/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz AP Election : కొత్త స్కీం లేదు మెరుపులు లేవు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో Yadagiri Goud
AP Election : కొత్త స్కీం లేదు మెరుపులు లేవు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు..

మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలు ఉంటాయని వైసీపీ క్యాడర్ ఎక్స్ పెక్ట్ చేసింది. శ్రేణుల ఆశలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నీళ్లు చల్లారు..

లేని జనాకర్షక పథకాలు

మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు లేకపోవడంతో శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త పథకాలు, జనాలను ఆకర్షించే పథకాలు లేకపోవడంపై క్యాడర్‌లో నిర్వేదం నెలకొంది. కూటమి ఇచ్చిన హామీలతో పోలిస్తే తమది మేనిఫెస్టోనేనా అనే సందేహాం కలుగుతుందని కొందరు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో ఏడాదికి రూ.2 వేల మాత్రమే పెంచారు. రూ.500 పెన్షన్ పెంచడానికి 5 సమయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ రెండు అంశాలతో తమ పార్టీ పని అయిపోయిందని క్యాడర్ కాస్త ఆగ్రహంతో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దాంతో ఆ ఓటర్లను తమ పార్టీ కోల్పోతుందని వివరిస్తున్నారు..

అదిరిన కూటమి మేనిఫెస్టో

కూటమి మేనిఫెస్టోలో 50 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. దివ్యాంగులకు రూ.6 వేలు అందజేస్తామని స్పష్టం చేసింది. ఆ రెండు ప్రకటనలు బాగున్నాయని వైసీపీ ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. తమ పార్టీ మాత్రం సోసోగా మేనిఫెస్టో రూపొందించినట్టు ఉందని మండిపడ్డారు. మూడు రాజధానులపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తామని ప్రకటించడంపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇది జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. మేనిఫెస్టోలో చంద్రబాబు గురించి ప్రస్తావించడం, ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పడం తప్ప.. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఉన్న పేరు కాస్త పోతుందని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు..

టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు..

భువనగిరితో పాటు ఇతర స్థానాల్లో మద్దతు కోరినట్లు చెప్పారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారన్నారు. దేశంలో ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నారని వివరించారు. ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉందని పేర్కొన్నారు. అధిష్ఠానంతో చర్చించి ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఆ పార్టీ సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పారు.

తమ అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకోవాలని సీఎం కోరారని తమ్మినేని వీరభద్రం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. భాజపా, ఇతర శక్తులను అడ్డుకునేందుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు..

హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. శనివారం తృణముల్‌ కాంగ్రెస్‌ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్ధి శతృఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్‌సోల్, కుల్టీలలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు..

అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ ఎక్కారు.హెలికాఫ్టర్‌ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారీ పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేత‌లు భేటీ..

తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణా లు ఆసక్తిగా మారుతున్నా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.

ఈ నేఫథ్యంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.ఇవాళ‌ సీఎం నివాసంలో ముఖ్య మంత్రి సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు.

ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది....

నేడు బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీ కగా అవతరించి యావత్‌ దేశాన్ని తనవైపు చూసేలా చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలి తంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వ ఘట్టం.

23 ఏళ్ల ప్రస్థానంలో దాదా పు 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరా టం సాగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బిఆర్‌ ఎస్‌, రాష్ట్ర ఆవిర్భావఅనం తరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిది న్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగింది.

ఆ స్వల్పకాలంలోనే పరిపా లనలో అనేక మార్పులను చేసి చూపించింది. పార్టీ చీఫ్ కేసీఆర్ అసమాన వ్యూహ చతురత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్‌ చేతిలో బిఆర్‌ఎస్‌ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా 23 ఏళ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగు పెడుతుంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు, అస్తిత్వమే ప్రాతిపది కగా ఏర్పడిన బిఆర్‌ఎస్‌ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అనేక సంచలనాలకు కేంద్రబిం దువైంది‌. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజా న్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాము లను చేసింది.

దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్‌.... పరాజయ భారాలతో బిక్కచచ్చిపో యిన వేళ.., 2004లో బిఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ కృషితో పాటు... కేసీఆర్ స్థిర నిర్ణయాలు కారణ మయ్యాయి.

2001లో కరీంనగర్‌లో నిర్వ హించిన సింహగర్జన బహి రంగసభ నుంచి, 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగా ణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్‌ లోనూ కేసీఆర్‌ నిర్వహిం చిన బహిరంగ సభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండా నిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.

ఏపీలో భానుడి ఉగ్రరూపం

ఏపీలో భానుడి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈవాళ రాష్ట్రంలోని 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం 15, విజయనగరం 22, పార్వతీపురం మన్యం 13, అల్లూరిసీతారామరాజు 3, అనకాపల్లి 6, తూర్పుగోదావరి 2, ఏలూరు 2 కాకినాడ ఒక మండలంలో విజయవాడ 12. నందిగామ 2. తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడత లో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించను న్నారు.

వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగు తోంది. ఎందుకంటే.. మధ్య ప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపో యారు.

దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు మే 7వ తేదీకి వాయిదా వేసింది. .

పొలింగ్ స‌మ‌యం పెంపు ..

ఎండలు, వడగాలుల ప్రభా వం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయా న్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారి యా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమ స్యాత్మక ప్రాంతాల్లో సాయం త్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు.

అయితే.. ఎండల కార‌ణం గా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగిం చారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియా లోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పో లింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది...

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు..

వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వ హిస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థి స్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించను న్నారు. పెద్ద శంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొన నున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి రాక సంద ర్భంగా పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు...

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు.

దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ నున్నాయి.

ఈ సందర్భంగా శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి లోని నందిగామ పరిసరాల్లో ఇవాల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.నేడు మధ్యాహ్నం నుంచి సాయం త్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయ ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

వివిధ విభాగాల అధికా రులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించ డంతో పాటు రోడ్ల మరమ్మ తులు చేపట్టారు.

నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్‌ వయా పెద్దగోల్కొండ మీదు గా ఇండియన్‌ బేకరీ తొండు పల్లి, బుర్జుగడ్డ వద్ద యూట ర్న్‌ తీసుకొని ముచ్చింతల్‌, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్‌, తిమ్మాపూర్, షాద్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు...