/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఇంద్రపాలనగరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేసిన ఎంపీపీ పూస బాలమణి - బాల నర్సయ్య Vijay.S
VijayaKumar

Jun 12 2024, 19:15

ఇంద్రపాలనగరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేసిన ఎంపీపీ పూస బాలమణి - బాల నర్సయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామం లో వేసవి సెలవుల ముగిసిన వేల పాఠశాలలు ప్రారంభం అయినా సందర్బంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం కొత్త టెక్స్ట్ బుక్స్ మరియు డ్రస్సులు పంపణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు పంపణి చేసిన రామన్నపేట మండల ఎంపీపి పూస బాలమణి - బాలనర్సయ్య మరియు గ్రామపంచాయితీ స్పెషల్ అధికారి అంజిరెడ్డి  పంచాయతీ సెక్రటరీ sk రసుల్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల మేరీ  మరియు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది .ఎంపీపి  మాట్లాడుతూ....

నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుంది విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని మీ కుటుంబానికి మన గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ కు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకరండీ ఆ సమస్య పరిష్కరానికి నేను ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది .పంపణి అనంతరం నూతనంగా ఎన్నికనా ఎంపీపీ కి పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.


VijayaKumar

Jun 12 2024, 18:52

గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం ...పాఠశాలకు రూ. 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి

గౌస్ నగర్ లో విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశం .... పాఠశాలకు 25000 విరాళం అందజేసిన ఎలిమినేటి వెంకట్ రెడ్డి... నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామ పరిధిలో యుపిఎస్ గౌస్ నగర్ పాఠశాలలో బుధవారం ప్రారంభోత్సవ వేడుక, తల్లిదండ్రుల సమావేశంను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరితా దేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌస్ నగర్ స్పెషలాఫీసర్ అంబిక హాజరై, మాట్లాడారు. ఎర్రంబెల్లి, గౌస్ నగర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాటుగా గ్రామంలోని పుర ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ , వర్క్ బుక్స్ నోట్ బుక్స్ ను అందజేశారు. పాఠశాలకు విరాళంగా 25000 ఎలిమినేటి వెంకటరెడ్డి అందజేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో ఉత్తమ ప్రతిప కనబరచిన తెలుగు, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరితా దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, అంజన్ కుమార్, తాజా మాజీ ఉపసర్పంచ్ సాయి రెడ్డి పోసి రెడ్డి, శ్రీకృష్ణ గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్, గడసందుల సత్తయ్య, పాక వెంకటేష్ యాదవ్, భూషబోయిన నరసింహ, భూష బోయిన శ్రీశైలం, గడసందుల కృష్ణ, నల్ల మాస్ కుమార్, గడసందుల మధు , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 12 2024, 17:57

ప్రభుత్వ పాఠశాల నెంబర్ .2 భువనగిరి,లో బడిబాట కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గాంధీ నగర్  పాఠశాల  రీఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులు పాఠశాలకు ఆహ్వానించి పుష్పగుచ్చాలతో స్వాగతం ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు నిర్వహించబడుచున్నాయి మన ఊరు మనబడి కింద పాఠశాల లో అన్ని వసతులు సమకూర్చడం జరిగింది కావున విద్యార్థులందరూ అధిక సంఖ్యలో ఈ పాఠశాలలో చేరి చదువుకోగలరని మరియు మీ వాడలో ఉన్న విద్యార్థులను కూడా ఈ పాఠశాలలో జాయిన్ చేయాలని కోరనైనది. క్రమశిక్షణకు మారుపేరుగా అంకితభావంతో పనిచేసే టీచర్లు ఈ పాఠశాలలో ఉన్నందువలన పిల్లలు ఎక్కువ సంఖ్యలో చేరాలని కోరారు. ఈరోజు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలను అందంగా అలంకరించి పిల్లలకు ఉత్సాహంగా ఉండేటట్లు పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు వ డిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్  మరియు ఈ పాఠశాలకు సంబంధించిన మరొక కౌన్సిలర్ పంగరెక్కస్వామి  బీచ్ మహల్ల పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్  మాజీ ఎంఈఓ రఘు వర్ధన్  సి ఆర్ పి ఎఫ్ అధ్యక్షులు వినోద్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ గారు జిటిఏ సంఘ అధ్యక్షులు పాశం కృష్ణమూర్తి గారు ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలు అధిక సంఖ్యలో పాఠశాలలో జాయిన్ కావాలని కోరనైనది.


VijayaKumar

Jun 12 2024, 17:43

ఆలేరు పట్టణంలో బడిబాట కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే పాల్గొని బడిబాట పోస్టర్ కరపత్రాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి పిల్లలు అందరూ బడికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు , అర్హతలు గల ఉపాధ్యాయుల చే విద్యాబోధన చేయబడుతుందని అన్నారు.

