/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు! Raghu ram reddy
కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

కెనడాలో ఉంటున్న ఓ భారతీయుడిని ఇంటి ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాల షాకైపోతున్నారు.

సాధారణంగా అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లు చెప్పిన టైంకు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో ఒకటో రెండో రోజుల సమయం తీసుకుని ఆ తరువాత ఖాళీ చేస్తారు. అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో వివాదాలు తలెత్తుతుంటాయి. కెనడాలో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయుడిని ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు షాకైపోతున్నారు

బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో చెప్పిన దాని ప్రకారం, ఆ ఎన్నారైని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా అతడు వినలేదట. అతడు ఖాళీ చేస్తాడంటూ కొంతకాలం పాటు ఎదురు చూసిన ఓనర్ విసిగిపోయాడట. చివరకు తానే మనుషులను పెట్టి సామాన్లన్నీ బయటకు బలవంతంగా తీసుకొచ్చేశాట. మరోవైపు, ఓనర్ అలా చేస్తుంటే ఎన్నారై బయట నిలబడి అతడితో గొడవపడటం కూడా వీడియోలో రికార్డైంది.

ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సన్నివేశం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏమై ఉంటుందో అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు ఎవరో ఒకరిపై నెట్టడం సబబు కాదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. పరిస్థితి చివరకు సద్దుమణిగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలిపాడు. అద్దె ఇళ్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు రాకూడదని అభిప్రాయపడ్డారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏ ఎన్నారైకీ ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.

మరికొందరు మాత్రం ఈ ఉదంతంపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫ్రీగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి పని చేసి వెళ్లిపోయినట్టు ఉంది. ఇందులో ఆ ఎన్నారై ఇబ్బంది పడాల్సిందేమీ లేదు’’ అంటూ తుంటరి వ్యాఖ్యలు చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతుండటంతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. విదేశీయుల రాక అధికమవడంతో పరిస్థితి దిగజారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, తమపై నిందలు మోపడం సబబు కాదని అక్కడుంటున్న విదేశీయులు వాపోతున్నారు. ఇళ్ల ధరలూ తమకూ భారంగా మారాయని చెబుతున్నారు.

అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం విదేశీయులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల్లో అధికశాతం మంది భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇక కెనడాలో తాత్కాలిక ప్రాతిపాదికన నివసిస్తున్న వారి వాటా జనాభాలో 6.5 శాతంగా ఉందని, దీన్ని 5 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

కొండా సురేఖ రాజీనామా - హైకమాండ్ ఆదేశం..!

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ హీరో నాగార్జున కుటుంబం పైన మంత్రి చేసిన వ్యాఖ్యల పైన సినీ పరిశ్రమ భగ్గుమంది. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబం రాహుల్ గాంధీ జోక్యం కోరింది. ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. సురేఖ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. ఫలితంగా సురేఖను తప్పించకుండా..తనంతట తానే రాజీనామా చేయాల్సిందిగా సూచించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖకు పదవీ గండం ఏర్పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల పైన సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోనూ ఈ వ్యాఖ్యలు రచ్చగా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యల పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదే సమయంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. అటు నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేసారు. నోటీసులు పంపారు. ఇక..కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ పరిశ్రమ మాత్రం చర్యలకు డిమాండ్ చేస్తోంది.

పార్టీ హైకమాండ్ మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయించాలని టీపీసీసీకి సూచించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పదవి నుంచి తెలిగించకుండా.. సురేఖ తనంతటగా తానే రాజీనామా చేసేలా ఒప్పించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించినా.. పార్టీ నాయకత్వం మంత్రి సురేఖ పై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో, సురేఖ తో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ధరణి పోర్టల్ రద్దు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పూర్తయిన ఇళ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. వెంటనే మరమ్మతులు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

అక్టోబర్ 7తో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుందని.. అయితే, ఈ పది నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామన్నారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ రైతులందరికీ త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు.

మరోవైపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం అనుకున్నంత వేగంగ పుంజుకోవడం లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే, పురపాలక, రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించారు. గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తియిందని, వాటిలో ఆమోదించినవి 70 వేలలోపే ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్‌పై.. భాస్కర్ రెడ్డి రెగ్యులర్ బెయిల్‌పై ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.

మరోవైపు భాస్కర్ రెడ్డికి కూడా దర్యాప్తు అధికారుల అనుమతి లేకుండా ఏపీలో అడుగుపెట్టవద్దని బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ షరతులను సడలించాలంటూ వారు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సీబీఐకు నోటీసులు అందించడంతో కౌంటర్ దాఖలు చేస్తామని గత విచారణలో పేర్కొంది. దీంతో శుక్రవారం విచారణలో భాగంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.

లడ్డు కల్తీ తేల్చేది ఆ ఐదుగురే.. సుప్రీం కోర్టు సంచన నిర్ణయం ఎఫెక్ట్..

