/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: తమ్మడపల్లి లో బెల్టు షాపుల నిర్మూల కమిటీని ఏర్పాటు చేసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ Mane Praveen
Mane Praveen

9 hours ago

NLG: తమ్మడపల్లి లో బెల్టు షాపుల నిర్మూల కమిటీని ఏర్పాటు చేసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ మర్రిగూడ మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీని వేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ మేరకు బెల్ట్ షాపులు అరికట్టాలని,ఒక్క బెల్టు షాపు కూడా నిర్వహించకూడదని, ఈరోజు నుంచి ఏ ఒక్కరు మందు గానీ, గుడంబా గానీ అమ్మితే  వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ కమిటీ ద్వారా మండల ఎస్ఐ రంగారెడ్డి హెచ్చరించారు.

ఈ కమిటీ సభ్యులుగా గ్రామ నాయకులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొట్టం రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇడగోని  వెంకటేష్, కొట్టం శీను, రమేష్, జంగయ్య, ఎం.డి నజీర్, డి.సతీష్ యాదయ్య, మహిళలు  ఆయిలి ఉషమ్మ, అండాలు, నిర్మలమ్మ, నాగమణి, ఎం. డి మిశ్రీన్, సిపిఐ నాయకులు పాండురంగారావు, మాజీ ఎంపీటీసీ యాదయ్య, బాలకిషన్, ఎం. నరసింహ, గ్రామ పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 24 2024, 21:10

NLG: గంజాయి రహిత సమాజాన్ని  తీర్చిదిద్దడం మన అందరి లక్ష్యం: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్గొండ పట్టణం లోని ప్రభుత్వ జేబిఎస్ పాఠశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పై వన్ టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం మనందరి లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 24 2024, 20:15

నల్లగొండలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ తహసిల్దార్ కార్యాలయం ఆధునీకరణకు రూ. 25 లక్షలు
నల్గొండ:  పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహశీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ని ఆదేశించారు.

మంగళవారం నల్గొండ తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 1,00,116  చొప్పున  117 చెక్కులను మంత్రి కోమటిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం తో ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి పెరిగిందని అన్నారు.

కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహశీల్ పరిధిలో గ్రామాలు కలవడం ,  నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసిల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు .  నల్గొండకు ప్రత్యేక తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపాయల ఎం ఎల్ ఏ ఎస్ డి ఎఫ్  నిధులతో పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, టాయిలెట్స్ తో పాటు, అన్ని గదులను ఆధునికరించడం,ఏ సి సౌకర్యం, అవసరమైన సౌకర్యాలు అన్నింటిని కల్పించాలని, ఇందుకు అంచనాలను రూపొందించాలని  పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని, రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ముందు ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాం నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, జిల్లా కలెక్టర్ చొరవతో వాటిని పరిష్కరించి ఆ సంఖ్యను 4000  కు తీసుకురావడం జరిగిందని, ప్రత్యేకించి నల్గొండ తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించి 1400 దరఖాస్తులలో 1100 ఇదివరకే పరిష్కరించడం జరిగిందని, మిగిలినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు.

గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని ,వీటిని దృష్టిలో ఉంచుకొని తమ  ప్రభుత్వం సాధ్యమైనంతవరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకుగాను ధరణి స్థానంలో భూమాతను  తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు .దీనిద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇన్చార్జ్ ఆర్డిఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

Mane Praveen

Sep 24 2024, 19:53

NLG: జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధం: సిపిఎం
నల్లగొండ జిల్లా:
జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనది కాదు అని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభ సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షత నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీలు జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గత ఏడాది పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయని, వీటికి2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి వస్తుందని అన్నారు.

అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్  రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తామని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని  ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మహాసభలో  గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల కోసం పనిచేసిన పోరాటాలను సమీక్షించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

డిండి ఎత్తిపోతల పథకం డి పి ఆర్ ను ఆమోదించి వెంటనే పనులు పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు  ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, వెంకటేశం, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, బల్లెం స్వామి ఈరటి వెంకన్న, లింగస్వామి, సైదులు, స్వామి, లక్ష్మమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 24 2024, 18:23

NLG: విద్యార్థులు సామాజిక సేవకు తరలి వెళ్లాలి
నల్లగొండ : విద్యార్థులు చదువుతోపాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజ సేవకు తరలి వెళ్లాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్దులకు శ్రమ విలువను తెలియజేయడంలో తల్లిదండ్రులు, అధికారులు, అధ్యాపకులు శ్రద్ధ వహించాలని అన్నారు. విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమే అయినా, భావి భారతాన్ని నిర్ణయించవలసినది నేటి యువకులే అని “మా కోసం కాదు మీ కోసం” అనే భావన పెంచడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.

అనంతరం యన్ యస్ యస్ డే సందర్భంగా నిర్వహించిన పాటల పోటీలు,  వకృత్వ పోటీలు మరియు వ్యాసరచన పోటీలలో ప్రతిభ చాటిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవి కుమార్, డా. సురేష్ బాబు, పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజు, యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యమ్. వెంకటరెడ్డి,యన్. కోటయ్య , కె శివరాణి, ఏ.మల్లేశం, అనిల్ కుమార్ బొజ్జ, యమ్ సావిత్రి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డా. వెల్దoడి శ్రీధర్, బోధన మరియు బోధనేతర సిబ్బంది యన్ యస్ యస్ వాలంటీర్స్ ,విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 24 2024, 18:08

చత్రపతి శివాజీ స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని సందర్శించిన బొమ్మపాల గిరిబాబు
శ్రీశైలం పుణ్యక్షేత్రం లోని చత్రపతి శివాజీ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని ఈరోజు నల్గొండ చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్ఫూర్తి కేంద్రంలో శివాజీ రాజ్యంలోని  మంత్రివర్గం సహచరుల విగ్రహాలు మరియు చత్రపతి శివాజీ విగ్రహం ఎంతో తేజస్సుతో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందని తెలిపారు.

ప్రతి ఒక్క యువకుడు చత్రపతి లోని దేశభక్తిని నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు.

Mane Praveen

Sep 24 2024, 15:39

NLG:జ్యోతి బాపూలే స్థాపించిన సత్య శోదక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కై ఉద్యమిద్దాం: సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ
మహాత్మా జ్యోతి బా పూలే స్థాపించిన సత్య శోదక్ సమాజ్  152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ కేవలం భారతదేశం లోనే ఉందన్నారు. 77 సం.రాల అధికార మార్పిడి తర్వాత కూడా దేశంలో కుల అణిచివేత, అంటరానితనం, కుల హత్యలు జరగడం సిగ్గుచేటు అన్నారు.

కులం అనే రక్కసి మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ వివక్ష, అంటరానితనం, హత్యాకాండ, అత్యాచారాలకు  గురి చేస్తుందన్నారు. ఒకపక్క దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మతం పేరుతో మనిషిని మనిషే చంపుతున్న దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుత సమాజం నెలకొంది అన్నారు.

కుల వ్యవస్థకు క్రీస్తుపూర్వం 3,500 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. అది నేడు రాజకీయ నాయకులకు ఓట్లు దండుకునేందుకు ఆయుధమైందన్నారు. దేశంలో లక్షకు పైగా కులాలు, ఉప కులాలు ఉన్నాయని మధ్యయుగాల కాలంలోనే కుల వివక్షత వ్యతిరేకంగా వేమన, తుకారం, కబీర్, నానక్ తోపాటు ఎన్నో సంస్కరణోద్యమాలు జరిగాయన్నారు.

ప్రస్తుత పాలక బూర్జువా పార్టీలు కుల, మతాల మధ్య తమ చిచ్చు పెట్టి తమ రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని, అధికారాన్ని సాదించుకునేందుకు కులాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, PYL జిల్లా కార్యదర్శి బి.వి చారి, PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్, రావుల వీరేశ్, కత్తుల లింగుస్వామి, దశరథ, తీగల సురేష్,తీగల నరేష్, శంకర్
తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 23 2024, 22:19

NLG: బాల్య వివాహాలు నిషేధం - అవగాహన సదస్సు
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఇవాళ విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాలు నిషేధం, బాల కార్మిక వ్యవస్థ, బాలల అపరహణ మరియు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, స్వీయ రక్షణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఆర్గనైజర్ పి.ధనమ్మ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Mane Praveen

Sep 23 2024, 22:11

TG: వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన.. ప్రజలు, కార్యకర్తల తో మంత్రుల ముఖాముఖి

ప్రజా పాలన -ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  ఫోకస్

సరికొత్త సంప్రదాయానికి నాంది  పలికిన నేతలు

HYD: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత  పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు.

అలాగే వారితో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు బుధ, శుక్రవారం కాంగ్రెస్ పార్టీ  గాంధీభవన్ ఆఫీస్ లో ఒక్కోరోజు ఒక మంత్రి అందుబాటులో ఉంటారు.

ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు రోజుకు 3 గంటలు, అందుబాటులో ఉంటారు. అది రానున్న  బుధవారం నుండి  ప్రారంభించనున్నారు.

ఇక వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన

ప్రజలు, కార్యకర్తల తో మంత్రుల ముఖాముఖి ..

సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు చర్చించుకుని గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ను ఖరారు చేశారు.

ఈ బుధవారం నుండే ప్రారంభం.. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.

తొలి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ.. ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి.

ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ కు రావాలని సూచించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, కార్యకర్తల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచడానికి, అలాగే కార్యకర్తల సమస్యలను నేరుగా తీర్చడానికి ఇదో గొప్ప ఆలోచనే అని చెప్పాలి.

మొత్తానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ.. కార్యకర్తలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆనందం కలిగిస్తుందని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా చేర్చేలా కార్యకర్తలను ఇప్పటి నుండే ఇంకా బలంగా భాగస్వామ్యం చేసేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mane Praveen

Sep 23 2024, 21:30

మర్రిగూడ మండల నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి.. మండల నాయకులకు సూచించిన ఎమ్మెల్యే

మర్రిగూడ మండలం లోని వివిధ సమస్యలపై మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల సమస్యలు రోడ్లు, విద్యుత్ ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బెల్ట్ షాపు ల పై సమగ్రమైన అధ్యయనం చేసి తన దృష్టికి తీసుకురావాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాసు, మర్రిగూడ మండల మాజీ జిల్లా ప్రాదేశిక సభ్యులు మేదరి యాదయ్య, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య లు పాల్గొన్నారు.