/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మోడీ, అమిత్ షా కోసం షర్మిల రాజకీయం Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 14:19

మోడీ, అమిత్ షా కోసం షర్మిల రాజకీయం

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న వైఎస్ జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీలో వైఎస్సార్ లేరని, వైఎస్సార్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం , గతంలో జగన్ అమ్మ ఒడి పథకంలో ప్రజలను మోసం చేశారన్నారు.

జగన్ పై షర్మిల వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ జగన్ చెప్పిన అబద్దాలను తాను కూడా నమ్మి ప్రచారం చేశానని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును మోసకారి అంటూ వైసీపీ మీడియా రాయటం విడ్డూరం అన్నారు షర్మిల.

వైఎస్ షర్మిల జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

షర్మిల రాజకీయం ఎవరికోసం? వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న షర్మిల, ఆ పని కాకుండా అదే బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ, వారి చర్యలను సమర్థిస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆమె నిజానికి బీజేపీ, టీడీపీ కోసమే రాజకీయాలు చేస్తున్నారన్నారు.

అడిగిన వారి నుండి ఆన్సర్ లేదు .. షర్మిల కు ఎందుకు మోడీ, అమిత్ షాల కోసం పని చేస్తున్నారన్నారు. తాము అడిగే ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలి కానీ.. అందుకు భిన్నంగా షర్మిల సమాధానం చెబుతున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయంలో షర్మిల పావుగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి తాము అడుగుతుంటే.. చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని.. ఇప్పుడు షర్మిలను ఉసిగొల్పారన్నారు.

చంద్రబాబును కాపాడటం కోసమే షర్మిల కామెంట్స్ మరోవైపు క్షేత్ర పర్యటనలు, శ్వేతపత్రాల విడుదల పేరుతో తప్పుడు లెక్కలు, అసత్యాలు చెబుతున్నారని, ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి అలా ఉండగా, విమర్శల నుంచి ఆయనను కాపాడడం కోసమే, ఇప్పుడు షర్మిల ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉందని అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 14:09

రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదేనా..!

తన సినిమాల్లో హీరోల్ని బెస్ట్ లుక్స్ లో ప్రజెంట్ చేస్తుంటాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తమ కెరీర్ బెస్ట్ లుక్స్ లో చూపించాడు. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు మహేష్ వంతు.

మహేష్-రాజమౌళి సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ పై విదేశాల్లో ఫొటోషూట్ కూడా జరిగింది. అయితే మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే అంశంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు దీనిపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.

అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు మహేష్. భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన మహేష్, మీడియాకు పోజులిచ్చాడు. అందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు మహేష్ ఎప్పుడూ కనిపించని మేకోవర్ ఇది.

బహుశా, రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే కావొచ్చు. సినిమా షూటింగ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఈ లుక్ లో మరికొన్ని మార్పుచేర్పులు కూడా ఉండొచ్చు.

రాజమౌళి సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడనేది మాత్రం పక్కా. ఈ లుక్ చూసి థార్ సినిమాలో హీరోలా మహేష్ ఉన్నాడంటూ పొంగిపోతున్నారు అతడి ఫ్యాన్స్.

కేవలం లుక్ పరంగానే కాకుండా, ఫిట్ నెస్ పరంగా కూడా మహేష్ ఈసారి భిన్నంగా కనిపించబోతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు, గుంటూరుకారం సినిమాల్లో స్లిమ్ గా కనిపించిన మహేష్, రాజమౌళి సినిమా కోసం కాస్త కండలు పెంచుతున్నట్టు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:27

రోజు రోజుకు పోలీస్ శాఖలో పెరుగుతున్న ఉదంతాలు.. మరో కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి

రోజు రోజుకు పోలీస్ శాఖలో ఉదంతాలు పెరుగిపోతున్నాయి. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ ఓ కానిస్టేబుల్ దగ్గర చేసుకున్నాడు.

దీంతో కానిస్టేబుల్, ఆయన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదిసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా.. తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్‌లో దొరికాయి.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు.

