/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz జిల్లా గురుకులాల సమస్యలను పరిష్కరించలేని ఆర్ సి ఓ ను సస్పెండ్ చేయాలి, సమస్యల వలయంలో మోత్కూర్ గురుకులం :AISF Vijay.S
VijayaKumar

Jul 02 2024, 22:01

జిల్లా గురుకులాల సమస్యలను పరిష్కరించలేని ఆర్ సి ఓ ను సస్పెండ్ చేయాలి, సమస్యల వలయంలో మోత్కూర్ గురుకులం :AISF

విద్యార్థి యువనజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గురుకుల బాలుర పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గత రెండు రోజులుగా మోత్కూర్ గురుకుల బాలుర హాస్టల్ లో కనీసం మెను పాట్టించుకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా అధికారులు పూర్తిగా విఫలమైనారు అన్ని ఆరోపించారు.* *అదే విధంగా నాసిరకం పాల ప్యాకెట్లను పాలను విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపించారు.* *పూర్తిగా కాంట్రాక్టర్లు అధికారుల పర్యవేక్షణలో పాఠశాల నడుస్తుందని అన్నారు.* *పాఠశాల చుట్టూ కనీసం ప్రహరీ గోడ లేకుండా లక్షల రూపాయలను ప్రతి నెల బిల్డింగ్ యాజమాన్యానికి కడుతున్నారు తప్ప కనీసం బిల్డింగ్ మరమ్మతులు చేపియడంలో పూర్తిగా విఫలమైనారు అన్ని ఆరోపించారు.* *విద్యార్థులకు కనీసం మినరల్ వాటర్ సౌకర్యం కల్పించలేని వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని అన్నారు.* *తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు..* *ఈ కార్యక్రమంలో SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ బుర్రు అనిల్ కుమార్, AISF జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతికుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్,అనిల్,శ్రీకాంత్,ప్రవీణ్, వెంకటేష్,రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 18:02

భువనగిరి: సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా 9వ వార్షికోత్సవ వేడుకలు

తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకొని, ఎన్నో సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కారం చేసిన సుమన్ టీవీ తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరం లోనికి ప్రవేశిస్తున్న సందర్భంగా సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాయగిరి లోని సహృదయ వృద్ధాశ్రమంలో ఎస్ టీవీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ సుమన్ టీవీ ఎస్ టీవీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమై కొద్ది కాలమే అయినా , ఎన్నో మానవీయ కథనాలు, ఇన్వెస్టిగేషన్ కథలు అందించి అందరి అభిమానాన్ని పొందారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, ప్రతి పేదవాడికి సుమన్ టీవీ అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు సురుపంగ ప్రకాష్, గడ్డమీద శేఖర్ తదితరులు సుమన్ టీవీ యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ టీవీ సిబ్బంది శరత్ చంద్రారెడ్డి, సతీష్ రెడ్డి, పిట్టల అరుణ్, ప్రవీణ్, మాధవరెడ్డి, సహృదయ వృద్ధాశ్రమంలోని వృద్దులు పాల్గొన్నారు.


VijayaKumar

Jul 02 2024, 17:40

వలిగొండ : రేషన్ కార్డులు ,నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలి : సిపిఎం డిమాండ్

రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను, 60 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు సిపిఎం నిర్వహిస్తున్న రెండవరోజు 'పోరుబాట' కార్యక్రమంలో భాగంగా మంగళవారం దాసిరెడ్డిగూడెంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేదలకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల రేషన్ బియ్యం తో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాలకు వారు దూరమవుతున్నారన్నారు,మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అనేకమంది వృద్దులు 60 సంవత్సరాలు నిండిన తమకు పెన్షన్ అందక ఎదురుచూపులు చూస్తున్నారని 60 సంవత్సరాలు నిండిన వారందరికీ వెంటనే నూతన పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు,దాసిరెడ్డిగూడెం నుండి రేపాకు కు వెళ్లే రోడ్డులో ఉన్న కల్వర్టులు వర్షాకాలం సమయంలో నీరు చేరడం వల్ల ఆరోడ్డు మార్గంలో వెళ్లే రేపాక,కంచనపల్లి గ్రామాల ప్రజలకు,ప్రయాణికులు ప్రయాణం చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెంటనే రెండు కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో కొత్త కాలనీలో ఉన్న ఎస్సీ కాలనీలో ఓపెన్ డ్రైనేజీ వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఓపెన్ డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చాలని డిమాండ్ చేశారు దాసిరెడ్డిగూడెం నుండి వలిగొండ కు వచ్చే మార్గంలో మూలమలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు లేక అనేక ప్రమాదాలు జరిగాయని వాటిని ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి కొమ్ము స్వామి, నాయకులు ఫాలోజు శంకరాచారి,కందుల బాలయ్య,అశోక్ నరసయ్య,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

