావరణాన్ని కల్పించి ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే పన్నాగాలకు నాంది పలికారు.

వాస్తవానికి ఎయిడెడ్ సిబ్బందికి గతంలో కూడా వేతనాలు ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తున్నా వారిమీద నియంత్రణ ప్రభుత్వం చేతిలో గాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. దీనిని అవకాశంగా తీసుకొన్న కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఉద్యోగాలను అమ్ముకోవడం, తమ సంస్థల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఎక్కువ చూపి, వారికి వచ్చే ఉపకార వేతనాలు తమ స్వంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం, దాతల ద్వారా వచ్చిన ఆస్తులను కమిటీల పేరుతో అమ్మేసుకోవడం వంటివి జరిగేవి.

వీటన్నింటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే స్వస్తి చెప్పే విధానానికి శ్రీకారం చుట్టి, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలను ఒక గాడిన పెట్టగలిగారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి, వివిధ రకాలుగా విద్యాసంస్థల యాజమాన్యాన్ని భయపెట్టి, అందులో పనిచేసే సిబ్బందిని ఉన్నపళంగా ప్రభుత్వంలో విలీనం చేసి వారిని త్రిశంకుస్వర్గంలో నెట్టివేసింది. ఇప్పుడు కొంతమంది వారి అనుకూల సంఘాలలోని సిబ్బందితో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దుపరచి, ఎయిడెడ్ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకురావాలని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ సర్వీస్‌లోని ఎయిడెడ్ సిబ్బందిని వెనుకకు పంపాలంటే అనేక కోర్టు కేసులు, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. గత ప్రభుత్వం ఎయిడెడ్‌లో రద్దు చేసిన సుమారు 2000 ఉద్యోగులను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఎయిడెడ్‌కు కేటాయించినా, అక్కడ వారికి విద్యార్థులు లేక ఎటువంటి బోధనాపని లేకున్నా, వారిని కూర్చోబెట్టి వేతనాలను చెల్లించాలి. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇరుకున పెట్టడమే. ఉన్నత విద్యా కార్యాలయం, కాలేజియేట్ కమిషనర్ కార్యాలయంలోని అధికారులు... ఇంకా గత వైసీపీ ప్రభుత్వానికి మేలు కలిగేలా చేసిన కొంతమంది ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే సిబ్బందిని రెచ్చగొట్టి, ఆందోళనలకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే విద్యారంగాన్ని గాడిని పెడుతున్నా, కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాలు దీనికి మేలు కన్నా కీడు చేసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో జరుగుతున్న పరిణామాల పట్ల నిఘా వుంచి, బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన, చక్కటి విద్యను ప్రభుత్వం అందించాలి.

కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

కెనడాలో ఉంటున్న ఓ భారతీయుడిని ఇంటి ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాల షాకైపోతున్నారు.

సాధారణంగా అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లు చెప్పిన టైంకు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో ఒకటో రెండో రోజుల సమయం తీసుకుని ఆ తరువాత ఖాళీ చేస్తారు. అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో వివాదాలు తలెత్తుతుంటాయి. కెనడాలో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయుడిని ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు షాకైపోతున్నారు

బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో చెప్పిన దాని ప్రకారం, ఆ ఎన్నారైని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా అతడు వినలేదట. అతడు ఖాళీ చేస్తాడంటూ కొంతకాలం పాటు ఎదురు చూసిన ఓనర్ విసిగిపోయాడట. చివరకు తానే మనుషులను పెట్టి సామాన్లన్నీ బయటకు బలవంతంగా తీసుకొచ్చేశాట. మరోవైపు, ఓనర్ అలా చేస్తుంటే ఎన్నారై బయట నిలబడి అతడితో గొడవపడటం కూడా వీడియోలో రికార్డైంది.

ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సన్నివేశం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏమై ఉంటుందో అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు ఎవరో ఒకరిపై నెట్టడం సబబు కాదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. పరిస్థితి చివరకు సద్దుమణిగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలిపాడు. అద్దె ఇళ్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు రాకూడదని అభిప్రాయపడ్డారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏ ఎన్నారైకీ ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.

మరికొందరు మాత్రం ఈ ఉదంతంపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫ్రీగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి పని చేసి వెళ్లిపోయినట్టు ఉంది. ఇందులో ఆ ఎన్నారై ఇబ్బంది పడాల్సిందేమీ లేదు’’ అంటూ తుంటరి వ్యాఖ్యలు చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతుండటంతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. విదేశీయుల రాక అధికమవడంతో పరిస్థితి దిగజారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, తమపై నిందలు మోపడం సబబు కాదని అక్కడుంటున్న విదేశీయులు వాపోతున్నారు. ఇళ్ల ధరలూ తమకూ భారంగా మారాయని చెబుతున్నారు.

అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం విదేశీయులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల్లో అధికశాతం మంది భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇక కెనడాలో తాత్కాలిక ప్రాతిపాదికన నివసిస్తున్న వారి వాటా జనాభాలో 6.5 శాతంగా ఉందని, దీన్ని 5 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

కొండా సురేఖ రాజీనామా - హైకమాండ్ ఆదేశం..!

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ హీరో నాగార్జున కుటుంబం పైన మంత్రి చేసిన వ్యాఖ్యల పైన సినీ పరిశ్రమ భగ్గుమంది. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబం రాహుల్ గాంధీ జోక్యం కోరింది. ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. సురేఖ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. ఫలితంగా సురేఖను తప్పించకుండా..తనంతట తానే రాజీనామా చేయాల్సిందిగా సూచించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖకు పదవీ గండం ఏర్పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల పైన సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోనూ ఈ వ్యాఖ్యలు రచ్చగా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యల పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదే సమయంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. అటు నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేసారు. నోటీసులు పంపారు. ఇక..కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ పరిశ్రమ మాత్రం చర్యలకు డిమాండ్ చేస్తోంది.

పార్టీ హైకమాండ్ మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయించాలని టీపీసీసీకి సూచించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పదవి నుంచి తెలిగించకుండా.. సురేఖ తనంతటగా తానే రాజీనామా చేసేలా ఒప్పించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించినా.. పార్టీ నాయకత్వం మంత్రి సురేఖ పై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో, సురేఖ తో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.