/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ Yadagiri Goud
నేడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ‌ పిఠాపు రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచి మధ్యా హ్నం వరకూ రోడ్ షో జరగనుంది.అనంత‌రం చెందుర్తిలో రోడ్ షో ప్రారంభమవుతుంది.

తర్వాత రోడ్ షో వన్నెపూ డి, కొడవలి, వెల్దర్తి, దొంత మూరు, బి.కొత్తూరు, పి. తిమ్మాపురం, గోకివాడ, జాములపల్లి, నరసింగా పురం, ఎల్‌.ఎన్.పురం, కొలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కంద్రాడమ,మీదుగా కుమారపురం వరకూ రోడ్ షో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పవన్ రోడ్ షోకు జనం భారీగా తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి...

నేడు క‌ర్ణాట‌క‌కు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ క‌ర్ణాట‌క‌కు వెళ్ళనున్నారు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చా రానికి ఇవాళ రేవంత్‌రెడ్డి విరామం ఇచ్చారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చా రంలో భాగంగా కర్ణాట‌క‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నా రు.14 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు తెలం గాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభలో పాల్గొంటారు..

గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన RCB సేన

గుజ‌రాత్ టైటాన్స్‌ ను వాళ్ల సొంత‌గ‌డ్డ‌పైనే 9 వికెట్ల‌తో చిత్తు చేసింది ఆర్సీబీ.. ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడిన ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగ‌ళూరును గెలిపిం చాడు. 

దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్ట‌రీ చేరింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(70 నాటౌట్) సైతం హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా 200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.5 ఓవ‌ర్ల‌కే చేదించింది..

భారీ ఛేద‌న‌లో ఓపెనింగ్ జోడీ మ‌ళ్లీ విఫ‌ల‌మైంది. ప‌వ‌ర్ ప్లేలోనే ఆర్సీబీ తొలి వికెట్ ప‌డింది. ఓపెన‌ర్ ఫాఫ్ డూప్లెసిస్(24) భారీ షాట్ ఆడి ఔట‌య్యాడు. సాయి కిశోర్ ఓవ‌ర్లో బౌండ‌రీ వ‌ద్ద విజ‌య్ శంక‌ర్ చేతికి చిక్కాడు. 

దాంతో, 40 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న విల్ జాక్స్ క్రీజులోకి వ‌చ్చాడు. కోహ్లీ జ‌త‌గా జాక్స్ ఓ రేంజ్‌లో ఆడాడు. ర‌షీద్ ఖాన్ వేసిన 16వ ఓవ‌ర్లో జాక్స్ మ‌రింత రెచ్చిపోయాడు. 

వ‌రుస‌గా 6, 6, 4, 6, 6 బాదేసి శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ 9 వికెట్ల‌తో గెలుపొందింది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 200

బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ 84 (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షారుక్ ఖాన్ 58 (30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. గిల్ 16, మిల్లర్ 26, సాహా 5 పరుగులు చేశారు.

బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మాక్స్‌వెల్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు...

సింగరేణిలో ఉద్యోగాల్లో :దరఖాస్తు తేదీల్లో మార్పు

సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్‌ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు.. ఆ తేదీల్లో మార్పు చేశారు.

వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15న మధ్యాహ్నం 12గంట ల నుంచి జూన్‌ 4 సాయం త్రం 5గంటల వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవ చ్చు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌లో తెలుసు కోవచ్చు.

భర్తీ చేయనున్న పోస్టులివే..

ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీఈఅండ్‌ ఎం ఈ2 గ్రేడ్‌- 42, మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌) ఈ2 గ్రేడ్‌- 7.నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరు టీఅం డ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(మెకానికల్‌) టీఅండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 9, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగి రీ-1- 98 చొప్పున భర్తీ చేయనున్నారు.

అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ ఎస్టీ,బీసీ,దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది...

ఆదివారం రాజన్న ఆలయంలో భక్తుల సందడి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సేవలో తరించారు. 

ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకు న్నారు. 

ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి...

కాంగ్రెస్‌ పార్టీకి అర్విందర్‌ సింగ్‌ రాజీనామా?

కాంగ్రెస్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షు డు అర్విందర్‌ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడిం చాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ యూనిట్‌ అంగీకరించ లేదని రాజీనామా లేఖలో అర్విందర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసా గుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవ డం పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమా ల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు.

అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పా రు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామ కాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమ తించడం లేదని ఆరోపిం చారు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు. అయితే, మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు.