సుప్రీం కోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. అసలు ప్రస్తుతం ఆరోపిస్తున్నట్లుగా తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారాన్ని బయటపెట్టేందుకు న్యాయమూర్తుల బెంచ్ స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుకు ఆదేశించింది. ఇది ఎటువంటి వివాదం లేకుండా నిజాలను బయటకు తెచ్చే అవకాశం కల్పిస్తుంది.

సుప్రీం కోర్టు ఆదేశించిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంలో సీబీఐకి చెందిన ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారులతో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి ఉంటారు. దీనికి ముందు ఏపీ ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టేందుకు సిట్ వేసింది. దీనిపై ప్రతిపక్షాలు విశ్వాసం లేదని ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు సైతం ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నట్లు తీర్పును చూస్తే తెలుస్తోంది. దీనికి ముందు ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఓటీవీ ఎడిటర్‌, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ విషయంపై స్పందిస్తూ సుప్రీం కోర్టు కేసును రాజకీయ సాధనంగా ఉపయోగించకుండా నిరోధించాలనే ఉద్దేశాన్ని నొక్కి చెప్పింది. అలాగే "కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించడాన్ని మేము అనుమతించము" ఇది తమకు ఇష్టం లేదని, పొలిటికల్ డ్రామాగా మారిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.

దర్యాప్తుకు ఏర్పాటు చేయనున్న సిట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారికి కూడా చోటు కల్పించటంతో గతంలో వినియోగించిన నెయ్యిలో కల్తీలు జరిగాయా లేదా అనే విషయం బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇప్పటి వరకూ సేకరించిన దర్యాప్తు వివరాలను.. సుప్రీం కోర్టు ఏర్పాటు చేయమన్న స్వతంత్ర బృందం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే విషయాలు వేచి చూడాల్సిందే. అయితే స్వతంత్ర కమిటీలో ఎవరు ఉంటారనే నిర్ణయాన్ని సీబీఐ డైరెక్టర్‌, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి డీజీపీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి ఆ సంస్థ ఛైర్మన్‌ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధర్మాసనం కల్పించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల..!

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు వారికి క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీంతో కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. వీరికి నిన్న సంఘిభావం ప్రకటించిన ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపును అడ్డుకోకపోతే అక్కడే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నుంచి ఇవాళ ఓ ప్రకటన వచ్చింది.

స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ షర్మిక ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై స్టీల్ ప్లాంట్ వెనక్కి తగ్గడాన్ని ఆమె స్వాగతించారు.

ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. దీక్షకు దిగుతానని తాను చేసిన హెచ్చరికల వల్లే స్టీల్ ప్లాంట్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల ఓ మాట కూడా ఇచ్చారు.

తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి , యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీ పక్షమని, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులకు ఆమె తెలిపారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని, ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామన్నారు.

మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని వారికి పిలుపునిచ్చారు.

జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Choreographer Johnny Master) రంగారెడ్డి కోర్టులో (Ranga Reddy Court) కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో జానీ మాస్టర్‌ ఉన్నారు. బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో 6న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

కాగా.. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది.

దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కోరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు నిన్న (బుధవారం) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.

కొండా సురేఖ పై అధిష్టానం సీరియస్!

తెలంగాణ మంత్రి కొండ సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రముఖ హీరోయిన్ సమంత పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున నాగచైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని దీనికి సమంతా అంగీకరించకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇచ్చాడని మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖ రాజీనామాకు డిమాండ్

ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీరు పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపు తీసుకు వెళుతుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి సైతం కొండా సురేఖ యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండా సురేఖను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు.

దసరాకు ముందే మంత్రి వర్గ విస్తరణ

కొండ సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో కొండా సురేఖపట్ల ఒక్కసారిగా వ్యక్తం అవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరు పైన అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

కొండా సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన?

ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండ సురేఖ కు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది . మరోవైపున కొండ సురేఖ వ్యాఖ్యల పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది..

నేడు తిరుపతిలో వారాహి సభ.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆసక్తి..

నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది..

జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం..

వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉన్నాయి.. పవన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ ఏమి చేబుతారనే అందరిలోను ఆసక్తి రేపుతోంది..

ఇక, ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు హాజరవుతారని చెబుతున్నారు..

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు..!

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని.. వీటి ప్రభావంతో వానలు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, సిద్దిపేట, నాగర్ ‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని పలు చోట్లు భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతినగర్, ఎస్సాఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వాన పడింది.

మంగళవారం కామారెడ్డిలోని గాంధారిలో రాష్ట్రంలో అత్యధికంగా 9.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. సికింద్రాబాద్ పాటిగడ్డలో 4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లా అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వాన పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు తోపాటు అన్ని జలాశయాలు నిండిపోయాయి. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కీలకమైన రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేకంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో నిండు కుండలా మారాయి. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతోన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34.4 నమోదు కాగా.. కనిష్ఠంగా 23.7 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో తెలంగాణలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు అయింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ కూడా సాధారణం కన్నా ఎక్కవ వర్షపాతం పడినట్లు చెబుతున్నారు.