/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నాగార్జున కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు Mane Praveen
NLG: నాగార్జున కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.

కోటొక్క పూల పండుగ బతుకమ్మను ప్రతి యేటా జరుపుకునే తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు.. పిల్లాపాపలతో, పాడి పంటలతో క్షేమంగా ఉండాలని అకాంక్షిoచారు. ఈ సందర్బంగా నిర్వహించిన బతుకమ్మ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డా.వి. శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. గంజి భాగ్యలక్ష్మి, అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు డా. కిరీటం, డా. ప్రసన్న కుమార్, సుధాకర్, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలి: ఎంఈఓ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం యరగండ్ల పల్లి గ్రామంలో, పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెడు వ్యసనాలకు బానిస కావొద్దు అని విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలని, ఈరోజు శ్రమిస్తే రేపు భవిష్యత్ తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

2003 - 2004 పూర్వ విద్యార్థుల సహకారం తో NMMS స్కాలర్షిప్ కోసం విద్యార్థులు పోటీపడి టాలెంట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి.. పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.

విద్యార్థులు అవసరం కోసం
ఇక్కడ పాఠశాలలో పూర్వ విద్యార్థులుగా చదివి ఇప్పటి విద్యార్థుల కోసం బుక్స్ అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ అందించడం అభినందనీయమని పూర్వ విద్యార్థులు అయిన 2003-2004 బ్యాచ్ విద్యార్థులు పాఠశాలను గుర్తుంచుకొని విద్యార్థుల కోసం ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించడం అభినందనీయమని భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కోసం వారు మరింత తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలి: పాండురంగారావు
పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండు రంగారావు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థిగా నేను ఈ పాఠశాలలో చదువుకొని నా మిత్రుల సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం చేయూతనందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు విష సంస్కృతికి దూరంగా ఉండి లు కల్చర్ కు దూరంగా ఉండి బుక్ కల్చర్ను అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నమ్మకాలను వమ్ము చేయకుండా ఉండాలని, చెడు స్నేహాలను వీడి సమాజ మార్పు కోసం విద్యాభివృద్ధి దశలో జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బాబాసాహెబ్ అంబేద్కర్, దేశం కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని నవ సమాజ నిర్మాతలు గా, సమాజ మార్పు కోసం పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధి కోసం విద్యార్థి దశ నుండే మంచి ప్రయత్నం చేయాలని అన్నారు.

అర్ధ నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు యువతను పెడదోవ పట్టించే విధంగా సినిమా కల్చర్, ర్యాగింగ్.. రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటి అరికట్టడంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, మనలను మనమే రక్షించుకోవాలని అందుకోసం జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కోరారు.

విద్యార్థులకు జామెంట్రీ బాక్స్, NMMS  బుక్స్ అవసరమని చెప్పగానే తక్షణమే స్పందించి సహకారాన్ని అందించిన పూర్వ విద్యార్థులందరికీ పి ఆర్ ఆర్ ఫౌండేషన్ మరియు పాఠశాల విద్యార్థుల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో మా పూర్వ విద్యార్థులుగా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు. అనంతరం తన దగ్గర లేకున్నా పురోహితం చేసుకుంటూ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సాయంత్రం తన సొంత డబ్బులతో స్నాక్స్ ను అందిస్తున్న మంచన హరిబాబు ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి ఉపాధ్యాయులు ఎం.మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, జ్యోతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి  కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.73 ఏళ్ల నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృందం నటుడిని పరీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఆసుపత్రిలో చేరడానికి ముందు, రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వేట్టయాన్ ఆడియో లాంచ్‌లో కనిపించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ కొన్ని డ్యాన్స్‌లు కూడా చేశారు.
NLG:  హైస్కూల్ బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో 8,9,10 తరగతి చదువుతున్న బాలికలకు ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. బాలికలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు బలమైన ఆహారంతో పాటు మంచి నీటిని అధికంగా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, డాక్టర్ల బృందం, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
TG: కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కుటుంబ డిజిటల్‌ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధరించాలన్నారు. కుటుంబ డిజిటల్‌ కార్డులపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. డిజిటల్‌ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అక్టోబరు 3 నుంచి 7 వరకు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలి. కొత్త సభ్యులను జత చేసి, చనిపోయిన వారిని తొలగించాలి. పైలెట్‌ ప్రాజెక్టులో ఎదురైన వివరాలతో నివేదిక తయారు చేయాలి. కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు.̲
NLG: డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో సోమవారం సిపిఎం శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మహాసభకు మైల సత్తయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులు సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు  కొన్ని నిర్మాణ పనులు జరిగాయని, కానీ రైతాంగానికి ఉపయోగం లోకి సాగునీరు రావాలంటే డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను పర్యావరణ,అటవీ శాఖ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు కేటాయించి పనులు చేపట్టి,ఆ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

