AP : జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
![]()
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది.
జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3వారాలకు వాయిదా వేసింది.


సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగింతపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ అంశంపై 3 వారాల లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి కల్కి 2898ఏడీ సినిమాతో బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నారు. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది.ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది. కల్కి 2898ఏడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో రెండు వారాల ముందుగానే స్టార్ట్ చేశారు. దీంతో మూవీ ప్రీమియర్ షోలు ఇంకా ఫస్ట్ డే చూడాలని అనుకునేవారు ముందుగానే టికెట్స్ భారీగా బుక్ చేసుకున్నారు.
DSC 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు కార్యాచరణని రూపొందిస్తోంది. రెండు రకాలుగా DSC నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా DSCకి ఓ నోటిఫికేషన్.. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా DSCకి వేరే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈనెల 30న రెండు నోటిఫికేషన్లను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది.
Jul 11 2024, 12:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.9k