/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో మేం విడుదల చేయలేదు.. Yadagiri Goud
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో మేం విడుదల చేయలేదు..

ఎన్నికల కమిషన్‌ నుంచి వీడియో బయటకు వెళ్లలేదు.. 

వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటున్నాం..  

దర్యాప్తులో వీడియో ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుంది.. 

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనలో విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చాం.. 

ఇప్పుడు మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. -ఏపీ సీఈవో ఎంకే మీనా.

సింహాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు పలికారు.

సుప్రభాత సేవలు నిర్వహించి, సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీ గంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం, వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.

Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా..

40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు.

బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..

తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..

తమిళనాడులో రెడ్‌ అలర్ట్..

కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు.. 

నీలగిరి పర్వత శ్రేణుల్లో ఎడతెరిపిలేని వానలు.. 

ఊటీలో కుండపోత వర్షం, పొంగిపొర్లుతున్న జలపాతాలు.

కేసిఆర్ పార్టీలోకి చేరనున్న విజయశాంతి ?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ పోరు నడిచింది. మూడు పార్టీలు మెజార్టీ సీట్ల గెలుపు పైన ధీమా గా ఉన్నాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేసారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానం అన్నారు.

దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టం అవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్‌ పొలిటికల్‌ సర్కిల్లో చర్చకు దారి తీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్‌లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారని చర్చ ఉంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన తాజా ట్వీట్‌తో రాములమ్మ అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది.

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కేటీఆర్

జిల్లాలోఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న మార్గం వరంగల్ లేబర్ కాలనీ వద్ద

ఒక వ్యక్తి యాక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్న విషయం గమనించిన కేటీఆర్ వెంటనే కారు దిగి తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స నిమిత్తం

వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా యాక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్న వ్యక్తి స్థానికంగా ఉండే అంజయ్య (55) గా గుర్తించారు.

Streetbuzz News

లైసెన్స్ కోసం RTO లను సందర్శించాల్సిన అవసరం లేదు..!

జూన్ 1, 2024 నుండి, ప్రజలు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTOలు) బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలల్లో తీసుకోవచ్చు.        

ఈ ప్రైవేట్ పాఠశాలలు డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన పరీక్షలు మరియు సర్టిఫికేట్‌లను అందించడానికి అనుమతించబడతాయి.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది.

సుమారు 900,000 పాత ప్రభుత్వ వాహనాలను తొలగించడం మరియు కఠినమైన కార్ ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం కొత్త నిబంధనల లక్ష్యం.

అతివేగానికి సంబంధించి జరిమానా ఇప్పటికీ ₹ 1000 మరియు ₹ 2000 మధ్య ఉంది.కానీ మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే, వారు ₹ 25,000 పెద్ద జరిమానాను ఎదుర్కొంటారు.అలాగే, వాహన యజమాని రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది మరియు మైనర్ వారికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందలేరు.

అవసరమైన పత్రాలను తగ్గించడం ద్వారా కొత్త లైసెన్స్ పొందడాన్ని మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. అవసరమైన డాక్యుమెంట్‌లు మీరు టూ-వీలర్ లేదా ఫోర్-వీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది,అంటే RTOల వద్ద తక్కువ ఫిజికల్ చెకప్‌లు అవసరం.

భారతదేశ రహదారులను మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేయడానికి,9,000 పాత ప్రభుత్వ వాహనాలను తొలగించి, ఇతర వాహనాలకు ఉద్గార ప్రమాణాలను మెరుగుపరచాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.

 ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు నియమాలు ఏమిటి?

నిబంధనల ప్రకారం డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం 1 ఎకరం భూమి ఉండాలి.నాలుగు చక్రాల వాహనాలకు శిక్షణ ఇస్తే వారికి రెండెకరాల భూమి కావాలి.డ్రైవింగ్ పాఠశాలలు సరైన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి.

శిక్షకులు తప్పనిసరిగా హైస్కూల్ డిప్లొమా లేదా తత్సమానం కలిగి ఉండాలి,కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం మరియు బయోమెట్రిక్స్ మరియు IT సిస్టమ్‌లపై పరిజ్ఞానం ఉండాలి.

