/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కొనసాగుతున్న క్షేత్రస్థాయి ఆర్గానిక్ వ్యవసాయ సదస్సు Mane Praveen
కొనసాగుతున్న క్షేత్రస్థాయి ఆర్గానిక్ వ్యవసాయ సదస్సు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ సదస్సు కొనసాగుతోంది.

ఈరోజు నల్గొండ శివారు లాలయ్యగూడెంలో రైతులతో ఆర్గానిక్ వ్యవసాయంపై శ్రీసత్యం వర్మి బయో ఆర్గానిక్స్ సేల్స్ డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, బాను ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయంలో రైతులు అనుసరించదగ్గ వివిధ పద్ధతులు, రసాయనాల బదులు కషాయాలు వాడడం, వానపాములు రైతు నేస్తాలు, వర్మి కంపోస్టు వాడడం వల్ల భూమి బలోపేతం అయ్యే విధానం మరియు కెమికల్ క్రిమిసంహారకాలకు బదులు ప్రభుత్వం గుర్తించిన సర్టిఫైడ్ బయో ఉత్పత్తుల గురించి రైతులకు వివరించారు.
NLG: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో సిపిఎం 9వ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభ సూచికగా సిపిఎం నాయకులు నీలకంఠం యాదయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం  మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ 4 వేల రూపాయలు, వికలాంగులకు 6 వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి నేటికీ సంవత్సరం గడిచిన ఇంతవరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇందుర్తి గ్రామంలో కొంతమందికి రుణమాఫీ అందలేదని వెంటనే అందరికీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో మురికి కాలువలు, డ్రైనేజీ, రోడ్లు, అనేక మౌలిక వసతులపై శాఖ మహాసభలో తీర్మానం చేశారని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని 9వ శాఖ మహాసభలో తీర్మానం చేశారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు పెట్టుబడి మీద 50% పెంచి మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేస్తానని మూడు,నాలుగు సంవత్సరాల నుండి రైతాంగాని మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఢిల్లీలో అనేక సందర్భాలుగా పోరాటాలు జరిగినా.. 14 నెలల పాటు దీక్షలు నిర్వహించినా.. నేటి వరకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు.డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం కేటాయించాలని అన్నారు.

సీపీఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, ఏర్పుల దుర్గమ్మ,సిపిఎం నాయకులు గిరి వెంకటయ్య, గడగోటి వెంకన్న, ఏరుకొండ రాఘవేంద్ర,, ఊరు పక్క బిక్షం,జోగు సులోచన, తదితరులు పాల్గొన్నారు.
మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా గంట మల్లేష్ నియామకం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం కొట్టాల గ్రామానికి చెందిన గంట మల్లేష్ ను మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగ నున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంట మల్లేష్ కు ఈ పదవి రావడం పట్ల మండలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా గంట మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎంపిక కు సహకరించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మరియు మర్రిగూడ మండల పార్టీ నాయకులకు, కొట్టాల గ్రామ ప్రజలకు ధన్యవాదములు అని తెలిపారు.

మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా జమ్ముల వెంకటేష్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన జమ్ముల వెంకటేష్ తండ్రి సత్తయ్య ను మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగ నున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమ్ముల వెంకటేష్ కు ఈ పదవి రావడం పట్ల మండలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా జమ్ముల వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎంపిక కు సహకరించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మరియు మర్రిగూడ మండల పార్టీ నాయకులకు, యరగండ్లపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదములు అని తెలిపారు.

NLG: మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దొంతం అలివేలు
నల్లగొండ జిల్లా:
చింతపల్లి మండలం, మాల్ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దొంతం అలివేలు సంజీవరెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓసి ఉమెన్ కేటగిరిలో ఆమెకు ఈ పదవి దక్కింది. వైస్ చైర్మన్ గా నక్క శీను ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మరో 16 మంది సభ్యులను నియమించింది.

మార్కెట్ కమిటీ సభ్యులుగా గౌని జంగయ్య, రమావత్ హనుమాన్, మహమ్మద్ ముష్వర్, జమ్ముల వెంకటయ్య, గంట మల్లయ్య, రమావత్ రమేష్, రాగిపని అంజచారి, కొడిశెట్టి వెంకటేశ, మారేపాకుల మమత, పూల యాదగిరి, మేకల జంగారెడ్డి, ఊర శ్రీనివాసులు లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరితోపాటు చింతపల్లి పిఎసిఎస్ చైర్మన్,నల్లగొండ జిల్లా మార్కెటింగ్ అధికారి, దేవరకొండ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, గొడుకొండ్ల గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
NLG: భగత్ సింగ్ పోరాట స్పూర్తి ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి: AIYF జిల్లా అద్యక్షుడు బూడిద సురేష్
మర్రిగూడ: AISF మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ మండల కార్యాలయం లో షాహిద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా, సిపిఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షం రెడ్డి, AIYF జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ లు శనివారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భగత్ సింగ్ పోరాట స్పూర్తి ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ఇస్కిల్ల మహేందర్, సిపిఐ నాయకులు యాదయ్య, ఆకుల రఘుమయ్య, కొన్రెడ్డి గిరి, గీత పని వారల సంఘ నాయకుడు నిరంజన్, హన్మంతు, సాయి, కుమార్ తదితరులు ఉన్నారు.
NLG: కామినేని మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం
  నల్లగొండ: కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్ పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ మర్రిగూడ అంగన్వాడి సెంటర్లలో పోషణమాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కామినేని జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ కల్నాల్ పివి.రామ మోహన్ పోషకాహార విలువల గురించి, ఇంట్లో వాడుకునే నిత్యావసరాల నుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు. కామినేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు అందించే ఉచిత వైద్య సేవలు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వివరించారు. కామినేని వైద్య కళాశాల-హాస్పిటల్ క్రింద దత్తత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని సూచించారు. చర్లపల్లి లో ఉన్న కామినేని రూరల్ ఆసుపత్రి లో ఉన్న ఉచిత సేవల వివరాలు తెలిపారు.

కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా.మారుతి శర్మ మాట్లాడుతూ.. పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. బాలింతలకు, గర్భిణులకు పోషన్ మాస్ - 2024 కార్యక్రమం గురించి, పోషన్ అభియాన్ కార్యక్రమం సేవల వినియోగం గురించి అవగాహన కల్పించారు.

కౌమార దశ బాలికల కోసం:
1)ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు వినియోగం గురించి అవగాహన కలిగించారు.
2)ఐ.ఎఫ్.ఏ మాత్ర, నులి పురుగుల నివారణకు ఆరు నెలలకి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర వినియోగించాలి అని సూచించారు.
3) ఎల్లపుడు మూత పెట్టిన పాత్రలలో భద్రంగా ఉంచిన నీరునే త్రాగాలి, వంట చేసే ముందు, తినే ముందు ప్రతి సారి తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచించారు.

గర్భిణి స్త్రీలకి:
1) విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, బలోపేతం చేయబడిన పాలు, నూనె మరియు ఐయోడిన్ కలిగిన ఉప్పు వాడుకోవాలని చెప్పారు.
2)నాలుగో నెలలో మొదలుపెట్టి ఆరో నెల వచ్చేవరకు రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
3) ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు గర్భస్థ (ఎ. ఎన్.సి.) పరీక్షలు, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం చేయించుకోవాలని చెప్పారు

పోషణ్ అభియాన్ - పాలిచ్చే తల్లుల కోసం:
1)C విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు, ప్రసవించిన తరువాత ప్రతి రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, డాక్టర్ చెప్పినన్ని కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
2) బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే, బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయిన తరువాత అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు.
మరియు పిల్లలకి, బాలికలకు, బాలింతలకు గర్భిణులకు పండ్లు, ఖర్జూర ప్యాకెట్లు పంచడం జరిగింది.

ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణీలు పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. కామినేని కాలేజీ డాక్టర్లు మా గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చటాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో డా.ప్రోఫెసర్.కల్నాల్ పి.వి.రామ మోహన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. మారుతి ప్రసాద శర్మ, డా. రత్న బాల రాజు, డా.మొవ్వ దేవ కుమారి. డాక్టర్ అశోక్ దేవ్, డా.యామిని, డా. శ్రీనిజ, ఓం ప్రకాష్, స్వామి, పరశురామ్, సైదులు, బేబీ సరోజ, అంగన్వాడి టీచర్స్ మరియు ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస గౌడ్, సిస్టర్స్ రమణ, అనూష ,స్వాతీ, మేరీ, కళ్యాణి, నాగేంద్ర, మంజుల, హెల్త్ అసిస్టెంట్స్ బద్దం నగేష్, గడ్డం రమేష్, గవర్నమెంట్ కామినేని మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ స్టూడెంట్స్, ఆశ వర్కర్స్ మరియు అటెండర్ సాయి పాల్గొన్నారు.
NLG: ఎన్ జి కళాశాల విద్యార్థినికి జిల్లా యువజనోత్సవాల్లో ప్రథమ స్థానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బి.ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న ఎం. నర్మద జిల్లా యువజనోత్సవాల్లో ప్రథమ బహుమతి గెల్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. నర్మద పాడిన “తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట” అనే పాటకు జానపదం సోలో విభాగంలో

ప్రథమ స్థానం లభించిందని తెలిపారు. త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో నర్మద నల్గొండ జిల్లా ప్రతినిధిగా పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్బంగా శనివారం జరిగిన ఒక ప్రత్యేక అభినందన కార్యక్రమంలో నర్మదను ప్రిన్సిపాల్ మరియు కల్చరల్ కో ఆర్డినేటర్ డా. వి. శ్రీధర్ అభినందించారు.

కార్యక్రమంలో మహిళా సాధికారికత విభాగం కన్వీనర్ డా. జి. భాగ్యలక్ష్మి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు మల్లేశం, వెంకట్ రెడ్డి, కోటయ్య, అధ్యాపకులు శివరాణి, సావిత్రి, తెలుగు అధ్యాపకులు డా సైదులు, లింగస్వామి, అంజయ్య, శ్రవణ్ కుమార్ విద్యార్థినిని అభినందిoచారు.
NLG: కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్భంగా శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
TG: భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎంకు ఆహ్వానం
హన్మకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శుక్రవారం దేవస్థానం పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించింది.

శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,  దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషు భారతి లు సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆహ్వానం అందజేశారు.