/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:56

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:52

జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. డిఫరెంట్ లుక్‌లో హైదరాబాద్‌ రోడ్లపై దూకుడు

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా.. డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.

అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు.. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్ టీషర్ట్‌లో కనిపించిన ఆమ్రపాలి..

మరోసారి ఆ లుక్‌లో కనిపించారు. జీన్స్, టీషర్ట్‌తో హైదరాబాద రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

అనంతరం.. రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడి.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతోనూ ఆమె సరదాగా ముచ్చటించారు. కాగా.. ఆమ్రపాలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:07

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడూ పెదవి విప్పని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది.

ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కర్ని కూడా వదలబోమని హెచ్చరించింది.

ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి, సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు, తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.

కాగా, ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:05

Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది.

దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్‌లో కేటాయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 21:05

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి చేప..

ఓ రైతు నుండి 8000 రూపాయలు లంచం తీసుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట తహశీల్దార్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండల పరిధిలోని పలకపాటు గ్రామం జింకల మిట్ట తండాకు చెందిన ముడావత్ పాండు నాయక్ అనేవ్యక్తి తనకున్న వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారం షెడ్ నిర్మాణం చేశాడు. ఆ స్థలాన్ని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు ఈనెల 21వ తేదీన చాలన్ చెల్లించాడు. ఈనెల 22వ తేదీన పాండు నాయక్, అతని భార్య సౌందర్య కలిసి తహశీల్దారు వద్దకు వెళ్లి నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ కు నాలా పర్మిషన్ ఇవ్వాలని అడగగా.. తహశీల్దార్ 15వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. పాండు నాయక్ తాము అంతా ఇచ్చుకోలేమని తగ్గించాలని కోరగా పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈనెల 23వ తేదీన మరోసారి వచ్చి సార్ అన్ని డబ్బులు కూడా ఇవ్వలేము అనగా చివరగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నాలా పర్మిషన్ ఇస్తామని చెప్పడంతో పాండు నాయక్ ఇంటికి వెళ్లి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంబంధించిన వీడియోలను చూసి.. మహబూబ్ నగర్ డీఎస్పీ కృష్ణ గౌడ్ కు సమాచారం ఇచ్చి అతనిని స్వయంగా కలిశారు.

ఇందులో భాగంగా కృష్ణ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, పదిమంది ఇతర సిబ్బందితో కలిసి రైతు పాండు నాయక్ కు ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే విధంగా పథకం రూపొందించి అమలు చేశారు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన రైతు విషయాన్ని అధికారులకు తెలపడంతో వారు లోపలికి వెళ్లి తహశీల్దార్ ను అదుపులోకి తీసుకొని, 8000 రూపాయలు స్వాధీనపరచుకొని కేసునమోదు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 21:01

సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. ఆ కుట్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు అని వివరించారు. ఆ కుట్రను సహించలేక వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని, మరింత మంది వస్తారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెబుతున్నారు.. గతంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను.. సీఎల్పీని విలీనం చేయలేదా అని నిలదీశారు.

ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన నీటి పారుదల రంగంలో నిపుణులు, అందుకే అడ్వైజర్‌గా నియమించుకున్నాం. ఒకవేళ ఆదిత్యనాథ్ మా అంచనాలు అందుకోకుంటే పక్కన పెడతాం అని తెగేసి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:59

4న విద్యా సంస్థల బంద్‌ : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్‌ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్‌, దాసరి కార్తీక్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:17

కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల (Taskforce officers) దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు.

ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో మోతాదుకు మించి కలర్స్ వేస్తున్నట్లు ధ్రువీకరించారు.

హకూన మటాటా చైనీస్ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహార పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. అలాగే కిచెన్‌లో అపరిశుభ్రతమైన వాతావరణాన్ని గుర్తించారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్లు లేకుండానే రెస్టారెంట్ల నిర్వహణ జరుగుతోంది అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్ పంపించారు. అలాగే పలు రెస్టారెంట్లకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:13

విష సర్పాలకు నిలయం.. ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లారో ఇక..

