కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపిని వ్యతిరేకించాలి. తమ్ముని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
![]()
ఈ మధ్యకాలంలో పార్లమెంటులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని దీనిపై ప్రజలు బిజెపిని వ్యతిరేకించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళకు అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం స్థానిక సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నిర్మల సీతారామన్ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని, తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి సంబంధించిన ఎంపీలు కనీసం నోరు మెదపకుండా ఉన్నారని, రాష్ట్ర ప్రజలకు బిజెపి ఎంపీలు బడ్జెట్ విషయంలో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేసిందని బిజెపిని నిలదీయాలని, ఒత్తిడి పెంచాలని వారు అన్నారు. బిజెపిపై చేసే పోరాటంలో కాంగ్రెస్ ముందుండి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసే న్యాయబద్ధమైన విషయాల్లో సహకరిస్తామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా పెరుగుతున్న బిజెపి ప్రమాదాన్ని ఎదిరించడంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాలని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గత బిఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని ప్రజా ఉద్యమాలు చేస్తున్న తరుణంలో సిపిఎం కార్యకర్తలు కదిలి ప్రజా పోరాటాలు నిర్వహించాలని వారు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిధులు కేటాయించకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడితే ఉపయోగం లేదని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాటలకే పరిమితమై ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని నూతన రేషన్ కార్డుల పై వెంటనే జీవో విడుదల చేయాలని వారు అన్నారు. పేద ప్రజలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమాలను అరిస్తూ నిర్బంధాలను ప్రయోగిస్తుందని గత బిఆర్ఎస్ విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తే పోరాటాలు తప్ప మరొకటి లేదని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిరిపంగి స్వామి, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, బొల్లు యాదగిరి, ఎండి పాషా, బండారు నరసింహ, దోడ యాదిరెడ్డి, గుంటోజు శ్రీనివాస చారి, బూరుగు కృష్ణారెడ్డి, మద్దెపురం రాజు, గుండు వెంకటనర్సు, గడ్డం వెంకటేష్, అవ్వరు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శులు ధూపటి వెంకటేష్, గాడి శ్రీనివాస్, బురు అనిల్, వేముల భిక్షం, మండల నాయకులు తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, చీరిక శ్రీశైలం రెడ్డి, మెరుగు వెంకటేశం, కవుడే సురేష్, గర్దాసు నరసింహ, కందాడి సత్తిరెడ్డి, వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
![]()


భువనగిరి పట్టణంలో 2000 మంది అర్హుల జాబితా అందరికీ మండల పరిధిలోగల హనుమాపురం సర్వేనెంబర్ 28 లో 76 ఎకరాలు బొమ్మాయిపల్లి సర్వేనెంబర్ 118 లో లేఅవుట్ చేసి స్థలాలు ఇవ్వాలి బస్వాపురంలో పట్టాలు పొందిన వారికి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు శ్రీ ఏశాల అశోక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడానికి ఒక రోజు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నివేషణ స్థలాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇండ్ల నిర్మాణానికి అర్హులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపరచాలని ముఖ్యమంత్రి గారికి శ్రీరాములు గారు విజ్ఞప్తి చేశారు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్య తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారికి పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ అర్హులైన వారి వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించామన్నారు ఏషాల అశోక్ గారు నిర్వహిస్తున్న ఉపవాస దీక్ష శిబిరాన్ని భువనగిరి తహసిల్దార్ అంజిరెడ్డి గారు సందర్శించి సమస్యలు అన్నింటిని విని పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భువనగిరి హుస్నాబాద్ భూమి ప్రభుత్వానికి తెలియపరచి నిర్ణయిస్తామన్నారు ఈ ఉపవాస శిబిరంలో 300 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ చెక్క వెంకటేష్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సోమన సబిత సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం ఉడుత రాఘవులు చింతల పెంటయ్య చిక్కా బిక్షపతి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య నాయకులు బద్దం వెంకటరెడ్డి నాగపురి యాదగిరి చొప్పరి సత్తయ్య ఎస్.కె అమీర్ చిక్క నరసయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపురం నుండి వేములకొండ కు వెళ్లే మెటల్ రోడ్డుకు మరమ్మతులుచేపట్టాలి... సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి చిత్తాపురం నుండి వేములకొండ వెళ్లే అద్వాన్నంగా మారిన మెటల్ రోడ్డు కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున సిపిఎం చిత్తాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు అద్వానమైన చిత్తాపురం వేములకొండ రోడ్డును పరిశీలించిన అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ చిత్తాపురం వేములకొండ గ్రామాల మధ్యన ఉన్న మెటల్ రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఆ రోడ్డు ద్వారా వెళ్తున్న ప్రజలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని వెంటనే నూతన మెటల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చిత్తాపురం నుండి ముద్దాపురం వరకు వెళ్లే మట్టి రోడ్డు గుంతలుగా ఏర్పడిందని దీనిపై బీటి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని పెన్షన్లు రేషన్ కార్డులు రాని వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి ఏటేల్లి నరసింహ, సహాయ కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, నాయకులు కందుల బిక్షం, భూపతి రాములు,కందుల మచ్చగిరి, నాయకులు నిశాంత్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి ,అనంతరం సూపరిండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ....* *భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు లేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో దోమల బెదడా,మరియు కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి, అర్హులైన వారందరికీ 150 గజాల ఇంటి స్థలం , ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా నూతన రేషన్ కార్డులను, పెన్షన్ ను వెంటనే మంజూరు చేయాలని, హనుమాపురం నుండి అనంతరం వరకు బీటీ రోడ్ వేయాలని, కురుమ గూడెం నుండి మన్నె వారి పంపు వరకు బీటీ రోడ్డు వెయ్యాలని, బస్వాపురం నుండి హాన్మపురం వరకు రోడ్డు వేయాలని, నందనం, సిరివేరి కుంట మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, అనాజిపురం నుండి జంపల్లి మధ్యలో చిన్నేరు వాగు నూతన బిడ్జి నిర్మాణం చేయాలని, నమాజ్ పల్లి నుండి తుక్కరం బీటీ రోడ్డు మార్చాలని, చీమల కొండూరు నుండి ముస్తాలపల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని, ముస్తాలపల్లి నుండి మూటకొండూర్ రోడ్డు వేయాలని, బస్వాపురం నుండి గంగసాని పల్లి వరకు రోడ్డు వేయాలని, పెంచికల్పహాడ్ వెళ్లే దారిలో అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని, ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు ఉపయోగపడే బస్వాపూర్ రిజర్వాయర్ కల్వా పై బ్రిడ్జి నిర్మించాలని, ఉసిల్ల కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని, బస్వపూర్ గ్రామంలో గతంలో కేటాయించిన ఇంటి స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మొదటి విడుదల ఇవ్వాలని డిమాండ్ల చేశారు , డిమాండ్లను పరిష్కరించని ఎడలా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం అన్నం పట్ల కృష్ణ కొండమడుగు నాగమణి మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య అబ్దుల్లాపురం వెంకటేష్ పాండాల మైసయ్య శాఖ కార్యదర్శిలు నరాల చంద్రయ్య ఏదునూరు వెంకటేష్ కూకుట్ల కృష్ణ,పార్టీ నాయకులు బండి శీను దయ్యాల మల్లేష్,బొల్లెపల్లి కిషన్ కొల్లూరు సిద్దిరాజు, కునుమ మధు, తదితరులు పాల్గొన్నారు.
Jul 30 2024, 20:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.1k