కానీ, రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు.....

హైదరాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌,మెట్రో కారిడార్‌ పరిశీలన

•14 కిలోమీటర్లు నడుస్తూ పరిశీలించిన హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీయస్‌ రెడ్డి

కొత్తగా తలపెట్టిన హైదరా బాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ మెట్రో స్టేషన్‌ స్థానాలను ఖరారు చేసేందుకు హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీయస్‌ రెడ్డి ఆదివారం నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 14 కిలోమీటర్లు కాలినడకన పరిశీలించారు.

నాగోలు-ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో కొత్తగా నాగోల్‌ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్‌.. ప్రస్తుతం ఉన్న నాగోల్‌ స్టేషన్‌కు దగ్గరలోనే ఎడమ వైపున (ఎల్‌బీనగర్‌ వైపు) ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాన్‌కోర్స్‌ లెవల్‌లో కలుపు తూ విశాలమైన స్కైవాక్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు.

నాగోల్‌ స్టేషన్‌ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్ల దృష్ట్యా, మెట్రో ఎలైన్‌మెంటును మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపాలన్నారు.

అలాగే మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌లతో నిర్మించాలని సూచించారు. ఇక కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీని ఇస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరి అవసరాల కోసం అదనపు స్టేషన్‌కు ప్లాన్‌ చేయాలని చెప్పారు. ప్రతిపాదిత నాగోల్‌ ఆర్టీఓ స్టేషన్‌ను అల్కాపురి జంక్షన్‌ లక్కీ రెస్టారెంట్‌ కు సమీపంలో నిర్మించాలన్నారు.

ఎల్బీనగర్‌ జంక్షన్‌కు కుడి వైపున ఉండబోయే కొత్త స్టేషన్‌.. కారిడార్‌-1లో మియాపూర్‌-ఎల్బీనగర్‌ ప్రస్తుత ఎల్బీనగర్‌ స్టేషన్‌కు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు. బైరమల్ గూడ,సాగర్‌ రోడ్‌ జంక్షన్‌లో ఇప్పటికే ఎత్తైన ఫ్లైఓవర్‌లు ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లైన్‌ ఎత్తు ఇంకా పెంచాల్సి ఉంది.

అయితే బైరామల్‌గూడ/సాగర్‌ రోడ్‌ జంక్షన్‌ మెట్రో స్టేషన్‌ ఎత్తును తగ్గించడాని కి గాను, మెట్రో అలైన్‌మెంట్‌ ను ఫ్లై ఓవర్లకు కుడి వైపున కు మార్చాల్సి ఉంటుందని, పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలని అధికారులకు, కన్సల్‌టెంట్‌కు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సూచించారు.

మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట జంక్షన్‌, ఒవైసీ హాస్పిటల్‌, డీఆర్‌డీఓ, హఫీజ్‌ బాబా నగర్‌ తదితర ప్రాంతాలలో ప్రతిపాదిత స్టేషన్‌లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులుకు వీలుగా జంక్షన్‌లకు సమీపంలో నిర్మించాలని సూచించారు.

చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవ ర్‌ నిర్మాణం ఉన్నందున ఇక్కడ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నిర్మాణం, అలాగే, చంద్రాయణగుట్ట వరకూ చేపట్టిన పాత నగరం మెట్రో విస్తరణ పనులు, టెర్మినల్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు ఒక ఇంజినీరింగ్‌ సవాలుగా మారే అవకాశం ఉందని ఎన్వీయస్‌ అన్నారు...

ఈ నెల 30 న పాలిటెక్నిక్ ఫలితాల ప్రాథమిక" కీ "విడుదల

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిటెక్నిక్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది.

పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవే శాలకు శనివారం నిర్వహిం చిన పాలిసెట్ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

1,59,989 మంది విద్యార్థు లు దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో లక్ష 41, 978 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

కాగా మే10 వ తేదీలోపు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడిం చారు.....

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: హెడ్ కానిస్టేబుల్ మృతి

పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు.

కొద్ది రోజుల పాటు ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కాని స్టేబుల్‌గా విధులు నిర్వహి స్తున్న 1995 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందాడు.

గతంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో సైతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేన్‌కు బదిలీపై వెళ్లారు.

శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ కాగా గతంలోనే వారి కుటుంబం కామారెడ్డి లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్, కోనరా వుపేట ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....