/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరిక Raghu ram reddy
సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరిక

 డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ

 రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నా

 హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తదితరులు..

బీఆర్ఎస్ పార్టీ కొంత ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. రైతుల తరపున కేటీఆర్ ధర్నా చెయ్యడం అనేది ప్రతిపక్షానికి మంచి అంశం అంటున్నారు. మరి కేటీఆర్ ఏమన్నారో తెలుసుకుందాం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. 2 లక్షల రుణం తీసుకోమని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నాకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 

రైతుల ధర్నా కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. 10 నెలలైనా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.

సెక్రటేరియట్‌కి లంకె బిందెల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి.. దొంగ లాగా తయారయ్యారని కేటీఆర్ సెటైర్ వేశారు. కనిపించిన దేవుడికల్లా ఓటు వేస్తారు గానీ.. రుణమాఫీ మాత్రం అమలు చెయ్యట్లేదు. ఆయనకి చిట్టి నాయుడు అనే పేరు సరైనది అని సెటైర్ వేసిన కేటీఆర్.. ప్రజలు రాజకీయ నేతల చేతిలో మోసపోతూనే ఉంటారని రేవంత్ రెడ్డి ఓ వీడియోలో చెప్పారన్న కేటీఆర్.. ప్రజలు నిజంగానే మోసపోయారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడన్న కేటీఆర్… డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారనీ… ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. “సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లను కూడా కూల్చుతామన్నారు. అసలు సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు చిట్టినాయుడు” అని కామెంట్స్ చేశారు కేటీఆర్.. కేపి

హర్యానాలో మొదలైన పోలింగ్.. 90 అసెంబ్లీ స్థానాలు, 1,031 మంది అభ్యర్థుల్లో గెలుపెవరిదో?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గత పదేళ్లుగా బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ ముందు పెద్ద సవాలే ఉంది.

ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీ రాజకీయాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపాటు

కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు. “రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?.. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?..

అవ్వ, తాతలకు నెలకు రూ.4 వేలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్ష 50 వేల కోట్ల లూటిఫికేషన్‌కు తెరతీసిన ఘనుడు ఎవరు? ” అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి.

రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది.. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం.. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకుబతుకమ్మ చీరలను ఇవ్వలేదు. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా. అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

జగన్‌ రాజకీయం!

విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.

విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది. గత ప్రభుత్వం ఎయిడెడ్, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రత్నప్రభ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది.

ఆ కమిటీ సూచనలతో, కొందరు అధికారుల సలహాలతో హడావుడిగా అనాలోచిత నిర్ణయం తీసేసుకొని ఎయిడెడ్‌లో పనిచేసే సిబ్బందిని రాత్రికి రాత్రే తక్షణం ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దాని పర్యవసానాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కళాశాలల్లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు, అలాగే విద్యాసంస్థల కార్యాలయాలలో పరిపాలనను నిర్వహించే అధ్యాపకేతర సిబ్బందిలో ప్రమోషన్ల కొరకు పోట్లాడుకొనే పరిస్థితి వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మంచి విద్యాబోధన కల్పించి, వారు ముందుకు సాగేలా చూడాల్సిన ఉన్నత విద్యారంగ సిబ్బంది, విద్యాసంస్థల్లో రాజకీయ వాతావరణాన్ని కల్పించి ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే పన్నాగాలకు నాంది పలికారు.

వాస్తవానికి ఎయిడెడ్ సిబ్బందికి గతంలో కూడా వేతనాలు ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తున్నా వారిమీద నియంత్రణ ప్రభుత్వం చేతిలో గాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. దీనిని అవకాశంగా తీసుకొన్న కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఉద్యోగాలను అమ్ముకోవడం, తమ సంస్థల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఎక్కువ చూపి, వారికి వచ్చే ఉపకార వేతనాలు తమ స్వంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం, దాతల ద్వారా వచ్చిన ఆస్తులను కమిటీల పేరుతో అమ్మేసుకోవడం వంటివి జరిగేవి.