సాధారణంగా పాములంటేనే ప్రజలు భయపడుతుంటారు. కాటువేస్తే ప్రాణాలు పోతాయని భావిస్తారు. అందుకని అవి తిరుగాడే చోటుకు వెళ్లడానికి సాహసించరు. కానీ ఒక ద్వీపకల్పంలో మాత్రం ఈ విష సర్పాలే అధికంగా ఉంటాయని ట్రావెలింగ్ నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇంతకీ ఆ అరుదైన ప్రాంతమేది? అనుకుంటున్నారా? దానిపేరు ‘ఇల్హాడా క్యూయిమాడ’ గ్రాండే.

అట్లాంటిక్ సముద్ర తీరంలో గల ‘ఇల్హాడా క్యూయిమాడ గ్రాండే’లో వందలూ వేలు కాదు.. లక్షల సంఖ్యలో విషపూరిత పాములు నివసిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు.

పైగా వీటిలో ‘గోల్డెన్ లాన్స్ హెడ్’ అనే పాము జాతి మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కాటు వేస్తే విషం శరీరానికి చాలా వేగంగా పాకడంతోపాటు చర్మం పాలిపోతుందట. ఇలాంటి రకరకాల పాములకు నిలయంగా ఉన్నందున ఈ దీవిని ‘కింగ్ డమ్ ఆఫ్ స్నేక్స్’ అని, ‘స్నేక్ ఐలాండ్’ అని కూడా పిలుస్తుంటారు.

ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నిపుణుల ప్రకారం.. బ్రెజిల్‌లోని సావో పాలో సముద్ర తీరం నుంచి క్యూయిమాడ గ్రాండే దీవి సుమారు 146 కి.మీ ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘వైపర్ స్నేక్స్’ కూడా ఈ ప్రాంతంలో సుమారు 3 నుంచి 4 వేల వరకుక ఉంటాయి. ఇలా రకరకాల విష సర్పాలకు నిలయంగా ఉన్నందున బ్రెజిల్ ప్రభుత్వం ‘క్యూయిమాడ గ్రాండే’ ఐలాండ్‌లో పరిశోధకులను తప్ప సాధారణ ప్రజలను, టూరిస్టులను అనుమతించడం లేదట.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:10

Bhole Baba: ఎవరీ భోలే బాబా.. అతని చరిత్ర ఏంటి.. అసలు పాదధూళీ కథేంటి?

భోలే బాబా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. హత్రాస్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో ఆ బాబా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పాదధూళీ కోసం భక్తులు..

ఆయన అసలు పేరు సూరజ్‌ పాల్‌. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటా జిల్లా, పటియాలి తహసీన్‌లోని బహదూర్ గ్రామంలో పుట్టాడు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేశాడు. ఓవైపు పొలం పనులు చేస్తూనే.. మరోవైపు విద్యాభ్యాసం కొనసాగించాడు. తన చదువు పూర్తి చేసుకున్నాక.. రాష్ట్ర పోలీసు శాఖలో చేరాడు. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కేసుల్లో 1997లో అరెస్టై.. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన పేరుని నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి..

క్రమంగా జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే బాబాగా పాపులారిటీ వచ్చేయడంతో.. సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తో పాటు హత్రాస్‌లోనూ.. ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహించేవాడు. ఇందుకు వేల సంఖ్యలో, కొన్ని లక్షల్లోనూ భక్తులు హాజరవుతుంటారు. కొవిడ్ సమయంలో ఆయన పేరు దేశమంతా వినిపించింది. ఆ సమయంలో ఓ సత్సంగ్ కార్యక్రమంగా నిర్వహించగా.. ఏకంగా 50 వేల మంది వచ్చారు. దీంతో అది వివాదాస్పదమైంది.

మంగళవారం భోలే బాబా హత్రాస్ జిల్లాలోని పుల్‌రయీ గ్రామంలో ఓ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు 80వేల మందికే అనుమతి ఇచ్చారు కానీ.. 2.5 లక్షల మంది వరకు తరలివచ్చారు. తన ప్రవచనాలు ముగించుకొని భోలే బాబా కారులో వెళ్లిపోయాడు. అయితే.. ఆయన వాహనం ఏ మార్గంలో వెళ్లిందో, ఆ మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్దవం లభిస్తుందని భక్తులు నమ్మారు. ఆ నమ్మకంతో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.