మూసి పరివాహక ప్రాంతంలో ఏ గ్రేడ్ కిందనే ధాన్యం కొనుగోలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్
రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా!! ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు!! రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రైతులను ప్రభుత్వం తీవ్రమైన మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన పంటకు 'ఏ గ్రేడ్' ఇవ్వకుండా 'బి గ్రేడ్' కింద కొనుగోలు చేయడం రైతాంగానికి తీవ్రమైన అన్యాయమన్నారు వెంటనే బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు ప్రభుత్వం, వాతావరణ శాఖ వర్షాలు రాబోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో దాన్యం కుప్పలు, కుప్పలుగా కొనుగోలు జరపకుండా మిగిలిపోయిందన్నారు అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని లారీల కొరతను,గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ఇద్దరి మద్య రైతులు నష్టపోతున్నారన్నారు తరుగు పేరుతో క్వింటాల్ కు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వానికి తెలియదా?? అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే ఏలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, మెరుగు వెంకటేశం, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కలుకూరి ముత్యాలు, కందడి సత్తిరెడ్డి,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు,కొమ్ము స్వామి,దయ్యాల సత్యరాములు, కందగట్ల సాయిరెడ్డి,వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
![]()

రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా!! ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు!! రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రైతులను ప్రభుత్వం తీవ్రమైన మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన పంటకు 'ఏ గ్రేడ్' ఇవ్వకుండా 'బి గ్రేడ్' కింద కొనుగోలు చేయడం రైతాంగానికి తీవ్రమైన అన్యాయమన్నారు వెంటనే బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు ప్రభుత్వం, వాతావరణ శాఖ వర్షాలు రాబోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో దాన్యం కుప్పలు, కుప్పలుగా కొనుగోలు జరపకుండా మిగిలిపోయిందన్నారు అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని లారీల కొరతను,గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ఇద్దరి మద్య రైతులు నష్టపోతున్నారన్నారు తరుగు పేరుతో క్వింటాల్ కు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వానికి తెలియదా?? అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే ఏలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, మెరుగు వెంకటేశం, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కలుకూరి ముత్యాలు, కందడి సత్తిరెడ్డి,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు,కొమ్ము స్వామి,దయ్యాల సత్యరాములు, కందగట్ల సాయిరెడ్డి,వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

దొంగలు బాబోయ్ దొంగలు*.... *సెల్ ఫోన్లు, పర్సులు, బైకులు మాయం* *పట్టించుకోని అధికారులు* *సీ సీ కెమెరాలు, పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ నిత్యం ముప్పై నుంచి నలబై వేల మంది ప్రయాణికులతో నిండి ఉండే భువనగిరి బస్ స్టేషన్లో దొంగల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం తో మహిళల రద్దీ ఎక్కువ అవడంతో దొంగలు, తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. గత మూడు నెలల కాలంలోనే ముప్పై కి పైగా దొంగ తనాలు కేవలం భువనగిరి బస్ స్టేషన్ లోనే జరిగాయని తెలుస్తోంది. చాలా మంది బాధితులు పోలీసులకు పిర్యాదు చేయకుండానే వెళుతున్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్ అందుబాటులో లేకపోవడం, పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటారనే నమ్మకం లేకపోవడం, బస్ స్టేషన్ లో పోలీస్ ఔట్ పోస్ట్ లేకపోవడం వల్ల బాదితుల పిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అద్దెల రూపంలో ప్రతి నెల పది లక్షల రూపాయిల ఆదాయం ఉన్నా, ఆర్టీసీ అధికారులు కనీసం ఇద్దరు హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే, ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక్క సీ సీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం గమనార్హం. *ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలి* కొడారి వెంకటేష్ *వినియోగదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు* భువనగిరి బస్ స్టేషన్ లో తగినన్ని సీసీ కెమెరాలు, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారినుండి ప్రయాణికులను రక్షించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. భువనగిరి బస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా ఆటోలు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. సురేపల్లి తండా సర్పంచ్ (కుమారుడు) కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో తరలిన గిరిజన రైతులు. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలనీ కోరారు.
దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ భువనగిరి నియోజకవర్గం పట్టణ పరిధిలోని 65 , 91 బూత్ నెంబర్లలో పట్టణ 8 వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పోలింగ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు భారీగా భద్రతను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానిక 8వ వార్డు జంఖాన్నగూడెం , రామ్ నగర్ , సీతానగర్ లలో ఓటర్లు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత మందులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను , మంచినీటి సదుపాయాన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూ పద్ధతిలో నిలబడి నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లకు , పోలింగ్ సిబ్బందికి , పోలీసులకు , మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగరెక్క స్వామి , కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయన సబిత గోపాల్ , డాక్టర్లు సాయి పవన్ , ఎ యన్ యం టి. ప్రేమలత , ఇంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.
May 16 2024, 15:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.0k