కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: KGKS యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ
![]()
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టు పై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుంది. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారు వీరిలో 76 మంది చనిపోయారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. టాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి చొరవతో *సేఫ్టీ రోప్* 2022 లో యాదగిరిగుట్టలో రూపొందినప్పటికీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. తక్షణమే ఇచ్చి గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు.ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మెడికల్ బోర్డు విధానం తొలగించలేదు. *ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే వీటిపై స్పందించాలి*. టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగింది వాటిని వెంటనే అందివ్వాలి. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలి అన్నారు. *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అన్నారు.చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలి. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుని కి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. *జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు మాట్లాడుతూ* నందనములో తాటి ఉత్పత్తుల పరిశ్రమ పనులు తక్షణమే పూర్తి చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. ప్రమాద నివారణకు ఇచ్చే సేఫ్టీ మోకులు యాదగిరిగుట్ట నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆగస్టు రెండు నుండి 18 వరకు జిల్లాలో అమరుల యాదిలో కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు , గీతా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరు బాలరాజు జిల్లా కమిటీ నాయకులు ధూపట్టి వెంకటేష్ బత్తిని బిక్షం అంతటి అశోక్ గాజుల ఆంజనేయులు మచ్చ నరసింహ పాండాల మైసయ్య మట్ట బాలరాజు. కుర్మిండ్ల ఈశ్వర్.బావల పెళ్లి బాలరాజు. పులి బిక్షము. చెరుకు బాలరాజు. కొండమడుగు శ్రీనివాస్.పరకాల అంజయ్య. బొడిగ బిక్షపతి. కోలా కృష్ణ. పల్సము స్వామి.బత్తిని సత్యనారాయణ. పాండవుల లక్ష్మణ్. పబ్బతి మల్లయ్య. కొక్కొండ లింగయ్య. శ్రీరామ్మూర్తి పూజారి కుమారస్వామి. ఎర్ర రవీందర్. కునూరు మల్లేశం. గడ్డమీద నిఖిల్. గడ్డమీద సోములు. రంగ కొండల్. తదితరులు పాల్గొన్నారు.
![]()


భువనగిరి పట్టణం బాహార్ పేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ స్కూల్ లో ఎర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో హజరై డిజిటల్ క్లాస్ రూంల ప్రారంబోత్సవంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,భువనగిరి కలెక్టర్ శ్రీ జెండగే హనుమంత్ కొండిబా ,సినీ నటి మంచు లక్ష్మీ ,పిన్నపురెడ్డి శ్రీదర్. మంచు లక్ష్మి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. శాలువా తో సన్మానించారు .సరస్వతి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా 2022 నుంచి మా టీం ఇక్కడ పనిచేస్తున్నారని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గోల్కొండ బోనాల మహోత్సవంలో ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువా తో సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నామని తెలిపారు.
భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే గ్రామంలో ధ్వంసమైన ఎస్సీ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, నమాత్ పల్లి టు తుక్కాపూర్ వెళ్లే దారిని BT రోడ్డు వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శిలు మాటూరు బాలరాజు గౌడ్, దయ్యాల నరసింహలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోవారు మాట్లాడుతూ గ్రామంలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సీ కాలనీ అంతర్గత సిసి రోడ్లు పూర్తిగా గుంతల మయoమై ధ్వంసం అయ్యాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ఎమ్మెల్యే కుంభoఅనిల్ కుమార్ రెడ్డి గారు, అధికారులు తక్షణమే స్పందించి ఇస్ట్ మెంట్ వేసి సిసి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే నమాత్ పల్లి TOతుక్కాపూర్ రోడ్డు బీటీ రోడ్డు మంజూరు చేయాలని వంగాల ఎల్లయ్య బావి వద్ద పెద్ద ఎత్తున గుంతల మయం అయిందని తక్షణమే మట్టి పోసి మరమ్మతులు చేయాలని అన్నారు. అలాగే గ్రామంలో కోళ్ల ఫారాల వ్యర్ధాలు తిని వీధి కుక్కలు మనుషులను పశువులపై దాడి చేస్తున్నాయని వాటిని అరికట్టాలని, రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తాచెదారం పరిష్కరించి దోమల మందు పిచికారి చేయాలని, సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అక్కడక్కడ వీధిలైట్లు పోయాయని లైట్లు వేయాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యలపై జరగబోయే తాసిల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎల్లంల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు జిట్టా అంజిరెడ్డి, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు సుప్పంగ ప్రకాష్, సిపిఎం నాయకులు బత్తిని దానయ్య గౌడ్, ఐతరాజు కిష్టయ్య, బీనబోయిన ముత్యం ప్రకాష్ గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు
Jul 08 2024, 21:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.8k