VijayaKumar

Jun 12 2024, 17:20

వలిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్

వలిగొండ మండలం 37 గ్రామపంచాయతీ లతో జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉండడంతోపాటు విద్యుత్,వ్యవసాయ మోటర్లపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మండల రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం మండల కేంద్రంలో అందుబాటులో లేక భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు రామన్నపేటకు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లడానికి రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని వేలాది రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తుందని వెంటనే వలిగొండలో స్థానిక సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం కోసం డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగాపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన దొడ్డు,సన్న తేడా లేకుండా అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని,రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక గ్రామాలకు లింక్ రోడ్లుగా ఉన్న గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలను ప్రయాణికులను,రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు వెంటనే సుంకిశాల నుండి వెల్వర్తి వరకు, వెలువర్తి నుండి ఆరూరు వరకు, కెర్చిపల్లి నుండి పులిగిల్ల వరకు,గోకారం నుండి నెలపట్ల వరకు,అరూర్ నుండి తుర్కపల్లి వరకు, బీటి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా ధర్మారెడ్డి పల్లి కాలువ వెంట ఉన్న కల్వర్టులను,తూములు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు నూతన కల్వర్టులు,తూములను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు,కందడి సత్తిరెడ్డి,మొగిలిపాక గోపాల్, వాకిటి వెంకట్ రెడ్డి,కొండే కిష్టయ్య,కర్ణ కంటి యాదయ్య, కవిడే సురేష్,దుబ్బ లింగం,భీమనబోయిన జంగయ్య,చీర్క మల్లారెడ్డి,దయ్యాల సత్యరాములు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 12 2024, 14:25

హజ్ కమిటీ సభ్యులు షర్పోద్దీన్ ను సన్మానించిన మైనార్టీ నాయకులు

హజ్ కమిటీ సభ్యులు షర్ఫోద్దీన్ ను సన్మానించిన మైనారిటీ నాయకులు షానూర్ బాబా* ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కి చెందిన మహమ్మద్ షర్ఫుద్దీన్ కి ఇటీవల తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా నియామకమైన సందర్భంగా బుధవారం రోజున ఆలేరులో మైనార్టీ డెవలప్మెంట్ కమిటీ ఆఫీషియల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ షానూర్ బాబా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు జహంగీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 12 2024, 13:42

విద్యార్థులకు పుస్తకాలు , నోట్ బుక్స్ ,యూనిఫామ్ అందజేసిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న ప్రజల మనిషి రాజన్న* చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, చిన్న కొండూరు రోడ్డు జిల్లా పరిషత్ హై స్కూల్, లింగోజిగూడెంలోని పాఠశాలను సందర్శించారు పండుగ వాతావరణం లో పాఠశాలలో పునప్రారంభం చేసుకోవడం జరిగినది. *ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు* గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ..*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుంది. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి పై స్థాయికి వెళ్ళాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కౌన్సిలర్ శ్రీమతి ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు,శ్రీధర్ బాబు, బొడిగె బాలకృష్ణ పాల్గొన్నారు.

VijayaKumar

Jun 11 2024, 18:55

బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం : వి మాధవి లత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం" సందర్భంగా తేదీ 12-06-2024 బుధవారం ఉదయం 09 గంటలకు భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆద్వర్యంలో "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన" కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వఅధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వ్యాపారులు, వివిధ కర్మాగారాల యాజమాన్యాలు , ప్రజలు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కుల పరిరక్షణ కోసం, బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.

VijayaKumar

Jun 11 2024, 18:49

వంట కార్మికులకు గౌరవ వేతనం రూ. 10వేలు వెంటనే ఇవ్వాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

యాదాద్రి భువనగిరి జిల్లా : మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు.
            మంగళవారం రోజున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి  కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏ. ఓ జగన్ గారికి మరియి డీఈఓ కార్యాలయంలో ఏ. డి ప్రశాంత్ రెడ్డి గారికి వేరువేరుగా  వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  మేనిఫెస్టో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని దానిని వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని,  కార్మికులను తొలగించరాదని,  ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, వయసు పై బడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అదేవిధంగా స్లాబ్ రేటు పెంచుతూ నిత్యవసర వస్తువులన్నిటిని కూడా సరఫరా చేస్తూ పిల్లలకు పౌష్టికాహారం కింద కోడి గుడ్డను కూడా సరఫరా చేయాలని అయన కోరారు.
          ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సంధ్య, నిర్మల, లక్ష్మీ, అనసూర్య, వాణి, అండాలు, కృష్ణవేణి, సుగుణ తదితరులు  పాల్గొన్నారు.

VijayaKumar

Jun 10 2024, 21:45

వలిగొండ: వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన కసర బోయిన లింగయ్య మాజీ మత్స్యగిరి  గుట్ట డైరెక్టర్ కూతురు, కుమారుడి వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గరిసె రవి , మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆవుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ అరూర్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు చిలకమర్రి కనకా చారి ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మహిపాల్ రెడ్డి ,అరూరు మాజీ సర్పంచ్ చెమ్మయ్య ,మాజీ ఎంపీటీసీ చంద్రయ్య ,అరూరు హై స్కూల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల సత్యనారాయణ, జినుకల మల్లేష్ యాదవ్, ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్, వెలిమినేటి సంతోష్ కుమార్, కసర బోయిన సాయి మల్లు, గడ్డల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.