10 ఏండ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:24

Chandrababu : గోతుల రోడ్లకు మోక్షం

వాహనదారులకు ఇదో శుభవార్త. జగన్‌ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో పడిన ఇబ్బందులకు కూటమి సర్కారు చెక్‌ పెట్టే కార్యక్రమానికి తెరదీసింది.

రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేసి చక్కటి ప్రయాణానికి వీలుగా వాటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ను ఆదేశించింది. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచివచ్చే బూడిద(ప్లైయాష్‌) వినియోగంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని సూచించారు.

శాస్త్ర, ఇంజనీరింగ్‌ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రహదారులపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇంజనీరింగ్‌ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి, నయీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు.

ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయినట్లు తెలిసింది. ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారు? గతంలో అసలు ఏ పనీచేయలేదా? అని ఆరాతీశారు. జగన్‌ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 4,151 కిలోమీటర్ల రోడ్లపై తక్షణమే మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని, మరో 2 వేల కిలో మీటర్ల మేరకు రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీనికిగాను కనీసం రూ.350 కోట్లపైనే నిధులు అవసరం ఉంటుందని సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

4,151 కి.మీ. మేరకు రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇస్తామని ఆర్‌అండ్‌బీకి హామీ ఇచ్చారు. ఓటాన్‌ అకౌంట్‌లో ఈ నిధులు కేటాయిస్తామని, రహదారుల రిపేర్లకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా తనదృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు

థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద(ప్లైయా్‌ష)ను రహదారి మరమ్మతులకు ఉపయోగించే అంశంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బూడిదను ఉపయోగించాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రహదారులపై ఈ ప్రయోగం చేశారు. విజయవాడలోని నున్న బైపాస్‌, నెల్లూరు ఎన్‌పీఎస్‌ రోడ్డు, ప్రొద్దుటూరు రహదారులపై ప్రయోగాత్మకంగా బూడిద వినియోగంతో గుంతలు పూడ్చారు.

అయితే, ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు. గుంతలను పూడ్చేందుకు ఉపయోగించిన బూడిద బిట్‌మెన్‌, ఇతర మెటల్‌తో మిక్సింగ్‌ కావడం లేదు. దీంతో పొడివాతావరణంలో ఆ బూడిద వాహనాల రాకపోకలతో గాల్లోకి లేస్తోంది. ఈ ప్రయోగంపై ఆర్‌అండ్‌బీ ప్రజల నుంచి స్పందన కోరగా ప్రతికూలంగా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇద్దరు సీఆర్‌ఐఐకి చెందిన ఐఐటీ నిపుణులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లైన్లోకి తీసుకొని మాట్లాడారు. వారు ఇచ్చిన సూచనలతో బూడిద వినియోగంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ రూర్కీ, సీఆర్‌ఆర్‌ఐ, ఢిల్లీ, ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ అమరావతి నిపుణుల సహకారంతో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం విజయవాడ బందర్‌ రోడ్డులో ఉన్న చీఫ్‌ జస్టిస్‌ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలవడం ఇదే ప్రఽథమం.

ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో ఆగిపోయిన హైకోర్టు నూతన భవన నిర్మాణం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల పూర్తికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత హైకోర్టు భవనంలో ఇంకా అదనంగా కల్పించాల్సిన వసతులు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:06

తెలంగాణకు వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు.జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని..

వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు.

దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:02

KTR: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది..!

రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు..

హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు.

కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందని విమర్శించారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు.

వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలన్నారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 12:59

ఇక్కడ లోన్ పొందిన రైతులకు లక్ష రూపాయల మాఫీ ! ఉదయం శుభవార్త

రైతులకు ప్రభుత్వం నుంచి సకాలంలో రుణమాఫీ పథకం అందుతుంది. అదే విధంగా ఇప్పుడు బ్యాంకుల నుంచి కేసీసీ రుణం పొందిన రైతులకు రుణమాఫీ పథకం లబ్ధి చేకూరుతోంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు రుణాలు పొందిన రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి ఏళ్ల తరబడి బకాయి ఉన్న రుణాలను మాఫీ చేసిందని చెప్పవచ్చు.