వీటన్నింటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే స్వస్తి చెప్పే విధానానికి శ్రీకారం చుట్టి, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలను ఒక గాడిన పెట్టగలిగారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి, వివిధ రకాలుగా విద్యాసంస్థల యాజమాన్యాన్ని భయపెట్టి, అందులో పనిచేసే సిబ్బందిని ఉన్నపళంగా ప్రభుత్వంలో విలీనం చేసి వారిని త్రిశంకుస్వర్గంలో నెట్టివేసింది. ఇప్పుడు కొంతమంది వారి అనుకూల సంఘాలలోని సిబ్బందితో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దుపరచి, ఎయిడెడ్ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకురావాలని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ సర్వీస్‌లోని ఎయిడెడ్ సిబ్బందిని వెనుకకు పంపాలంటే అనేక కోర్టు కేసులు, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. గత ప్రభుత్వం ఎయిడెడ్‌లో రద్దు చేసిన సుమారు 2000 ఉద్యోగులను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఎయిడెడ్‌కు కేటాయించినా, అక్కడ వారికి విద్యార్థులు లేక ఎటువంటి బోధనాపని లేకున్నా, వారిని కూర్చోబెట్టి వేతనాలను చెల్లించాలి. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇరుకున పెట్టడమే. ఉన్నత విద్యా కార్యాలయం, కాలేజియేట్ కమిషనర్ కార్యాలయంలోని అధికారులు... ఇంకా గత వైసీపీ ప్రభుత్వానికి మేలు కలిగేలా చేసిన కొంతమంది ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే సిబ్బందిని రెచ్చగొట్టి, ఆందోళనలకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే విద్యారంగాన్ని గాడిని పెడుతున్నా, కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాలు దీనికి మేలు కన్నా కీడు చేసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో జరుగుతున్న పరిణామాల పట్ల నిఘా వుంచి, బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన, చక్కటి విద్యను ప్రభుత్వం అందించాలి.

కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

కెనడాలో ఉంటున్న ఓ భారతీయుడిని ఇంటి ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాల షాకైపోతున్నారు.

సాధారణంగా అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లు చెప్పిన టైంకు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో ఒకటో రెండో రోజుల సమయం తీసుకుని ఆ తరువాత ఖాళీ చేస్తారు. అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో వివాదాలు తలెత్తుతుంటాయి. కెనడాలో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయుడిని ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు షాకైపోతున్నారు

బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో చెప్పిన దాని ప్రకారం, ఆ ఎన్నారైని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా అతడు వినలేదట. అతడు ఖాళీ చేస్తాడంటూ కొంతకాలం పాటు ఎదురు చూసిన ఓనర్ విసిగిపోయాడట. చివరకు తానే మనుషులను పెట్టి సామాన్లన్నీ బయటకు బలవంతంగా తీసుకొచ్చేశాట. మరోవైపు, ఓనర్ అలా చేస్తుంటే ఎన్నారై బయట నిలబడి అతడితో గొడవపడటం కూడా వీడియోలో రికార్డైంది.

ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సన్నివేశం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏమై ఉంటుందో అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు ఎవరో ఒకరిపై నెట్టడం సబబు కాదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. పరిస్థితి చివరకు సద్దుమణిగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలిపాడు. అద్దె ఇళ్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు రాకూడదని అభిప్రాయపడ్డారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏ ఎన్నారైకీ ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.

మరికొందరు మాత్రం ఈ ఉదంతంపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫ్రీగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి పని చేసి వెళ్లిపోయినట్టు ఉంది. ఇందులో ఆ ఎన్నారై ఇబ్బంది పడాల్సిందేమీ లేదు’’ అంటూ తుంటరి వ్యాఖ్యలు చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతుండటంతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. విదేశీయుల రాక అధికమవడంతో పరిస్థితి దిగజారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, తమపై నిందలు మోపడం సబబు కాదని అక్కడుంటున్న విదేశీయులు వాపోతున్నారు. ఇళ్ల ధరలూ తమకూ భారంగా మారాయని చెబుతున్నారు.

అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం విదేశీయులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల్లో అధికశాతం మంది భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇక కెనడాలో తాత్కాలిక ప్రాతిపాదికన నివసిస్తున్న వారి వాటా జనాభాలో 6.5 శాతంగా ఉందని, దీన్ని 5 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

కొండా సురేఖ రాజీనామా - హైకమాండ్ ఆదేశం..!

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ హీరో నాగార్జున కుటుంబం పైన మంత్రి చేసిన వ్యాఖ్యల పైన సినీ పరిశ్రమ భగ్గుమంది. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబం రాహుల్ గాంధీ జోక్యం కోరింది. ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. సురేఖ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. ఫలితంగా సురేఖను తప్పించకుండా..తనంతట తానే రాజీనామా చేయాల్సిందిగా సూచించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖకు పదవీ గండం ఏర్పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల పైన సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోనూ ఈ వ్యాఖ్యలు రచ్చగా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యల పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదే సమయంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. అటు నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేసారు. నోటీసులు పంపారు. ఇక..కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ పరిశ్రమ మాత్రం చర్యలకు డిమాండ్ చేస్తోంది.

