జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు: జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరవధిక సమ్మె
![]()
భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మద్దత్తు తెలిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గార్ల దృష్టికి తీసుకెళ్లిన ఏలాంటి ప్రయోజనం లేనందున కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని హాస్పిటల్ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని అయన తెలిపారు. *ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా పెరిగిన వేతనాలు, సమ్మె విరమించిన కార్మికులు..* ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసి నేటినుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్ ఏవో మసూద్, టీవీటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతినిధి శ్రీనివాస్ మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులతో కలిసి చర్చలు జరిపారు ఈ చర్చలలో కార్మికుల వేతనాలు 10,500కు పెంచుతామని, 3నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇస్తామని, అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లిస్తామని, 3 షిఫ్ట్ ల విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు ప్రతి నెల 5వ తేదీన చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉండి పోరాడుతుందని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జరిగిన సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, శానిటేషన్ కార్మికులు మేడబోయిన లక్ష్మి, గుండు వాణి, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, నరసింహ, సోమనరసయ్య, కృష్ణ, సుగుణ, కృష్ణవేణి, లావణ్య, లలిత, భారతమ్మ, హేమలత, మహేందర్, స్వప్న, బాలరాజ్, నాగరాణి, లలిత, కిరణ్, విజయలక్ష్మి, రేణుక, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
![]()


భువనగిరి పట్టణంలో 2000 మంది అర్హుల జాబితా అందరికీ మండల పరిధిలోగల హనుమాపురం సర్వేనెంబర్ 28 లో 76 ఎకరాలు బొమ్మాయిపల్లి సర్వేనెంబర్ 118 లో లేఅవుట్ చేసి స్థలాలు ఇవ్వాలి బస్వాపురంలో పట్టాలు పొందిన వారికి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు శ్రీ ఏశాల అశోక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడానికి ఒక రోజు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నివేషణ స్థలాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇండ్ల నిర్మాణానికి అర్హులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపరచాలని ముఖ్యమంత్రి గారికి శ్రీరాములు గారు విజ్ఞప్తి చేశారు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్య తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారికి పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ అర్హులైన వారి వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించామన్నారు ఏషాల అశోక్ గారు నిర్వహిస్తున్న ఉపవాస దీక్ష శిబిరాన్ని భువనగిరి తహసిల్దార్ అంజిరెడ్డి గారు సందర్శించి సమస్యలు అన్నింటిని విని పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భువనగిరి హుస్నాబాద్ భూమి ప్రభుత్వానికి తెలియపరచి నిర్ణయిస్తామన్నారు ఈ ఉపవాస శిబిరంలో 300 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ చెక్క వెంకటేష్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సోమన సబిత సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం ఉడుత రాఘవులు చింతల పెంటయ్య చిక్కా బిక్షపతి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య నాయకులు బద్దం వెంకటరెడ్డి నాగపురి యాదగిరి చొప్పరి సత్తయ్య ఎస్.కె అమీర్ చిక్క నరసయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపురం నుండి వేములకొండ కు వెళ్లే మెటల్ రోడ్డుకు మరమ్మతులుచేపట్టాలి... సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి చిత్తాపురం నుండి వేములకొండ వెళ్లే అద్వాన్నంగా మారిన మెటల్ రోడ్డు కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున సిపిఎం చిత్తాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు అద్వానమైన చిత్తాపురం వేములకొండ రోడ్డును పరిశీలించిన అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ చిత్తాపురం వేములకొండ గ్రామాల మధ్యన ఉన్న మెటల్ రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఆ రోడ్డు ద్వారా వెళ్తున్న ప్రజలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని వెంటనే నూతన మెటల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చిత్తాపురం నుండి ముద్దాపురం వరకు వెళ్లే మట్టి రోడ్డు గుంతలుగా ఏర్పడిందని దీనిపై బీటి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని పెన్షన్లు రేషన్ కార్డులు రాని వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి ఏటేల్లి నరసింహ, సహాయ కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, నాయకులు కందుల బిక్షం, భూపతి రాములు,కందుల మచ్చగిరి, నాయకులు నిశాంత్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి ,అనంతరం సూపరిండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ....* *భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు లేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో దోమల బెదడా,మరియు కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి, అర్హులైన వారందరికీ 150 గజాల ఇంటి స్థలం , ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా నూతన రేషన్ కార్డులను, పెన్షన్ ను వెంటనే మంజూరు చేయాలని, హనుమాపురం నుండి అనంతరం వరకు బీటీ రోడ్ వేయాలని, కురుమ గూడెం నుండి మన్నె వారి పంపు వరకు బీటీ రోడ్డు వెయ్యాలని, బస్వాపురం నుండి హాన్మపురం వరకు రోడ్డు వేయాలని, నందనం, సిరివేరి కుంట మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, అనాజిపురం నుండి జంపల్లి మధ్యలో చిన్నేరు వాగు నూతన బిడ్జి నిర్మాణం చేయాలని, నమాజ్ పల్లి నుండి తుక్కరం బీటీ రోడ్డు మార్చాలని, చీమల కొండూరు నుండి ముస్తాలపల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని, ముస్తాలపల్లి నుండి మూటకొండూర్ రోడ్డు వేయాలని, బస్వాపురం నుండి గంగసాని పల్లి వరకు రోడ్డు వేయాలని, పెంచికల్పహాడ్ వెళ్లే దారిలో అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని, ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు ఉపయోగపడే బస్వాపూర్ రిజర్వాయర్ కల్వా పై బ్రిడ్జి నిర్మించాలని, ఉసిల్ల కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని, బస్వపూర్ గ్రామంలో గతంలో కేటాయించిన ఇంటి స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మొదటి విడుదల ఇవ్వాలని డిమాండ్ల చేశారు , డిమాండ్లను పరిష్కరించని ఎడలా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం అన్నం పట్ల కృష్ణ కొండమడుగు నాగమణి మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య అబ్దుల్లాపురం వెంకటేష్ పాండాల మైసయ్య శాఖ కార్యదర్శిలు నరాల చంద్రయ్య ఏదునూరు వెంకటేష్ కూకుట్ల కృష్ణ,పార్టీ నాయకులు బండి శీను దయ్యాల మల్లేష్,బొల్లెపల్లి కిషన్ కొల్లూరు సిద్దిరాజు, కునుమ మధు, తదితరులు పాల్గొన్నారు.
Jul 29 2024, 17:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.2k