/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ? Yadagiri Goud
తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు!

- అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం 

- చాలా ప్రాంతాల్లో కొనుగోలు కానీ ధాన్యం

- కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు

- అకాల వర్షాలతో రైతులు ఆగమాగం

- తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన

- మంత్రులు, అధికారులు పోలింగ్‌లో నిమగ్నం

- రైతులను పట్టించుకునే నాథుడే కరువు

 అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్(secunderabad) పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు.

జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని(sonia gandhi) ఆహ్వానించాలని కాంగ్రెస్(congress) ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పదేళ్ల తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం, పంట రుణాల మాఫీని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు 2024 పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఇటివల ఎన్నికల సంఘం తెలిపింది.

దీంతోపాటు ఎన్నికల నిర్వహణలో ప్రమేయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిని సమావేశానికి పిలవవద్దని ఈసీ(EC) ఆదేశించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ఏదైనా కొత్త ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పక తీసుకోవాల్సిందే.

రాజకీయ పార్టీ అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులవైపు కూడా చూడండి...

•పాలకూరి రవి గౌడ్, నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి

 ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని గెలిపించడానికి మేధావులైన పట్టభద్రులను కృషి చేయాలని, అదే విధంగా తమ అమూల్యమైన ఓటును స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా వేసి గెలిపించుకోవాలని నల్లగొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ కోరారు..

నిరుద్యోగుల సమస్యల నుండి పుట్టుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థులను గెలుపించుకుంటే పెద్దల సభలో తమ సమస్యల గురించి పొరడగలుగుతారు అని అన్నారు..

గతంలో ఆయా పార్టీల అభ్యర్థులను గేలిపించుకుంటే ఆ పార్టీకి ఒక సంఖ్య పరంగా బలం పెరిగింది తప్పా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు..

కొన్ని రాజకీయ పార్టీల నుండి బరిలో వున్నా అభ్యర్థులు ఆ పార్టీ నుండి వచ్చే పార్టీ ఫండ్ నొక్కేయడానికే పోటీలో ఉన్నారు అని.. అలాంటి వ్యక్తులకు మీ అమూల్యమైన ఓటు వేసిన హృదయ అవుతుంది అని అన్నారు..

కాబట్టి మీరు చదువుకున్న ఓటర్లు కాబట్టి మీకున్న సమస్యలను పరిష్కారమ్ చేయగలుగుతాడు అనే నమ్మకం వున్న అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవి గౌడ్ కోరారు...

ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు..

ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు.. 

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ.. 

మధ్యాహ్నం 3గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయ్యనున్న టీటీడీ..

Streetbuzz News

గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్ రెడ్డి

ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''నేను పని చేసేటప్పుడు ధ్యానంగా ఉంటా. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిది. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలి..

సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్‌ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం'' అని తెలిపారు..

పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో మేం విడుదల చేయలేదు..

ఎన్నికల కమిషన్‌ నుంచి వీడియో బయటకు వెళ్లలేదు.. 

వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటున్నాం..  

దర్యాప్తులో వీడియో ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుంది.. 

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనలో విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చాం.. 

ఇప్పుడు మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. -ఏపీ సీఈవో ఎంకే మీనా.

సింహాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు పలికారు.

సుప్రభాత సేవలు నిర్వహించి, సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీ గంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం, వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.

Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా..

40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు.

బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..

తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..

తమిళనాడులో రెడ్‌ అలర్ట్..

కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు.. 

నీలగిరి పర్వత శ్రేణుల్లో ఎడతెరిపిలేని వానలు.. 

ఊటీలో కుండపోత వర్షం, పొంగిపొర్లుతున్న జలపాతాలు.

కేసిఆర్ పార్టీలోకి చేరనున్న విజయశాంతి ?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ పోరు నడిచింది. మూడు పార్టీలు మెజార్టీ సీట్ల గెలుపు పైన ధీమా గా ఉన్నాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేసారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానం అన్నారు.

దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టం అవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్‌ పొలిటికల్‌ సర్కిల్లో చర్చకు దారి తీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్‌లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారని చర్చ ఉంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన తాజా ట్వీట్‌తో రాములమ్మ అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది.