/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కల్పించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన టీజేయు అధ్యక్షులు ఎండి షానూర్ బాబా Vijay.S
VijayaKumar

Jun 14 2024, 16:39

జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కల్పించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన టీజేయు అధ్యక్షులు ఎండి షానూర్ బాబా

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే కలిసి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ కల్పించాలని వినతి పత్రం అందజేశారు* దానికి వారు సానుకూలంగా స్పందించి రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్, జర్నలిస్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 14:44

ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో మున్సిపాలిటీ లు అభివృద్ధికి నోచుకోలేదు పేరుకే మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు కనీసం మున్సిపాలిటీ లకు సొంత భవనాలు కూడా నిర్మించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అర్బన్ డెవలప్మెంట్ నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి మా ప్రభుత్వం ముందు చూపుతో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, కౌన్సిలర్ లు కో ఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 13:18

కొండమడుగు లో బడిబాట కార్యక్రమం లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం లోని మండల ప్రాథమిక పాఠశాల లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు స్థానిక ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.... ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ బడి బాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ఒక లక్ష్యం తో ముందుకు వెళుతుంది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. బీబీనగర్ ఏమ్స్ లో సమస్యల గురించి స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎయిమ్స్ కి వస్తా రివ్యూ నిర్వహిస్త . ప్రభుత్వం అందిస్తున్న విద్యలో నాణ్యత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలి. ప్రైవేటు టీచర్స్ మాదిరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి . ఉచిత విద్య, ఉచిత యూనిఫారంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, అర్హులైన ఉపాధ్యాయులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, స్కాలర్ షిప్స్ ,రవాణా చార్జీలు, బాసర ఐఐఐటి లో ఉచిత ప్రవేశాలు మొదలైన సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తో పనిచేయాలని కోరారు . పాఠశాల మరియు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడానికి పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అనే పట్టుదల తో ఉన్నాం . స్థానిక సమస్యల గురించి సిఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాను. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తొలి సారి కొండమడుగు బడి బాట రావడం చాల అదృష్టంగా భావిస్తున్నాను. సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సునీత , స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,బీబీనగర్ ఎంపిపి సుధాకర్ ,ZPTC గోలి ప్రణిత పింగల్ రెడ్డి , PACS చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి , DRDO కృష్ణన్,స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 13 2024, 19:59

రైతు సహకార సంఘం ఉప ఎన్నికల్లో ఆత్మకూరు మండలానికి వైస్ చైర్మన్ పదవి

ఆత్మకూరు ఎం: మోత్కూరు రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి పై అవిశ్వాసం నెగ్గడం అనంతరం డిసిఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోత్కూరు రైతు సహకార సంఘం ఉప ఎన్నికలో మోత్కూరు రైతు సహకార సంఘం  పరిధి ఆత్మకూరు ఎం మండలం కప్రాయిపల్లి డైరెకర్ బండ పద్మ ఐలయ్య గారు వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి,  స్థానిక పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి,రహింఖాన్ పేట డైరెక్టర్ తాల్లపల్లి స్వామి(మోత్కూరు పాక్స్),
  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, మండల  నాయకులు తండ శ్రీశైలం గౌడ్, కట్టెకొల హన్మంతు గౌడ్, భాషబోయిన పాపయ్య, జన్నాయికోడె నగేష్, సామ శ్రీనివాస్ రెడ్డి, కందడి దశరథ రెడ్డి , పోతగాని మల్లేశం, వెంకట్ రెడ్డి, భూపతి ఆనంద్, బండ కృష్ణ, కొంగరి రాజు, బొట్ల అనిల్, కొంగరి యాదయ్య, కొంగరి పరుష రాములు, కొంగరి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 13 2024, 16:19

భీమా తో కార్యకర్తల కుటుంబాలకి భరోసా: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు అన్నారు. ఇటీవల ప్రమాదాల బారిన పడి మరణించిన నకిరేకల్ మున్సిపాలిటీ 1వ వార్డ్ కీ చెందిన బొడ్డు సైదులు గారు మరణించగా వారి సతీమణి బొడ్డు మంగమ్మ గారికి *రూ.2లక్షల బీమ చెక్కును* *మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు* చేతుల మీదుగా కార్యకర్తల కుటుంబీకులకు పంపిణి చేశారు కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.

