కామ్రేడ్ వేముల మహేందర్ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దాం : వ్య.కా.స రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు పిలుపు
![]()
సంపద సృష్టిస్తున్న వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల చట్టం అమలు కోసం, సమగ్ర చట్టం కోసం అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ గారి మూడవ వర్ధంతి స్ఫూర్తితో విస్తృతమైన పోరాటాలను కొనసాగిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా "వ్యవసాయ కార్మికులు-కనీస వేతనాల చట్టం అమలు " పై జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షత సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వెంకట్రాములు పాల్గొని వేముల మహేందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను ప్రతి సంవత్సరం రివైజ్ చేసి, సవరణ చేసి అమలు చేయవలసిన బాధ్యత వారి పైన ఉన్నదని అన్నారు. కానీ సంవత్సరాల గడుస్తున్న కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారు విమర్శించారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కనీస వేతనాలు చట్టాన్ని సవరణ చేయించి గ్రామాలలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారం చేయవలసిన అవసరం ఉందని వారు అన్నారు.ఇప్పటికే వ్యవసాయ కార్మికులకు సరైన పనిగంటలు లేక సరైన వేతనం లేక అర్థాకళితో జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వము ఇప్పటికైనా సమగ్ర చట్టం రూపొందించి అందులో వ్యవసాయ కూలీలకు 6 గంటల పని, రోజు కూలి 600 రూపాయలు, బీమా సౌకర్యం, విద్యా, వైద్యమం, అభివృద్ధి, సంక్షేమము లాంటివి చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేసినారు. కేంద్రంలోని బిజెపి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి దానిమీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్నదని, పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలకు జీవితాంతము నాయకత్వం వహించి పోరాడిన మహా పోరాట యోధులు వ్యవసాయ కార్మికుల ఉద్యమ నాయకులు అమరజీవి వేముల మహేందర్ స్ఫూర్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గార్లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మహేందర్ పేద కుటుంబంలో పుట్టి ఎర్రజెండా నాయకత్వంలో అనేక కూలీ, భూమి, సామాజిక ఉద్యమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచాడని వారి స్ఫూర్తితో వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలలో పనిచేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుపుల వివేకనంద, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపెళ్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య చింతకాయల నర్సింహ, ఎర్ర ఊషయ్య, బోయ యాదయ్య, పిట్టల శ్రీను, మానే సాలయ్య, రాపోతు పద్మ , ముత్యాలు, బాలరాజు ఇతరులు పాల్గొన్నారు.
![]()
![]()

ఇప్పటికే వ్యవసాయ కార్మికులకు సరైన పనిగంటలు లేక సరైన వేతనం లేక అర్థాకళితో జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వము ఇప్పటికైనా సమగ్ర చట్టం రూపొందించి అందులో వ్యవసాయ కూలీలకు 6 గంటల పని, రోజు కూలి 600 రూపాయలు, బీమా సౌకర్యం, విద్యా, వైద్యమం, అభివృద్ధి, సంక్షేమము లాంటివి చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేసినారు. కేంద్రంలోని బిజెపి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి దానిమీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్నదని, పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలకు జీవితాంతము నాయకత్వం వహించి పోరాడిన మహా పోరాట యోధులు వ్యవసాయ కార్మికుల ఉద్యమ నాయకులు అమరజీవి వేముల మహేందర్ స్ఫూర్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గార్లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మహేందర్ పేద కుటుంబంలో పుట్టి ఎర్రజెండా నాయకత్వంలో అనేక కూలీ, భూమి, సామాజిక ఉద్యమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచాడని వారి స్ఫూర్తితో వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలలో పనిచేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుపుల వివేకనంద, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపెళ్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య చింతకాయల నర్సింహ, ఎర్ర ఊషయ్య, బోయ యాదయ్య, పిట్టల శ్రీను, మానే సాలయ్య, రాపోతు పద్మ , ముత్యాలు, బాలరాజు ఇతరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి చౌటుప్పల్ మోత్కూర్ వలిగొండ తదితర మండలాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదన గురి చేస్తున్నారు.
అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ బెల్ట్ బూట్లు తదితర వస్తువుల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ సమస్యలపై గతంలో అనేకమార్లు డీఈవో దగ్గరికి తీసుకువెళ్లిన కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఆరు మండలాలకు ఓకే ఎంఈఓ ఉండడం వలన పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ పాఠశాలలు దోపిడికి అలవాటు పడ్డారు అని అన్నారు జిల్లాలో అన్ని మండలాలకు ఎంఈఓ లను నియమించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయానికి సర్వీసు రోడ్డు నిర్మించి విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, నవీన్, భరత్ వినిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు *గుండెబోయిన సురేష్, బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ , ఉమ్మడి జిల్లా bc యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం ,మహేందర్ గౌడ్,వనిత,దర్శన్ ముదిరాజ్,వెంకట్ ప్రజాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెలువర్తి,మొగిలిపాక,కెర్చిపల్లి గ్రామాల ప్రజలు నిత్యం వలిగొండ మండల కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చిపోతు ఈ రోడ్డుపై మురికి నీరు పారుతుండటంతో గుంతలుపడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే అనేకమంది ప్రయాణికులు ఈ గుంతల్లో పడి గాయాల పాలైనరని అన్నారు సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెంటనే పాడైపోయిన అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టి రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు కారణంగా పాడై గుంతలుపడిన బీటీరోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, సిపిఎం పట్టణ నాయకులు వేముల లక్ష్మయ్య,కొండూరు సత్తయ్య,ఎండి షాహిద్, గ్రామ ప్రజలు పల్లెర్ల లక్ష్మయ్య,భిక్షపతి, నరసింహ,తదితరులు పాల్గొన్నారు
Jun 21 2024, 21:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.9k