అంగన్వాడి కేంద్రాలను ప్రక్షాళన చేయాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్
![]()
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం గర్భిణీ కి అందించిన ఆహారంలో ఈగలు పడి చనిపోయి ఉండడం, అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత నెలలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారని వెంకటేష్ గుర్తు చేశారు. అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సూచనలు అమలు చేసి, పసి పిల్లలకు, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.




ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.





Apr 27 2024, 21:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.8k