లైట్ మోటార్ వెహికల్స్ (LMV) కోసం, 8 గంటల థియరీ మరియు 21 గంటల ప్రాక్టికల్‌తో 4 వారాలలో 29 గంటల పాటు శిక్షణను అందించాలి.అయితే, హెవీ మోటార్ వెహికల్స్ (HMV) కోసం,8 గంటల థియరీ మరియు 31 గంటల ప్రాక్టికల్‌తో 6 వారాల పాటు 38 గంటల శిక్షణ అందించాలి.

లైసెన్స్ ఫీజు మరియు ఛార్జీలు కొత్త చట్టాల ప్రకారం,లెర్నర్స్ లైసెన్స్ (ఫారం 3) జారీ చేయడానికి ₹150 ఖర్చు అవుతుంది,లెర్నర్ లైసెన్స్ టెస్ట్ లేదా రిపీట్ టెస్ట్ కోసం అదనంగా ₹50 ఉంటుంది. డ్రైవింగ్ పరీక్ష కోసం లేదా పునరావృత పరీక్ష అవసరమైతే,రుసుము ₹ 300.

అలాగే,డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేయడానికి అయ్యే ఖర్చు ₹200, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందడం ₹1,000 వద్ద గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.లైసెన్స్‌కు మరొక వాహన తరగతిని జోడించాల్సి వస్తే,దానికి ₹500 ఛార్జ్ చేయబడుతుంది.

ప్రమాదకర వస్తువుల వాహనాలను నడుపుతున్న వారికి, ఆమోదం లేదా అధికార పునరుద్ధరణకు ₹200 ఖర్చు అవుతుంది. అదేవిధంగా,స్టాండర్డ్ డ్రైవింగ్ లైసెన్స్‌ని రెన్యూవల్ చేసుకోవడం ₹200 అవుతుంది, అయితే ఈ రెన్యూవల్ గ్రేస్ పీరియడ్ తర్వాత జరిగితే, రుసుము అదనంగా ₹300కి అదనంగా సంవత్సరానికి ₹1000 లేదా గ్రేస్ పీరియడ్ ముగిసే సమయానికి దానిలో కొంత భాగం చెల్లించబడుతుంది.

డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్షన్ స్కూల్‌లు శిక్షణ లేకుండా లైసెన్స్‌లను జారీ చేయడం లేదా పునరుద్ధరించడం కోసం భారీ ₹5,000 రుసుమును ఎదుర్కోవలసి ఉంటుంది.మరియు ఈ పాఠశాలల నుండి నకిలీ లైసెన్స్ పొందడానికి అదే రుసుము వర్తిస్తుంది.

రూల్ 29 ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ ఆర్డర్‌లకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ₹500 ఖర్చు అవుతుంది.డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా లేదా ఇతర వివరాలను మార్చుకుంటే ₹200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Lok sabha Polls: హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది..

జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా గతంలో సాధించిన సీట్లకంటే ఎక్కువ గెలుపొందేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు బీజేపీని కట్టడిచేసేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. బీజేపీకి 200 సీట్లు దాటకుండా కట్టడి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ను 50 సీట్లలోపే కట్టడి చేయాలనే మాస్టర్ ప్లాన్‌లో బీజేపీ ఉంది. ఇప్పటివరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన గొప్పగా లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఐదు దశల ఎన్ని్కల్లో కాంగ్రెస్ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరో దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంతో తెలుసుకుందాం..

యూపీలో గట్టి పోటీ

ఆరో దశలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్‌పూర్, ప్రయాగ్‌రాజ్, అంబేద్కర్‌నగర్, శ్వస్తీ, దుమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, లాల్‌గంజ్, జాన్‌పూర్, అజంగఢ్, ఫిష్ సిటీ, భదోహి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ 9 సీట్లు, బీఎస్పీ 4, ఎస్పీ ఒక సీటు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగా.. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీచేస్తున్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎస్పీ ఈసారి కొత్త సమీకరణంతో ఎన్నికల బరిలోకి దిగింది. అఖిలేష్ యాదవ్ ఈసారి దళిత, ఓబీసీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. ఈ వర్గాల ఓట్లను పొందడం ద్వారా యూపీలో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనే ఆలోచనలో అఖిలేష్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను తిరిగి సాధించడం బీఎస్పీకి అతిపెద్ద సవాల్ కానుంది. ఇండియా, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో బీఎస్పీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు మోదీ, యోగీ చరిష్మాతో పూర్వాంచల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది..

బీహార్, జార్ఖండ్‌లో..