జీవో ఎంఎస్ నెంబర్107 ద్వారా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ ప్రాంతానికి0.5 టీఎంసీ చొప్పున 60 రోజులు 30 టీఎంసీలు నీరు  ఇవ్వనున్నట్లు జీవో ఇచ్చారని అనుమతులు మరిచారని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లాలో 3 లక్షల 41 వేల ఎకరాల ఆయ కట్టుకు నీరు ఇస్తానని చెప్పారు కానీ డిపిఆర్ ఆమోదించకపోవడం వలన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. ఏదుల్లా రిజర్వాయర్ నుండి మరో 27 కిలోమీటర్లు కాలువ తవ్వే పనికి అనుమతులు ఇవ్వలేదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ ఇంకా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. మునుగోడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తిచేసి,ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు- సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగోటి వెంకటేష్, రుద్రాక్షి శ్రీరాములు, పిట్టల రమేష్, చొప్పరి హనుమంతు, గిరి విష్ణు, సురిగి యాదయ్య  తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎసిబి కి పట్టుబడ్డ పశు వైద్యాధికారి
నల్లగొండ జిల్లా:
చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ఎసిబి అధికారులకు సోమవారం పట్టుబడ్డారు.

ఓ రైతు నుండి 8 గేదెలకు సంబంధించిన ఆరోగ్య, మూల్యాంకన ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.6,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర సూచించారు.
యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
డిల్లీ:
'సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు న్యాయవాది వాదనలు వినిపించే క్రమంలో పదేపదే 'యా' (yeah) అంటుండటం పై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. 'యా' అనేది గౌరవప్రదమైన పదం కాదని ఆ న్యాయవాదికి సీజేఐ సూచించారు.

'మీరు కేఫ్‌ లో లేరు.. కోర్టు రూంలో ఉన్నారు.. పదాలను జాగ్రత్తగా వాడండి.. "యా" అనే పదం అంటే నాకు, మా న్యాయమూర్తుల బెంచ్‌ కు అలర్జీ. అలాంటి పదాలు వాడేందుకు మిమ్మల్ని మేం అనుమతించం' అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు..
NLG: పీఆర్టీయూ జిల్లా కార్యదర్శిగా అద్దంకి సునీల్
నల్లగొండ: జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ నూతన కమిటీని ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివీఎస్,ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శిగా అద్దంకి సునీల్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
NLG: అబాకస్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవచ్చు: మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్
నల్లగొండ:
అబాకస్ నేర్చుకోవడం ద్వారా పిల్లలు విద్యలో మరింత నైపుణ్యాన్ని పొందవచ్చని నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తెలిపారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని సిప్ అబాకస్ ఇనిస్ట్యూట్ లో డ్రాయింగ్ కాంపిటేషన్లో గెలిచిన విద్యార్థులకు నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ సర్టిఫికెట్లు, ట్రోపీలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిప్ అబాకస్ ద్వారా విద్యార్థులు లెక్కల్లో అద్భుతంగా రాణిస్తారని దానితోపాటు చదువులో శ్రద్ధ పెంపొందించడానికి ఉపయోగపడతాయని అన్నారు.

పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఈలాంటి అదనపు యాక్టివిటీస్ ద్వారా ఉన్నత శిఖరాల చేరుకోగలరని అన్నారు. మెరుపు వేగంతో గణితాన్ని జయించే విధంగా సిప్ అబాకస్ తోడుపడుతుందని అన్నారు. విద్యార్థుల్లో లెక్కల పై ఉన్న భయాన్ని పారదోలడానికి ఇలాంటి విద్య దోహదపడుతుందని అన్నారు.

సిప్ అబాకస్ నల్లగొండ ఫ్రాంచైజీ  హెడ్ పి భవాని మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో మొదటిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సిప్ అబాకస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వారానికి ఒక్కరోజు ఆదివారం మాత్రమే ఈ క్లాసులు ఉంటాయని శిక్షణ పొందిన టీచర్లచే క్లాస్ లు చెప్పబడతాయని అన్నారు.

బస్టాండ్ దగ్గరలో సిప్  అబాకస్  ఇనిస్ట్యూట్ నడుపుతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో మొదటి బహుమతి మూడువేల రూపాయలు రెండవ బహుమతి రూ. 2000 మూడవ బహుమతి రూ.1000 ప్రోత్సాహక బహుమతి 1000 రూపాయలు నగదు తో పాటు ట్రోపి, సర్టిఫికెట్ అందివ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేష్  యువిన్, యశ్వంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.