ఈ లబ్ధిదారులు కూడా ఈ రుణమాఫీ పథకం కింద ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అప్‌డేట్ చేస్తుంది. ఈ లైసెన్స్‌లో పేర్లు ఉన్నవారిని ఈ రుణమాఫీ పథకం లబ్ధిదారులుగా పరిగణిస్తారు.

ఈ పథకం ద్వారా వారి లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది, రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మరియు సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో KCC పథకం ప్రవేశపెట్టబడింది. భారత ప్రభుత్వం రైతులకు 2% వడ్డీ రాయితీని మరియు 3% సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్‌ను అందిస్తుంది, తద్వారా సంవత్సరానికి 4% చాలా సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది

ఈ జాబితా ఒక నెలలోపు విడుదల చేయబడుతుంది మరియు వీటిలో మీ పేరు ఉంటే, మీరు మీ KCC లోన్ పథకం కింద 1 లక్షల వరకు రుణమాఫీని పొందే అవకాశం ఉంది, ఈ జాబితాలో ఉన్నవారు రుణమాఫీ పథకాన్ని పొందడం చాలా ముఖ్యం సర్టిఫికేట్. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 లక్ష వరకు రుణమాఫీ వంటి సమాచారాన్ని అధికారికంగా ప్రస్తావించారు.

ఈ పథకం మీ లోన్‌లో ఒక లక్ష రూపాయల మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఆర్థికంగా మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు.

ఆర్థిక ఇబ్బందులను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం మీకు సహకరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతుల కుటుంబానికి ఇది మరింత ఆనందం కలిగిస్తుంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:39

కారు’ దిగనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్

కారు’కు పంక్చర్ చేసి కాంగ్రెస్‌తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో ‘హస్తం’ కండువా కప్పుకోనున్నారు.

గతంలోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ప్రకాశ్ గౌడ్‌ను పిలుచుకుని పార్టీ మారొద్దని బుజ్జగించారు. కానీ ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం నిర్ణయించుకున్నారు.

ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్‌చార్జి మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది.

ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాశ్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కు చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ కారు పార్టీ పెద్దలకు పట్టుకున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:35

Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి: వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని తెలిపారు.

రాష్ట్ర జనాభాలో 62శాతం మంది 3.02 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్థక, డెయిరీ డెవలెప్మెంట్, మత్స్య శాఖలను తనకు చంద్రబాబు నాయుడు అప్పగించారని అన్నారు. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వమైన అత్యంత ప్రాధాన్యమైనదిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

2019 నుంచి 2024 వరకూ ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్ రెడ్డి ఈ శాఖకు తాళం వేశారని అన్నారు. వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యం కలిగింది భూమి కాబట్టి భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పడు పరీక్ష చేయలేదని చెప్పారు.

గడచిన ఐదేళ్లలో ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదని చెప్పారు. విత్తనాలు, ఎరువులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని అన్నారు. పంట అమ్ముకుంటే ఐదారు మాసాలకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని ప్రతి రైతు ధైర్యంగా ఉంటారని అన్నారు.

ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత వరకూ ఆ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ వ్యవసాయ అనుభంద రంగాలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్ని మళ్లీ పునప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అందులో భాగంగానే మూడు డిపార్ట్‌మెంట్లలో 6 ఫైళ్లపై సంతకం చేశానని వివరించారు.

వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తోంది... ఈ కార్యక్రమాన్ని 23 వ తేదీన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు పొలాల దగ్గరకు వెళ్లి రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. ఖరీఫ్‌, రబీలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండోసంతకం రైతుకు వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందిచడంపై చేశామని వివరించారు. గత ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనేమాటే ఈ రాష్ట్రంలో వినింపిచలేదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.988 కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా సబ్సిడీపై యాంత్రీకరణను ప్రోత్సహించామని చెప్పారు. ఈ ఐదేళ్లలో చివరకు కొడవలి పిడి కూడా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.