బీహార్‌లోని వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివర్, వైశాలి, గోపాల్‌గంజ్, మహారాజ్‌గంజ్, సివాన్ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ నాలుగు, జేడీయూ మూడు, ఎల్‌జేపీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఈ స్థానాల్లో తమ ఖాతాను తెరవలేకపోయాయి. ఈసారి పోటీ భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ప్రధాన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేకు తమ సీట్లు కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. 

జార్ఖండ్‌లోని గిరిడి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. 

బెంగాల్, ఒడిశాలో

పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్‌సభ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్‌లోని తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్‌గ్రామ్, మెద్నీపూర్, పుర్లియా, బంకురా, బిష్ణుపూర్ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2019లో ఈ 8 సీట్లలో బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ మూడు సీట్లు గెలుచుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్, కెంజోర్, ధెంకనల్, కటక్, పూరి, భునేశ్వర్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకోగా, బీజేడీకి నాలుగు సీట్లు గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రెండింటిలోనూ బీజేపీ తన సీట్లను గతంతో పోలిస్తే పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగాల్‌లో బీజేపీ టీఎంసీతో, ఒడిశాలో బీజేడీతో ప్రధాన పోటీని ఎదుర్కొంటుంది.

ఢిల్లీ, హర్యానాలో..

ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, హర్యానాలోని మొత్తం పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో మరోసారి ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేయడం బీజేపీకి కష్టతరంగా మారింది. బీజేపీ ఏడుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్లు నిరకారించింది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీకి మాత్రమే తిరిగి టికెట్ కేటాయించింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ కన్హయ్య కుమార్‌ను రంగంలోకి దించడం ద్వారా పోటీని ఆసక్తికరంగా మార్చింది. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది.)

కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా !

- లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ

- మరో నలుగురి ప్రమేయంపై వాదనలు

- అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు

- 24న కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురి ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్‌ చేసింది. కవితతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌) దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, చరణ్‌ప్రీత్‌ సింగ్‌, ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌పై అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10న సుమారు 200 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

దానిని పరిగణనలోకి తీసుకునే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కవితతో పాటు మిగిలిన నలుగురి ప్రమేయంపై ఈడీ బలమైన వాదనలు వినిపించింది. కాల్‌ డేటాతో పాటు కాల్‌ రికార్డులను కూడా ేసకరించామని పేర్కొంది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్ల సీరియల్‌ నంబర్లను టోకెన్‌గా వాడారని ఈడీ ఆరోపించింది. ‘ప్రిన్స్‌ కుమార్‌ చారియట్‌ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు.

రూ.100 కోట్ల అక్రమ మళ్లింపులో ఆయన పాత్ర స్పష్టంగా ఉంది. హవాలా ఆపరేటర్‌ కాంతికుమార్‌ ద్వారా మూడు దశల్లో రూ.16 లక్షలు ప్రిన్స్‌ కుమార్‌కు అందాయి. అందులో మూడు కరెన్సీ నోట్ల సీరియల్‌ నంబర్లను టోకెన్‌ నంబర్‌గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారు. మరో నిందితుడు అరవింద్‌ సింగ్‌ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడు.

కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులోనే సీఎం కేజ్రీవాల్‌పైనా ఈడీ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 28న రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

AP Election:పిన్నెల్లి విధ్వంసం సీఈఓ పై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 గంటల లోపు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది..

ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు ఎన్నికల కమిషన్ తాఖీదు పంపింది. పాల్వాయి గేట్‌లో ఈవీఎం ధ్వంసం సంఘటనపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం అడిగింది.

అసలేం జరుగుతోంది..?

సీసీ ఫుటేజీలో ఉన్నది.. ఘటనలో పాల్గొన్నది ఎమ్మెల్యేనా.. కాదా..? అని సీఈసీ ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే కేసు ఎందుకు పెట్టలేదు..? అని సీఈవోపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా..? లేదా.. నిందితుడిగా చేర్చి ఏంటే అరెస్ట్ చేశారా..? లేదా అని ముఖేష్ కుమార్‌ను సీఈసీ నిలదీసింది. ఇప్పటి వరకూ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని క్లియర్ కట్‌గా సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ముకేశ్‌కుమార్ మీనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలియవచ్చింది. దీంతో ఏం జరుగుతుందో ఏమో అని ఇటు పిన్నెల్లి బ్రదర్స్.. అటు వైసీపీలో టెన్షన్ నెలకొం

పోలింగ్ రోజు జరిగింది ఇదీ..?

రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్‌ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్‌ బయటే గొడ్డలితో దాడి చేశారు..