/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదు...చాడ కిషన్ రెడ్డి Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 14:41

బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదు...చాడ కిషన్ రెడ్డి

 రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది

విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

నల్లగొండలో బిఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పదేపదే అనే మాటలను ఇక ఆపాలని పార్టీ ఆఫీసు జోలికి వస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఆయన బుధవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని

పార్టీ ఆఫీసు కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదు అనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తాం అనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి ల తొత్తులం కాదు.

అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం . టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ . మా జోలికొచ్చిన, మా ఉద్యమకారుల జోలికి వచ్చిన, మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చిన, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు .

30 ఏళ్లు మీరు రాజకీయంలో ఉండి నల్లగొండలో కనీసం పార్టీ ఆఫీసు నిర్మించుకోలేదని ..కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేదారులుగా తిరగాలని ఆలోచనతోనే పార్టీ ఆఫీసు నిర్మించకుండా ఉన్నారన్నారు.. రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బిఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని మీరు ఏందో నల్లగొండ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూమి ఇస్తే అక్కడ ఆఫీసు నిర్మాణం చేశామని

కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారు అని ప్రశ్నించారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.. వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. 6 గ్యారంటీలతోపాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై ఏడవడం సరికాదన్నారు.. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయం దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా చేయని మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.. టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు ఆపి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అది వీడి పార్టీ ఆఫీసును కూల్చాలని టిఆర్ఎస్ పార్టీ వాళ్లపై విమర్శలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనగల్ పిఎసిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలే వెంకటాద్రి కర్నాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:53

సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..

హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అందుకు అనుగుణంగా పలు సమస్యల పరిష్కార దిశగా పావులు కదుపుతోంది.

ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తెచ్చి ఆ సమస్య తీర్చింది. దీని వల్ల ప్రజలు సహా నిర్మాణ రంగ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. అలాగే అమరావతి రైతుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి తగిన న్యాయం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రతి రోజూ వందల కొద్ది అర్జీలు వస్తున్నాయి.మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

ప్రజాదర్బార్‌లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమస్యలు విన్నవించేందుకు అర్జీదారులు పోటీ పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పవన్ నేరుగా కలిశారు. వారి సమస్యలు ఓపికగా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు.

దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

అమెరికాలో విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసం చేసిందని ఓ విద్యార్థిని డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసింది. విద్యార్థినిని మోసం చేసిన కన్సల్టెన్సీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:52

ఉపాధి’లో అక్రమాలపై చర్యలు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మరొకర్ని బదిలీ చేశారు. ముగ్గురు మేట్లను ఉపాధి హామీ పనుల నుంచి తొలగించారు.

బర్లగూడెం పంచాయతీలో జరిగిన ఉపాధి అక్రమా లపై జూలై 9న ‘ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతా ల్లోకి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఉపాధి హామీ’లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా డీఆర్‌డీఏ అడిషనల్‌ పీవోను ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఈ విచారణ లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజేష్‌, ముగ్గురు సీనియర్‌ మేట్లు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాజేష్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఏ డేవిడ్‌ రాజును డిప్యుటేషన్‌పై వైరాకు బదిలీ చేశారు.

ఉపాధి’ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఉపాధి సొమ్ము జమ అయినట్లు సవివరంగా ప్రచురించింది. కానీ అధికారుల విచారణ నివేదికలో కొందరి పేర్లు లేకపోవడం గమనార్హం.

నివేదికలో భూక్య చంద్రశేఖర్‌ అనే వ్యక్తి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారని, అతడికి 12 రోజులకు రూ.2,470 జమ అయ్యాయని నివే దికలో పేర్కొన్నారు. దాంతో ఆ సొమ్ము రికవరీ చే యాలని ఆదేశించారు.

అయితే అక్రమంగా ఉపాధి నిధులు పొందిన కొందరి పేర్లు నివేదికలో లేకపోవడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:50

హైదరాబాద్‌కు మహర్దశ..ఎంట్రీ ఇస్తోన్న మరో ఇంటర్నేషన్ కంపెనీ

టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది.

డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది.

ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.

ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు.

సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు.

మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:48

హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

షేక్ హసీనా‌తోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

తప్పని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. అనంతరం సోదరి షేక్ రెహనాతో కలిసి ఆమె భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరు లండన్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి వేళ.. బంగ్లాదేశ్‌లో సరికొత్త డిమాండ్ ప్రారంభమైంది

షేక్ హసీనా‌తోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్ అల్లర్లలో వందలాది మంది ప్రజలు మరణించారన్నారు. అందుకు షేక్ హసీనా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోదరితోపాటు ఆమెను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని భారత్‌కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశంలో అత్యయక స్థితిని విధించవద్దంటూ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అనుకూలురుతోపాటు షేక్ హసీనా వ్యతిరేకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జిలు.. తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల అధినేతలు, ఉన్నతాధికారులను కూడా రాజీనామా చేయాలనే పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆగస్ట్ 5వ తేదీన తప్పని సరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు మొదలైనాయి. ఆ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు భారీగా చేపట్టిన విషయం విధితమే.

మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రద్దు చేశారు. ఆ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వాన్ని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బ్యాంకర్ ప్రొ.యూనస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జైలు నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:31

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

రాజధాని అమ‌రావ‌తిలో (Capital Amaravati) జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి.

మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్న మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిపే చోట, ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.

కాగా.. గత ఐదేళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో జంగిల్ దట్టంగా పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించడంతో పాటు నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. రాజధానిని అభివృద్ధి చేయడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది.

వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. సెక్రటేరియట్‌ వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు.

ఈ పనులపై మంత్రి నారాయణ మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జంగిల్‌ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, రాజధాని క్యాపిటల్‌ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:29

మరింత డేంజర్‌లోకి మేడిగడ్డ బ్యారేజ్ !

వర్షాలు పడ్డాయి.. వరదలొచ్చాయి.. మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా నీళ్ల పారాయి.. ప్రపంచ అద్భుతాన్నికూలిపోయిందని.. కూలిపోతుందని ప్రచారం చేస్తారా అని బీఆర్ఎస్ చేసిన హడావుడి ఇంకా కళ్ల మందే ఉంది.

కానీ మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని పియర్స్ కు పగుళ్లు వచ్చాయని తాజాగా తేలింది. బ్యారేజ్‌లో గేట్లు అన్ని ఎత్తి పెట్టారు. నీరు నిల్వ చేయడానికి గేట్లు మూసి ఉంటే.. పెను ప్రమాదం సంభవించి ఉండేది. కానీ నీళ్లు ఎత్తిపోయలేదని ఆరోపిస్తూ కేటీఆర్ రెండు రోజుల పాటు టూర్ వేశారు. తామే మోటార్లు ఆన్ చేస్తామని కూడా ప్రకటించారు.

కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగిన డ్యామేజ్ అలాంటి ఇలాంటి ది కాదని.. తాజాగా వెల్లడవుతున్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీరు బ్యారేజీ మీదుగా ఇంకా వెళ్తోంది. వరద తగ్గిన తర్వాత పరిస్థితిని నిపుణులు మరోసారి పరిశీలన జరిపితే..

అసలు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థమయ్యే అవకాశం ఉంది. వర్షాలు..గోదావరికి వరద సీజన్ ముగిసిన తర్వాతనే మరమ్మత్తులో.. పగుళ్లిచ్చిన పియర్స్ ను తీసేసి మళ్లీ కొత్త వాటిని నిర్మంచడమో చేయాల్సి ఉంది.

కాళేశ్వరం విషయంలో తమ తప్పును చాలా చిన్నదిగా చూపించడానికి కేటీఆర్ బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రతీ దాన్ని కాళేశ్వరంతో పోల్చేసుకుంటున్నారు.

వచ్చే ప్రతీ నీటిని కాళేశ్వరం నీళ్లంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు డొల్లతనంపై రోజు రోజుకు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు అసలు డ్యామేజీ జరగకపోయినా అతి పెద్ద నిరర్థక ప్రాజెక్టు అని..

అది సృష్టించే సంపద కరెంట్ బిల్లులకూ సరిపోదని ఇప్పటికే కాగ్ లాంటి రిపోర్టులు వెల్లడించాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:28

అవినీతికి అడ్డగా గన్నేరువరం తహశీల్దార్ ఆఫీస్‌.. అధికారిపై కేసు

ప్రభు త్వాలు మారినా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం అధికారుల తీరు మారడం లేదు...

ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారడం లేదు. తప్పులు చేస్తే కటకటాల పాలవుతామన్న భయమే లేదు. కొందరు అధికారులు లంచాలకు అలవాటుపడి నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. డబ్బులకు ఆశపడి తమకు ఉన్న అధికారాన్ని అవినీతి పనులకు ఉపయోగిస్తున్నారు.

అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వారసులకు కాకుండా వేరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసి అధికారులు నిజమైన వారసులను ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి ఘటన గన్నేరువరం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. అధికారులు లంచాలు తీసుకొని అనర్హులకు సర్టిఫికెట్ జారీ చేశారని బాధితురాలు వాపోతోంది. అయితే ఈ విషయమై గన్నరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కుటుంబ యజమాని మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వారసత్వ ధ్రువీకరణగా కూడా పరిగణిస్తారు. కుటుంబ యజమానికి సంబంధించి స్థలాలు, ఆస్తుల బదలాయింపు ఇతర అవసరాల నిమిత్తం ఈ సర్టిఫికెట్‌ను స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో అప్లై చేసుకుని తీసుకుంటారు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం కార్యాలయాల్లో అప్లై చేస్తున్న అధికారులు విచారణ చేపట్టి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అవినీతి అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తూ అసలు వారసులను పక్కనపెడుతున్నారు.

ఆ కుటుంబంలోని దగ్గర బంధువులకు సర్టిఫికెట్లు ఇస్తూ కుటుంబీకుల మధ్య చిచ్చురేపుతున్నారు. అధికారులు అన్నీ తెలిసే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా? లేదా నేతల ప్రలోభాలకు లొంగి అనర్హులకు వారసత్వ పత్రాలను జారీ చేసి ఆస్తుల పంపకంలో తగాదాలు సృష్టించాలనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.

