/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ.. Yadagiri Goud
ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ..

అమరావతి: సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు..

ఈ మేరకు జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు..

''మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ తరఫున ఇదే మా డిమాండ్‌'' అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు..

రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాపాడుకోవాలి: చంద్రబాబు

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు..

జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు. ''గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీసేశారు. గాయం కపడిందా?'' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

'' సీఎం జగన్‌ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి.. గోదావరిలో కలిపారు. వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ నెరవేరిందా? రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైకాపా మేనిఫెస్టోలో లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ పైనే. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేస్తా. తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.15 వేలు ఇస్తా. ఆత్మకూరు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్‌ నొక్కండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను మార్చబోతున్నాయి.

మేం వస్తే అభివృద్ధి.. వైకాపా వస్తే అరాచకం. మా పాలన స్వర్ణయుగం.. వైకాపా పాలన రాతియుగం. సీఎం జగన్‌ ఇవాళ చేతులెత్తేశారు. వైకాపా మేనిఫెస్టోతో పోలిస్తే.. మా మేనిఫెస్టో సూపర్‌ సక్సెస్‌. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్‌. నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు. వైకాపా మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్‌. తమ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని అన్నారు. అందులో హామీలను నెరవేర్చారా?మద్య నిషేధం చేస్తానన్న హామీ ఏమైంది? స్వార్థం కోసం మహిళల తాళిబొట్లు తెంపేసిన వ్యక్తి జగన్‌'' అని చంద్రబాబు విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితుడు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లో బీఆర్ ఎస్ పార్టీ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కేసీఆర్ కు అత్యంత సన్ని హితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి శనివా రం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరగా, అతనికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...

చట్టపరమైన భద్రత లేకనే బీసీ సామాజిక వర్గాల పై దాడులు : పాలకూరి రవి

చట్టపరమైన భద్రత లేని కారణంచేత బీసీ సామాజిక వర్గాల పై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థులు పాలకూరి రవి పాలకూరి రమాదేవి..

నల్గొండ పార్లమెంటు నుండి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతూ..

బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని మన ఓటు మనం వేసుకుంటేనే పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తుందని నల్గొండ పార్లమెంటు నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో న నిలబడడం జరిగిందని అన్నారు..

వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలను జెండాలు మోయిస్తూ తమ దగ్గర బానిసల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రశ్నించినటువంటి కార్యకర్తలపై కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి గడగోజు విజయ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దొరేపల్లి హరిశంకర్, పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీశైలం యాదవ్,మాదగోని శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

AP Election : కొత్త స్కీం లేదు మెరుపులు లేవు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు..

మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలు ఉంటాయని వైసీపీ క్యాడర్ ఎక్స్ పెక్ట్ చేసింది. శ్రేణుల ఆశలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నీళ్లు చల్లారు..

లేని జనాకర్షక పథకాలు

మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు లేకపోవడంతో శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త పథకాలు, జనాలను ఆకర్షించే పథకాలు లేకపోవడంపై క్యాడర్‌లో నిర్వేదం నెలకొంది. కూటమి ఇచ్చిన హామీలతో పోలిస్తే తమది మేనిఫెస్టోనేనా అనే సందేహాం కలుగుతుందని కొందరు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో ఏడాదికి రూ.2 వేల మాత్రమే పెంచారు. రూ.500 పెన్షన్ పెంచడానికి 5 సమయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ రెండు అంశాలతో తమ పార్టీ పని అయిపోయిందని క్యాడర్ కాస్త ఆగ్రహంతో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దాంతో ఆ ఓటర్లను తమ పార్టీ కోల్పోతుందని వివరిస్తున్నారు..

అదిరిన కూటమి మేనిఫెస్టో

కూటమి మేనిఫెస్టోలో 50 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. దివ్యాంగులకు రూ.6 వేలు అందజేస్తామని స్పష్టం చేసింది. ఆ రెండు ప్రకటనలు బాగున్నాయని వైసీపీ ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. తమ పార్టీ మాత్రం సోసోగా మేనిఫెస్టో రూపొందించినట్టు ఉందని మండిపడ్డారు. మూడు రాజధానులపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తామని ప్రకటించడంపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇది జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. మేనిఫెస్టోలో చంద్రబాబు గురించి ప్రస్తావించడం, ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పడం తప్ప.. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఉన్న పేరు కాస్త పోతుందని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు..

టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు..

భువనగిరితో పాటు ఇతర స్థానాల్లో మద్దతు కోరినట్లు చెప్పారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారన్నారు. దేశంలో ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నారని వివరించారు. ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉందని పేర్కొన్నారు. అధిష్ఠానంతో చర్చించి ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఆ పార్టీ సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పారు.

తమ అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకోవాలని సీఎం కోరారని తమ్మినేని వీరభద్రం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. భాజపా, ఇతర శక్తులను అడ్డుకునేందుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు..

హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. శనివారం తృణముల్‌ కాంగ్రెస్‌ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్ధి శతృఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్‌సోల్, కుల్టీలలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు..

అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ ఎక్కారు.హెలికాఫ్టర్‌ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారీ పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేత‌లు భేటీ..

తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణా లు ఆసక్తిగా మారుతున్నా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.

ఈ నేఫథ్యంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.ఇవాళ‌ సీఎం నివాసంలో ముఖ్య మంత్రి సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు.

ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది....

నేడు బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీ కగా అవతరించి యావత్‌ దేశాన్ని తనవైపు చూసేలా చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలి తంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వ ఘట్టం.

23 ఏళ్ల ప్రస్థానంలో దాదా పు 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరా టం సాగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బిఆర్‌ ఎస్‌, రాష్ట్ర ఆవిర్భావఅనం తరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిది న్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగింది.

ఆ స్వల్పకాలంలోనే పరిపా లనలో అనేక మార్పులను చేసి చూపించింది. పార్టీ చీఫ్ కేసీఆర్ అసమాన వ్యూహ చతురత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్‌ చేతిలో బిఆర్‌ఎస్‌ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా 23 ఏళ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగు పెడుతుంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు, అస్తిత్వమే ప్రాతిపది కగా ఏర్పడిన బిఆర్‌ఎస్‌ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అనేక సంచలనాలకు కేంద్రబిం దువైంది‌. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజా న్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాము లను చేసింది.

దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్‌.... పరాజయ భారాలతో బిక్కచచ్చిపో యిన వేళ.., 2004లో బిఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ కృషితో పాటు... కేసీఆర్ స్థిర నిర్ణయాలు కారణ మయ్యాయి.

2001లో కరీంనగర్‌లో నిర్వ హించిన సింహగర్జన బహి రంగసభ నుంచి, 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగా ణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్‌ లోనూ కేసీఆర్‌ నిర్వహిం చిన బహిరంగ సభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండా నిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.