పార్టీ హైకమాండ్ మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయించాలని టీపీసీసీకి సూచించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పదవి నుంచి తెలిగించకుండా.. సురేఖ తనంతటగా తానే రాజీనామా చేసేలా ఒప్పించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించినా.. పార్టీ నాయకత్వం మంత్రి సురేఖ పై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో, సురేఖ తో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ధరణి పోర్టల్ రద్దు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పూర్తయిన ఇళ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. వెంటనే మరమ్మతులు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

అక్టోబర్ 7తో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుందని.. అయితే, ఈ పది నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామన్నారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ రైతులందరికీ త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు.

మరోవైపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం అనుకున్నంత వేగంగ పుంజుకోవడం లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే, పురపాలక, రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించారు. గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తియిందని, వాటిలో ఆమోదించినవి 70 వేలలోపే ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్‌పై.. భాస్కర్ రెడ్డి రెగ్యులర్ బెయిల్‌పై ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.

మరోవైపు భాస్కర్ రెడ్డికి కూడా దర్యాప్తు అధికారుల అనుమతి లేకుండా ఏపీలో అడుగుపెట్టవద్దని బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ షరతులను సడలించాలంటూ వారు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సీబీఐకు నోటీసులు అందించడంతో కౌంటర్ దాఖలు చేస్తామని గత విచారణలో పేర్కొంది. దీంతో శుక్రవారం విచారణలో భాగంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.

లడ్డు కల్తీ తేల్చేది ఆ ఐదుగురే.. సుప్రీం కోర్టు సంచన నిర్ణయం ఎఫెక్ట్..

సుప్రీం కోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. అసలు ప్రస్తుతం ఆరోపిస్తున్నట్లుగా తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారాన్ని బయటపెట్టేందుకు న్యాయమూర్తుల బెంచ్ స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుకు ఆదేశించింది. ఇది ఎటువంటి వివాదం లేకుండా నిజాలను బయటకు తెచ్చే అవకాశం కల్పిస్తుంది.

సుప్రీం కోర్టు ఆదేశించిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంలో సీబీఐకి చెందిన ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారులతో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి ఉంటారు. దీనికి ముందు ఏపీ ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టేందుకు సిట్ వేసింది. దీనిపై ప్రతిపక్షాలు విశ్వాసం లేదని ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు సైతం ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నట్లు తీర్పును చూస్తే తెలుస్తోంది. దీనికి ముందు ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఓటీవీ ఎడిటర్‌, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ విషయంపై స్పందిస్తూ సుప్రీం కోర్టు కేసును రాజకీయ సాధనంగా ఉపయోగించకుండా నిరోధించాలనే ఉద్దేశాన్ని నొక్కి చెప్పింది. అలాగే "కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించడాన్ని మేము అనుమతించము" ఇది తమకు ఇష్టం లేదని, పొలిటికల్ డ్రామాగా మారిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.

దర్యాప్తుకు ఏర్పాటు చేయనున్న సిట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారికి కూడా చోటు కల్పించటంతో గతంలో వినియోగించిన నెయ్యిలో కల్తీలు జరిగాయా లేదా అనే విషయం బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇప్పటి వరకూ సేకరించిన దర్యాప్తు వివరాలను.. సుప్రీం కోర్టు ఏర్పాటు చేయమన్న స్వతంత్ర బృందం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే విషయాలు వేచి చూడాల్సిందే. అయితే స్వతంత్ర కమిటీలో ఎవరు ఉంటారనే నిర్ణయాన్ని సీబీఐ డైరెక్టర్‌, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి డీజీపీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి ఆ సంస్థ ఛైర్మన్‌ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధర్మాసనం కల్పించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల..!

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు వారికి క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీంతో కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. వీరికి నిన్న సంఘిభావం ప్రకటించిన ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపును అడ్డుకోకపోతే అక్కడే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నుంచి ఇవాళ ఓ ప్రకటన వచ్చింది.

స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ షర్మిక ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై స్టీల్ ప్లాంట్ వెనక్కి తగ్గడాన్ని ఆమె స్వాగతించారు.

ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. దీక్షకు దిగుతానని తాను చేసిన హెచ్చరికల వల్లే స్టీల్ ప్లాంట్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల ఓ మాట కూడా ఇచ్చారు.

తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి , యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీ పక్షమని, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులకు ఆమె తెలిపారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని, ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామన్నారు.

మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని వారికి పిలుపునిచ్చారు.