గన్నేరువరం మండల రెవెన్యూ అధికారులు అసలు వారసులను పక్కనపెట్టి మరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆలస్యంగా నిజం తెలుసుకున్న అసలు వారసులు సర్టిఫికెట్‌పై అధికారులను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదని వాపోయారు. దీంతో బాధితులు జరిగిన విషయాన్ని ఆర్డీవోకు చెప్పడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కుటుంబంలో చిచ్చుపెట్టి ఇష్టానుసారం సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

బాధితురాలు కొయెడ వనిత తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మల్లయ్య, లచ్చవ్వలకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు జాలిగం బాలవ్వ, 2వ కూతురు కొయెడ వనిత, కొడుకు లింగంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే ముగ్గురిలో తమ పెద్దక్క జాలిగం బాలవ్వ, తన తమ్ముడు లింగంపల్లి శ్రీనివాస్ చనిపోయినట్లు 2వ కూతురు వనిత తెలిపారు. ఇదివరకు తమ తండ్రి, తల్లి అందరు చనిపోయారు. ఇక ఉన్నది తాను మాత్రమే ఉన్నానని వాపోయింది. వారసురాలిని అయిన తాను ఉండగా మా అక్క కొడుకుకు తన పేరు మీద తనకు తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను గన్నేరువరం తహసీల్దార్ జారీ చేశారని వాపోయింది. ఇదేంటీ సారు నా ప్రమేయం లేకుండా నా సంతకంతో ఎవరు తీసుకున్నారని అడిగితే సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రైట్ ఇన్ ఫర్మేషన్ యాక్టుతో రెవెన్యూ ఆఫీస్‌లో వారసత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎవరు తీసుకున్నారని సర్టిఫైడ్ కాపీ కావాలని కోరడంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చినట్టు అధికారికంగా తనకు తెలిపినట్లు వాపోయింది. అయితే ఈవిషయమై తాను గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 12:26

సగానికి పైగా నిండిన ఎస్సారెస్పీ

గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46.06 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణా పరిధిలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వర ద వస్తుంటే దాదాపు అంతే స్థాయిలో ఔట్‌ఫ్లో ఉంది. జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి.. 3.99 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

సాగర్‌కు 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 22 గేట్ల ద్వారా 3.54 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... గేట్లు ఎత్తి... 1.08 లక్షలను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. ఇక్కడ రెండేళ్ల తర్వాత జలవిద్యుదుత్పత్తి చేపట్టడం గమనార్హం. సాగర్‌ నుంచి కృష్ణమ్మ పొంగిపొర్లుతుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

కాగా సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) వరద కాల్వకు సోమవారం రాత్రి గండిపడింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేంపల్లి వద్ద గండిపడటాన్ని రైతులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని నిలుపివేసి.. గండి పూడ్చివేత పనుల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షం పడింది.

ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా, కల్లూరు, కొణిజర్ల, రఘునాథపాలెంలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. తల్లాడలో 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ శివారులోని జంగిలిగొండ శివారు దూర్యతండాలో చెట్లు విరిగిపడ్డాయి.

పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. పాలమూరు జిల్లా దేవరకద్ర, రాజాపూర్‌, జడ్చర్ల, గండీడ్‌, బాలానగర్‌ మండలాల్లో వర్షం పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 14:09

నోబెల్ అవార్డు గ్రహీత సారథ్యంలో కొత్త ప్రభుత్వం

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు. ఇది తాత్కాలికమే.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.

దీని తరువాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సైన్యాధికారులతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, జమాతె ఇస్లామీ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.

జైలు శిక్షను అనుభవిస్తోన్న మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు మరింత ముదరకముందే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తీర్మానించారు

2018 నుంచీ ఖలీదా జియా కారాగార శిక్షను అనుభవిస్తోన్నారు. ఆమెకు 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది అక్కడి కోర్టు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటోన్నారు. అక్కడే సైనిక నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

అదే సమయంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ నియమితులు కానున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

1940 జూన్ 28వ తేదీన చిట్టగాంగ్‌లో జన్మించారు యూనస్. ఆర్థికశాస్త్రంలో 2006లో నోబెల్ అవార్డును అందుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారాయన. మైక్రోక్రెడిట్, మైక్రోఫైనాన్స్‌ రంగంపై ఆయనకు గట్టిపట్టు ఉంది. బ్యాంకింగ్ సేవలను గ్రామణీ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో కీలకంగా వ్యవహరించారు.

2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకలాపాలను చేపట్టడానికి 2011లో యూనస్ సోషల్ బిజినెస్- గ్లోబల్ ఇనిషియేటివ్స్‌ను స్థాపించారు.

ఢాకా విశ్వవిద్యాలయంలో చదివారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో చదువుకోడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను సైతం పొందారాయన. విద్యాభ్యాసం ముగిసి తరువాత మిడిల్ టేన్నెస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిట్టాగాంగ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ హెడ్‌గా అపాయింట్ అయ్యారు.