VijayaKumar

Jul 02 2024, 17:36

భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే పైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్

భువనగిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ దగ్గర హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారి పైన అండర్ పాస్ నిర్మాణం తక్షణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుబాటలో భాగంగా భువనగిరి పట్టణం నుండి పెంచికలపహాడ్, కృష్ణాపురం గ్రామాలతో పాటు మూడు మండలాలు 24 గ్రామాలకు వెల్లెడానికి ఉన్న రోడ్డు జాతీయ రహదారి దాటడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్షణం అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ భువనగిరితో పాటు వలిగొండ, ఆత్మకూరు మండలాలలోని 24 గ్రామాల ప్రజలు అవసరాల కోసం భువనగిరి కి హైదరాబాద్ కు వివిధ గ్రామాలకు వేలాదిమంది రైతులు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు రాకపోకలు ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు. భువనగిరి ఐటిఐ దగ్గర రోడ్డు దాటే సందర్భంలో అండర్ పాస్ లేకపోవడం వల్ల ఇప్పటికి 100 మంది పైగా యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నారని, వందలాదిమంది కాళ్లు చేతులు విరిగి శత గాత్రులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. పాలకులు ఎన్నికలప్పుడు వివిధ సందర్భాలలో ప్రజలను మభ్య పెట్టడం ఓట్లు దండుకోవడం గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రోడ్డు వేసినాడే నేషనల్ హైవే దాటడానికి తమ గ్రామాలకు పోయి రావడానికి ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయవలసిన అవసరం, ఏర్పాటు చేయించే బాధ్యత ఆనాడు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు బాధ్యత తీసుకొని ఈ నేషనల్ హైవే ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, సిపిఎం నాయకులు వడ్డబోయిన వెంకటేష్, గుండెబోయిన దానయ్య, గ్రామ ప్రజలు సిరికొండ కృష్ణ, సిలువేరు రాజు, భువనగిరి నరసింహ, బసాని కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 17:33

తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పలు గ్రామాల్లో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.అనంతరం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పై నిర్వహించిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు.. తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వ్యాపార సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మండలంలోని జగ్గయ్య తండాలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత వాసాలమర్రి గ్రామంలో కమ్యూనిటీ హాల్ భవనం మల్టీపర్పస్ భవనాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఏ రైతు ఇబ్బంది పడకుండా నిజమైన వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు.కొండలు, గుట్టలు,వెంచర్ లు ఉన్నవారికి రైతు భరోసా కాదన్నారు.గతంలో మాదిరిగా రైతు లు ఇబ్బంది పడకుండా రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలను అందేటట్లు చేస్తామన్నారు.రైతును రాజు చేసే ఈ రైతు భరోసా ను దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి  చేపట్టారన్నారు. కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించాలని రైతులను కోరారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ప్రతిగ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.గ్యారెంటీ లతో పాటు గ్రామంలో పలు భవనాల నిర్మాణాలు,రోడ్ల నిర్మాణాలు చేపట్టి మండలాలను గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు.

VijayaKumar

Jul 02 2024, 17:28

హైవే పై గ్రామాలు ఉన్నచోట సర్వీస్ రోడ్డు వేయాలి: సిపిఎం డిమాండ్

భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణ గిరి , ఎల్లమ్మ టెంపుల్ వద్ద హైవే రోడ్డుకు వీరువైపులా సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ఈ రోడ్డు దేవస్థానకు ప్రతిరోజు వచ్చే వేలమంది భక్తులు హైవే మీద వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రాణాలు కొలుపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు...* *ఈరోజు సిపిఎం పోరు యాత్రలో భాగంగా అనంతరం రైల్వే బ్రిడ్జి వద్ద ఆగిపోయిన సర్వీసు రోడ్డును సిపిఎం పట్టణ నాయకులతో కలిసి పరిశీలించారు, హైవే హైవే వెంట గ్రామాల్లో ఉన్న చోట సర్వీస్ రోడ్లు ఉండాలని నిబంధనలు ఉన్న కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేశారు, దీనితో రోడ్డు దాటే సమయంలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి, రోడ్డుకు ఇరువైపులా బ్రిడ్జిని నిర్మించి, సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు , స్వర్ణ గిరి ఎల్లమ్మ టెంపుల్ రోడ్డు దాటడానికి హైవేపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు,బిజెపి కేంద్ర మంత్రులు వెంటనే సందర్శించాలని, నిధులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ , పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు పట్టణ నాయకులు ఎల్లయ్య వల్దాస్ అంజయ్య బాలకృష్ణ లావుడియ రాజు, చింతల శివ ,కొత్త లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 02 2024, 12:53

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులను ఆదుకోవాలి: మందడి రంజిత్ రెడ్డి BJYM వలిగొండ మండల అధ్యక్షుడు

వలిగొండ మండల కేంద్రంలో  భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం వలిగొండ మండల తహసిల్దార్ గారికి నిరుద్యోగులను ఆదుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిరుద్యోగులకు వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించి అందులో మహిళలకు 33% ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని రాష్ట్రప్రభుత్వం వెంటనే చెల్లించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేయడం జరిగింది, గ్రూప్ 2 ,3 పోస్టులను పెంచి వెంటనే పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, వలిగొండ మండల అధ్యక్షులు బోళ్ళ సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు హరీష్ రామకృష్ణ, మండల కార్యదర్శి మైసొల్ల మచ్చగిరి, మందుల నాగరాజు,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెలిమినేటీ వెంకటేష్ ,బర్ల మల్లేశం, వెంకటేశం, దండం మోహన్ రెడ్డి, రేగు శ్రీధర్, కీర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 01 2024, 19:13

రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ లో జాతీయ వైద్యుల దినోత్సవం, శుభాకాంక్షలు తెలిపిన 8వ వార్డ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ కు భువనగిరి 8 వ వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్న డాక్టర్లు బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి కొనియాడారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. భువనగిరి రాధాకృష్ణ మూర్తి హాస్పటల్లో డాక్టర్ డే సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన డాక్టర్‌ రాధాకృష్ణ మూర్తి అని అన్నారు. వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు.. పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి అన్నారు రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పేర్కొన్నారు. . ఈ క్రమంలో డాక్టర్లు, ఈఎస్ఐ హాస్పటల్ సూపర్డెంట్ ప్రశాంత్ కుమార్, కర్ణాకర్, రిత్విక్ ,మధు ,రాజు కుమార్ ,సాయి, మహేష్, నర్సులు, స్వప్న ,అశ్విని,అనుష ,శ్రీలత,పల్లవి, భార్గవి, భవాని, ఆయమ్మలు సిబ్బంది పాల్గొన్నారు.



VijayaKumar

Jul 01 2024, 18:24

భువనగిరి: ముత్తిరెడ్డిగూడెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రారంభించిన క్రీడా ప్రాంగణంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ వాలీబాల్ ఆడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ముందుగా ఆయనకు గ్రామ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. యువత అంతా సరైన మార్గంలో పయనిస్తూ జీవితంలో మంచి అలవాట్లు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యువతకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి జెడ్పిటిసి బీరు మల్లయ్య స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

VijayaKumar

Jul 01 2024, 18:20

భువనగిరి : జిల్లా కేంద్రంలో ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, నాయకులు వెంకట రాజయ్య, బోనాల విజయ్, మేకల కృష్ణ, శ్రీహరి ముదిరాజ్, రాములు తదితరులు  పాల్గొన్నారు.