VijayaKumar

Jun 13 2024, 15:46

చిత్తాపురంలో కొల్లు నర్సిరెడ్డి ప్రధమ వర్ధంతి సభ లో పాల్గొన్న సిపిఐ నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామంలో హత్యకు గురి అయిన కొల్లు నర్సిరెడ్డి ప్రధమ వర్ధంతి సభ చేగూరి పాపయ్య గారి అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గోదా శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్గొని గ్రామంలో స్తూపం ఆవిష్కరించి జండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హత్యకు గురిఅయిన నర్సిరెడ్డి గారి అంతకులను తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని అకాలనంగా హత్య చేశారని అన్నారు. నర్సిరెడ్డి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, మాజీ శాసనసభ్యులు గుర్రం యాదగిరి రెడ్డి గారి అనుచరులుగా ఉండి రైతుల కు ట్రాన్స్ఫార్మర్లు , నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు గ్రామంలో పక్కా రోడ్లు కోసం కృషి చేశారని అన్నారు. గ్రామంలో మండలంలో పార్టీ కోసం నిర్మాణం చేయుటకు కార్యకర్తలని సంసిద్ధం చేశారని అన్నారు. మోడీ మత రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని పలు రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు సామాజిక కార్యకర్తలపై దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుచున్నప్పటికీ చర్యలు తీసుకోవటం లేదు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ మాట్లాడుతూ* సమ సమాజం నిర్మాణం కోసం నర్సిరెడ్డి గారు అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, నర్సిరెడ్డి భార్య కుమారులు ఇందిర, శంకర్, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ళ యాదిరెడ్డి, ఎలగందుల అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంజి వీరస్వామి,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్,సల్వాద్రి రవీందర్,నరీగే యాదయ్య, మచ్చ లక్ష్మీనారాయణ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, రాచమల్ల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 13 2024, 13:20

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణస్వీకారం
హైదరాబాద్ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరై తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ , మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

VijayaKumar

Jun 12 2024, 20:01

యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం

యాదాద్రి ఆలయ అధికారులతో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై,భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో మాట్లాడారు.దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్డు నిర్మాణంతో వారు ప్రశాంతంగా ఉంటున్నారని ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.అదే విధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు.స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. డార్మెంటరీ హాల్ లో పడుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండేందుకు హల్ పెంచుతున్నట్లు,తెలిపారు.అన్నదాన సత్రంలో 1000మంది భక్తులు భోజనం చేసేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.దాంతో పాటు కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.గూడురూ టోల్ గెట్ నుండి రాయగిరి కమాన్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.మెట్ల మార్గంపై సోలార్ షెడ్ నిర్మాణం చేసి నీటి సౌకర్యం తో పాటు,మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు.ఆలయంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని వారికి ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.దాంతోపాటు యాదాద్రిలోని పలు కూడళ్లలో స్వామివారి పేర్లతో నామకరణం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. ఎల్ఇడి స్క్రీన్స్ ద్వారా ఆలయంలో జరిగే పూజలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.అదేవిధంగా మీడియా వారికి మీడియా పాయింట్ కూడా ఏర్పాట్లు చేయునట్లు తెలిపారు.

VijayaKumar

Jun 12 2024, 19:15

ఇంద్రపాలనగరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేసిన ఎంపీపీ పూస బాలమణి - బాల నర్సయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామం లో వేసవి సెలవుల ముగిసిన వేల పాఠశాలలు ప్రారంభం అయినా సందర్బంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం కొత్త టెక్స్ట్ బుక్స్ మరియు డ్రస్సులు పంపణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు పంపణి చేసిన రామన్నపేట మండల ఎంపీపి పూస బాలమణి - బాలనర్సయ్య మరియు గ్రామపంచాయితీ స్పెషల్ అధికారి అంజిరెడ్డి  పంచాయతీ సెక్రటరీ sk రసుల్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల మేరీ  మరియు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది .ఎంపీపి  మాట్లాడుతూ....

నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుంది విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని మీ కుటుంబానికి మన గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ కు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకరండీ ఆ సమస్య పరిష్కరానికి నేను ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది .పంపణి అనంతరం నూతనంగా ఎన్నికనా ఎంపీపీ కి పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.


VijayaKumar

Jun 12 2024, 18:52

గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం ...పాఠశాలకు రూ. 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి

గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం .... పాఠశాలకు 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి... నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామ పరిధిలో యుపిఎస్ గౌస్ నగర్ పాఠశాలలో బుధవారం ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశంను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరితా దేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌస్ నగర్ స్పెషలాఫీసర్ అంబిక హాజరై, మాట్లాడారు. ఎర్రంబెల్లి, గౌస్ నగర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాటుగా గ్రామంలోని పుర ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ , వర్క్ బుక్స్ నోట్ బుక్స్ ను అందజేశారు. పాఠశాలకు విరాళంగా 25000 ఎలిమినేటి వెంకటరెడ్డి అందజేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో ఉత్తమ ప్రతిప కనబరచిన తెలుగు, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరితా దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, అంజన్ కుమార్, తాజా మాజీ ఉపసర్పంచ్ సాయి రెడ్డి పోసి రెడ్డి, శ్రీకృష్ణ గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్, గడసందుల సత్తయ్య, పాక వెంకటేష్ యాదవ్, భూషబోయిన నరసింహ, భూష బోయిన శ్రీశైలం, గడసందుల కృష్ణ, నల్ల మాస్ కుమార్, గడసందుల మధు , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.